Kumkuma Puvvu March 19 2024 Episode 2133: అంజలి అమ్మ మీ నాన్నగారు ఊరు ఇదే అంటున్నావు కాబట్టి మనం శాంభవి గారితో చెప్తే మీ నాన్నగారి ఇల్లు తెలుస్తుంది ఇంతకు తాతయ్య పేరు ఏంటమ్మా అని అడుగుతుంది. అమృత మీ తాతయ్య పేరు జై చంద్ర అని చెబుతుంది. అంజలి షాక్ అవుతుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది మళ్లీ ఒకసారి చెప్పు అంటుంది.అమృత అవునమ్మా మా నాన్నగారి పేరు జై చంద్ర అంటుంది. అంజలి సంతోషపడుతూ అమ్మ ఒకసారి మీ నాన్నగారి ఫోటో నీ దగ్గర ఏదైనా ఉందా చూపిస్తావా అని అడుగుతుంది. అమృత కచ్చితంగా చూపిస్తాను అంజలి మా నాన్నగారి ఊరికి వస్తున్నామని తెలిసి మా నాన్నగారి ఫోటో నాతో భద్రంగా తీసుకుని వచ్చాను అని లోపలికి వెళ్లి జై చంద్ర ఫోటో తీసుకువచ్చి అంజలికి ఇస్తుంది అమృత.
అంజలి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమృత ఏంటి అంజలి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అంజలి అమ్మఇప్పుడు మనందరం ఉంటున్న ఈకోట జై చంద్ర గారిది అంటే మీ నాన్నగారు అంటే మా తాతగారు ఆ శాంభవి గారుజై చంద్ర గారి ఫౌండేషన్ ని 25 ఏళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది మీ నాన్నగారు తన వారసులు ఎవరైనా వస్తే ఈ ఆస్తి వారికి చెందాలని వీలునామాలు రాసిపెట్టి ఉంచారట ఈ 25 ఏండ్ల లోపు తన వారసులు ఎవరైనా వస్తే వారికి ఈ బాధ్యతలన్నీ అప్ప చెప్పి నేను పక్కకి జరుగుతాను అని ఎంతో గొప్ప మనసున్న శాంభవి గారు తరచూ అంటూ ఉంటుంది మనందరం అనుకోకుండా తాతగారి ఇంటికి చేరుకున్నాము మనమే ఆ జై చంద్ర గారి వారసులమని చెబితే ఆ శాంభవి గారు చాలా సంతోషపడి ఈ బాధ్యతలన్నీ ఈ ఆస్థిలన్నీ జై చంద్ర తాతయ్యకు కూతురైన మా అమ్మకి అప్పచెబుతుందినాకు ఆ నమ్మకం ఉంది.
నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే మనందరిని తాతయ్య తన దగ్గరికి రప్పించుకున్నాడేమో ఒకరికి తెలియకుండా ఒకరు అందరం తాతయ్య గృహానికి చేరుకున్నాము చూసావా విధి ఎంత విచిత్రంగా మనల్ని నడిపించిందో అంటూ సంతోషపడుతుంది అంజలి.బంటి అవునత్తయ్య ఈ జై చంద్ర గారి ఫోటో శాంభవి గారి ఇంట్లో చూశాను ఈ కోట జై చంద్ర గారి ఫౌండేషన్ అని పేరుతో ఉంది జై చంద్ర గారి ప్రకృతి వైద్యశాలను ఆ శాంభవి గారు నడిపిస్తున్నారు అని చెబుతాడు బంటి.కావేరి ఏంటేంటి మీరు చెప్పేది ఏంట్రా ఆ జై చంద్ర గారి ఫౌండేషన్ ఇదేనా అంటే ఈ ఆస్తులు అన్నింటికీ ఏకైక వారసురాలు మన అమృత ఆహా వినడానికి ఎంత వినసొంపుగా ఉంది ఇంకేంటి అమృత మనము ఇప్పుడే వెళ్లి ఆ శాంభవి గారితో అ జయచంద్ర వారసురాలు మా అమృత అని చెప్పేద్దాం పదండి అంటుంది. అంజలి లేదా అత్తయ్య ఇప్పుడు కుదరదు ఎందుకంటే రేపు స్కూల్లో మీటింగు ఉంది కదా అప్పుడు అందరి ముందు నేనే అ జైచంద్ర వారసురాలు అని అమ్మని పరిచయం చేస్తాను అప్పుడు శాంభవి గారు వాళ్ళ కుటుంబం ఊరంతా చాలా సంతోషపడుతుంది అప్పటివరకు మనం ఓపిక పడదాం అంటుంది అంజలి.
కట్ చేస్తే అంజలి సంతోషంతో శాంభవి గారి ఇంట్లోకి పరుగులు తీస్తుంది. అది చూసిన మాధవి ఓహో ఏంటి కొత్తగా వచ్చిన ఆ పంతులమ్మ పంతులయ్య నీకు అంత బాగా పరిచయమయ్యారా చాలా సంతోషపడుతున్నావు అని అంటుంది అంజలి అవును వారిని చూడగానే ఎందుకో నాకు కన్న తల్లిదండ్రుల్లాగానే అనిపించారు అని చెబుతుంది అంజలి. మాధవి అయినా నీకు వెనక ముందు ఎవరూ లేరు కదా తల్లిదండ్రుల ప్రేమ ఎలా తెలుస్తుందిలే నీకు అంటుంది.అంజలి సైలెంట్ అయిపోతుంది.శాంభవి చూడు మాధవి నీకు ఏటైం లో ఏం మాట్లాడాలో తెలీదాఅంజలి అలా ఇబ్బంది పెట్టే మాటలు ఎందుకు మాట్లాడతావు చెప్పు కాసేపు నోరు మూసుకొని ఉండు అంటుంది శాంభవి. మాధవి నేనేమన్నాను అత్తయ్య తనకి ఎవరూ లేరనే అన్నాను అందులో తప్పేముంది నిజంగానే తనకు ఎవరూ లేరని చెప్పింది కదా అని అంటుంది.
కట్ చేస్తే నైట్ అవుతుంది అంజలి జయచంద్ర గారి ఫోటో దగ్గరికి వెళ్లి తాతయ్య నీలాంటి గొప్ప మనిషి రక్తం నా ఒంట్లో కూడా ఉందని తెలిసి నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే నువ్వు మా అమ్మకి తండ్రివని విషయం తెలవగానే నీ వారసులుగా మాకు ఈ జన్మ ఇచ్చినందుకు ఆ దేవునికి చాలా రుణపడి ఉంటాము మొదటిరోజు ఈ ఇంట్లో అడుగుపెట్టగానే నీ ఫోటో చూడగానే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది కానీ అది ఇప్పుడు నిజమయింది నువ్వు మా రక్త సంబంధం అని నీలాంటి గొప్ప మనిషి భూలోకంలో లేకపోయినా నీ జ్ఞాపకాలు మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాయి మీరు చేసిన మంచి పనులే మిమ్మల్ని ఇంకా బ్రతికిస్తూ ఉంటాయి రేపే స్కూల్లో జరిగే ప్రోగ్రాంలో నీ వారసురాలిగా అమ్మను ఈ ఊరికి పరిచయం చేస్తాను తాతయ్య అంటూ దండం పెట్టుకుంటుంది అంజలి. శాంభవిఫౌండేషన్ కి సంబంధించిన ఆస్తి కాగితాలను చూస్తూ రేపటితో ఈ ఆస్తులకి ముగింపు పలికేసేయాలి రేపటితో ఈ ఆస్తులు అన్నింటికీ నేనే యజమానిని అవ్వాలి అందరి సమక్షంలోనే ఈ ఆస్తులని నా పేర రాయించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది శాంభవి.
చరణ్ రాజ్ అప్పుడే శాంభవి దగ్గరికి వచ్చి అమ్మ ఏం చేస్తున్నావ్ ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు శాంభవి లేదురా నిద్ర రావడం లేదు అంటుంది. చరణ్ రాజ్ అమ్మ ఈ ఆస్తులు మన పేరు చేయించుకోవడానికి ఈ తథంగాలన్నీ అవసరమా చెప్పు నీ మాట నా పోటు ఈ రెండింటికి మన ఊరిలో ఎదురు లేదు అలాంటిది నువ్వు ఇంత ఖర్చు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా అని అంటాడు. శాంభవి ఉదయ్ చరణ్ రాజ్నువ్వు చెప్పింది నిజమే ఈ ఆస్తులన్నీ మన పేర చేయించుకోవడానికి ఒక క్షణం పట్టదు కానీ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా రేపటి రోజు నా జై చంద్రబాబు వచ్చిన ఈ ఆస్తులన్నీ ప్రజల సమక్షంలోనే మన చేతికి వచ్చాయని వారిని ఇక్కడి నుండి తరిమేయొచ్చు ఒకవేళ అంతకుముందే జై చంద్ర గారి వారసులు వచ్చారే అనుకో వారిని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అంటుంది శాంభవి
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!