స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో నటిస్తున్న శైలజ ప్రియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో వరుసగా సినిమాలలో నటించి.. ఆ తర్వాత సీరియల్స్ కే పరిమితమైన మామిళ్ళ శైలజా ప్రియా తన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు అంతకు మించిన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలలో క్యారెట్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాల్గొని.. బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై.. సీరియల్స్ లో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.
ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే మామిళ్ల శైలజ ప్రియా ఒక ప్రౌడ్ మూమెంట్ను షేర్ చేసింది.అందులో తన కొడుకు ప్లస్ టు కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కాలేజ్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన కొడుకు నిశ్చయ్ మాచిరాజు తో దిగిన ఫోటోను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రౌడ్ మూమెంట్ విత్ మై సన్ అంటూ తన అత్యుత్సాహాన్ని అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులంతా ప్రియా కొడుకుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ప్రియా విషయానికి వస్తే.. 1998లో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత మళ్లీ చిరంజీవితో అన్నయ్య సినిమాలో హీరోయిన్ సౌందర్య కి సిస్టర్ క్యారెక్టర్ పోషించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున , అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక సినిమాలలో కెరియర్ బిజీగా కొనసాగుతున్న సమయంలో నే బుల్లితెరపై అడుగుపెట్టిన ఈమె ఇక్కడ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోందని చెప్పవచ్చు.