Krishna Mukunda Murari March 6 2024 Episode 411: ఇంటికి వచ్చిన మురారి కృష్ణలు ఇద్దరు డల్లుగా కనిపిస్తారు. రేవతి ఏమైంది అని అడిగితే.. మురారి చెప్పద్దు అని సైగ చేస్తాడు. ఇక కృష్ణని బలవంతంగా రేవతి 1ఏమైందో చెప్తావా అని గట్టిగా అడుగుతుంది. మీ అబ్బాయి నన్ను చెప్పొద్దని అంటున్నారు అత్తయ్య అని అంటుంది. అందరూ అక్కడే ఉంటారు. ఇక ఏమైందో చెప్పు అని అంటే.. ఏసిపి సార్ నన్ను కొట్టాడు అత్తయ్య అని కృష్ణ అంటుంది. ఇక వెంటనే ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. ఏమైంది నేను కొట్టానా అని అంటాడు మురారి. లేదు మేము కాఫీ షాప్ లో కాఫీ తాగి వచ్చాము అని చెప్తాడు. మురారి మరి మందు తాగి వచ్చి నన్ను కొట్టారు అని కృష్ణ చెబుతుంది. రేవతి వైపు కృష్ణ చూస్తూ నిజమే అత్తయ్య ఆయన మందు కొట్టి నన్ను కొట్టాడు అని చెప్తుంది. ఇక ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యే చూస్తూ ఉంటారు. అమ్మ నేను నిజమే చెబుతున్నాను. నేను మందు తాగడం ఏంటి అయినా అసలు నేను కృష్ణను ఎందుకు కొడతానా అని మురారి అంటాడు. ఇక పైకి వెళ్తున్న కృష్ణ వెనకమాలే మురారి కూడా హే ఆగు కృష్ణ ఏంటి నేను నిన్ను కొట్టాను అని మురారి అడుగుతాడు.
ఇక గదిలోకి వెళ్ళిన కృష్ణ వైపే మురారి చూస్తూ అసలు కింద నువ్వేం చేసి వచ్చావో నీకు అర్థం అవుతుందా.. నేను మందు తాగను నిన్ను కొట్టను అని అమ్మ వాళ్లకి తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిజంగానే ఈ మాటలు నిజం అనుకొని అమ్మవారిని నమ్మేస్తే ఇంకేమైనా ఉందా.. ఈపాటికి పెద్ద యుద్ధమే జరిగేది అని మురారి కృష్ణతో అంటాడు. రెస్టారెంట్లో కృష్ణ మురారిల ఇద్దరికి ఆ బేరర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నాకు పెళ్లయింది. నా భార్య శోభనం రోజు నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళతో వెళ్లిపోయింది. నేనంటే ఇష్టం లేదని నా మొహానే చెప్పి వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. చనిపోదాం అనుకుంటే నాకు ఒక చెల్లెలు ఉంది. దాని కోసం నేను బతికి ఉన్నాను అని అంటాడు. ముకుంద ఇలానే ఆదర్శ్ కి చెప్తే పరిస్థితి ఏంటి అని మురారి, కృష్ణ ఆలోచిస్తూ ఉంటారు. ఆదర్శ్ కి ముకుంద నిజం చెప్పేసేలోపే మనమే నిజం చెప్పేద్దాం అని మురారి అనుకుంటాడు అయితే ఇంకెందుకు ఏసిపి సార్ చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్లి ఆదర్శ ను కలిసి ముకుంద కి ఈ శోభనం జరగడం ఇష్టం లేదని, ఏదో ఒకటి చెప్పి తనని డైవర్ట్ చేయమని కృష్ణ చెబుతుంది.
మురారి ఆదర్శ్ ని కలిసి నిజం చెప్పేయాలని ఆదర్శ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆదర్శ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. మీరందరూ నా శోభనం అని తెలిసి కావాలనే నన్ను బయటకు రమ్మని గంట గంటకి ఫోన్ చేస్తున్నారు కదా.. మీకు కూడా పెళ్లిలవుతాయి. మీకు శోభనం టైం వస్తుం.ది ఆ రోజు నేను ఇంతకంటే దారుణంగా మిమ్మల్ని ఏడిపిస్తాను రా అది గుర్తుంచుకోండి అని ఆదర్శ తన ఫ్రెండ్స్ తో మాట్లాడడం చూసి మురారి లో లోపల బాధపడతాడు. అసలు నీకు శోభనమే అవ్వదు అని ఎలా చెప్పాలి కానీ చెప్పక తప్పదు. అదే ముకుందా నీకు ఈ మాట చెబితే నువ్వు తట్టుకోలేవు. అందుకే నేనే నీకు నిజం చెప్పేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. అప్పుడు ఆదర్శ్ మురారి వైపు చూసి ఫ్రెండ్స్ కాల్ చేశారా.. నేనే అనవసరంగా ఫస్ట్ నైట్ అని చెప్పాను. అప్పటినుంచి బాగా విసిగిచ్చేస్తున్నారు అని ఆదర్శ మురారితో అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్పాలి అని మురరి అంటాడు. ఏంటి శోభనం జరగటం లేదు అని చెప్పవు కదా అని ఆదర్శ అడుగుతాడు. హమ్మయ్య నేను చెప్పాల్సింది నువ్వే చెప్పేశావు అని మురారి అనుకుంటాడు. నాకు తెలుసు రా నువ్వు ఈ శోభనాన్ని ఆపలేవని.. ఎందుకంటే నా శోభనం ఆపితే నీ శోభనం కూడా ఆగిపోతుంది కదా.. రెండేళ్ల నుంచి నాకోసం నీ శోభనం కూడా చేసుకోకుండా ఆగిపోయావు. అలాంటి నువ్వు ఇప్పుడు ఈ శోభనాన్ని ఎలా ఆపుకుంటావు అని ఆదర్శ్ మురారితో అంటాడు.
అయినా నువ్వు నాకు ఫ్రెండ్ వి కాదురా అంతకుమించి ఎక్కువ నా జీవితంలో ప్రతి విషయంలోనూ నువ్వు ఉంటావు. నాకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నాకు పునర్జన్మను ఇచ్చింది మాత్రం నువ్వే. ముకుందా అంటే నాకు ప్రాణం రా కానీ, తను నన్ను వద్దు అని అనుకున్న అని తెలియగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నువ్వు మళ్ళీ ముకుందా మనసు మార్చి ముకుంద ప్రేమ నాకు దక్కేలా చేస్తున్నావు. ఇంతకుమించి నా జీవితానికి ఏం కావాలి నా జీవితంలో కోల్పోయిన ప్రతిదీ కూడా నువ్వు నాకు ఇచ్చావు మురారి నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మురారిని ఆదర్శ్ గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడే ముకుందా చాటుగా మురారి ఆదర్శ్ తో ఏం మాట్లాడుతున్నాడో అని వింటుంది. ముకుందా అక్కడ ఉందని మురారి గమనిస్తాడు. ఇప్పుడు గనక ఆదర్శ్ కి నేను నిజం చెబితే ముకుంద కోసమే ఇదంతా చేశానని తను అనుకుంటుంది. అందుకే ఇప్పుడు తనకి ఏం చెప్పకూడదు అని అనుకుంటాడు. ఏం లేదురా అని మురారి అంటాడు.
రేపటి ఎపిసోడ్లో ఇద్దరూ జంటలు శోభనం గదిలోకి వెళ్తాయి. మురారి కృష్ణని దగ్గరకు తీసుకోబోతుండగా పక్క రూమ్లో ఆదర్శ్ ముకుంద లకు కూడా శోభనం జరుగుతుంది. ముకుంద ఆదర్శ్ కి నిజం చెప్పేస్తే ఏమవుతుందో అని కృష్ణ కంగారుపడుతూ ఉంటుంది. పాల గ్లాస్ తో గదిలోకి వచ్చిన ముకుందను ఆదర్శ్ దగ్గరికి తీసుకుంటాడు. తను తాగిన పాలను ముకుందకి ఇస్తే వద్దు ఇదే ఎంగిలి చేసిన పాలను మురారి ఇస్తే సంతోషంగా తీసుకునే దానిని.. ఎందుకంటే నా జీవితాన్ని పంచుకోవాలనుకుంది మురారితోనే కదా అని ముకుందా అంటుంది. ఆ మాటలు విన్న ఆదర్శ్ కోపంగా కిందకు వచ్చి మురారిని కిందకు రమ్మని పిలుస్తాడు. దాంతో ఇద్దరు శోభనాలు ఆగిపోతాయి. మొత్తానికి ముకుంద అనుకున్నది చేసింది శోభనం మాత్రం ఆపేసింది. నిజం తెలుసుకున్న ఆదర్శ్ ఇక శాశ్వతంగా ముకుంద కి ఆ ఇంటికి దూరం కానున్నాడా.. ముకుందా ఆదర్శ్ లను కలపడానికి కృష్ణ మురారి ఏం చేయనున్నారు. నిజంగానే ముకుందా కృష్ణ జీవితంలోకి వస్తుందా మురారిని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుందని కృష్ణకు రెడ్ హ్యాండెడ్ గా ముకుందా దొరికిపోతే ఈసారి ముకుంద ఇంటిలో నుంచి వెళ్లిపోవడం తప్ప మరొక దారి ఉండగా.. ఇక భవాని ఇంట్లో ఈ గొడవ తో ఎలాంటి మార్పులు జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.