Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం అయి రెండు వారాలు గడిచిపోయింది. మొత్తం 14 మంది హౌస్ లోకి ఎంటర్ ఇవ్వగా..ఈ రెండు వారాలలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా ఎలిమినేట్ కావటం జరిగింది. ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. వీరిలో మూడో వారం ఎలిమినేషన్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అమరదీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, రతీక రోస్, శుభశ్రీ, డామిని. అయితే వీరిలో ఓటింగ్ పరంగా అమరదీప్ చౌదరి టాప్ లో ఉన్నాడు. మూడో వారానికి సంబంధించి సోమవారం నుండి జరుగుతున్న ఓటింగ్ పోల్ లో అత్యధిక ఓట్లతో జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరికి టాప్లో ఉన్నాడు.
ఆ తర్వాత ప్రిన్స్ యావర్కు 18.99 శాతం, ప్రియాంక జైన్ 18.34 శాతం, రతిక రోజ్ 16.5 శాతం, గౌతమ్ కృష్ణ 13.81 శాతం, శుభ శ్రీ రాయగురు 7.11 శాతం, సింగర్ దామినికి 5.43 శాతం ఓటింగ్ నమోదు అయింది. మొన్నటివరకు పల్లవి ప్రశాంత్, శివాజీలు టాప్లో ఉండేవాళ్లు. ఇప్పుడు వారు నామినేషన్లలో లేకపోయేసరికి అమర్ దీప్ టాప్కి వచ్చేశాడు. అంతకుముందు ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియలో లెక్కలు వేరేగా ఉండేవి.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ భారీ ఎత్తున ఓట్లు రాబట్టడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోవడంతో టాప్ లో అమర్దీప్ చౌదరి వచ్చాడు. జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ బట్టి చూస్తే ఈవారం హౌస్ నుండి మరో లేడు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
ఆమె మరెవరో కాదు దామిని. ఈసారి కూడా కచ్చితంగా లేడి కంటెస్టెంట్ వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మూడో వారం ఓటింగ్ ప్రక్రియలో డేంజర్ జోన్ లో శుభశ్రీ, దామిని ఉండటం జరిగింది. వీరిద్దరు సరిగ్గా ఆడితే హౌస్ లో ఉంటారు లేదా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వటం గ్యారెంటీ అని టాక్.
దామిని ఆమె ఆడుతున్న ఆట తీరు ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టే రీతిలో ఉండటంతో పాటు కెమెరా అటెన్షన్ తనవైపు ఉండేలా పరిస్థితులు తానే క్రియేట్ చేయడంతో.. ఒక్కసారిగా ఓటింగ్ గ్రాఫ్ మారిపోతోంది. కచ్చితంగా ఈసారి దామిని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట జనాలు భావిస్తున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!