యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. నితిన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కృతి శెట్టితో పాటు కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ష్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను హీరోయిన్గా ఎంపిక చేయాలని భావించారట.
అయితే ఆమెను సంప్రదించగా.. డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల రష్మిక నో చెప్పిందట. ఆ తర్వాత కృతి శెట్టిని మేకర్స్ ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి రష్మిక రిజెక్ట్ చేసిన `మాచర్ల నియోజవర్గం`.. కృతి శెట్టిని హిట్ ఇస్తుందో.. లేదో.. తెలియాలంటే ఆగస్టు 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!