Madhuranagarilo : ఏంటండీ శ్యామ్ రాదని ఎక్కడికి తీసుకు వెళ్తున్నాడు ఏం చెప్పడానికి వళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందండి అదేంటో కనపడితే మనకు ఉపయోగపడుతుంది అని దాక్షాయిని అంటుంది. అవును దాక్షాయని వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకొని మనం చురకవైపు శ్యామ్ ని రాదని ఒకరి మీద ఒకరికి ఎక్కించి చెబుతూ మనం ఇంట్లోనే సెటిల్ అయిపోవచ్చు అని చలపతి అంటాడు. ఒకవేళ వాళ్లకి నిజం తెలిసిపోతే అప్పుడు ఇంత నీడ కూడా ఉండదండి ఎలా అని దాక్షాయిని అంటుంది. తెలియకుండా మేనేజ్ చేద్దాం దాక్షాయిని రాదని శ్యామ్ ని కలవకుండా చేస్తే శాశ్వతంగా మనం ఇంట్లోనే ఉండిపోవచ్చు అని చలపతి అంటాడు. కట్ చేస్తే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని రాదా అడుగుతుంది. చెప్తాను రాదా 10 నిమిషాలు ఆగు అని శ్యామ్ అంటాడు. ఇంతలో రాధకి పొలమారి దగ్గు వస్తుంది.
శ్యామ్ కార్ పక్కన ఆపి వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడి నుంచే రుక్మిణి స్కూటీ మీద వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి వెళ్తూ నేను ఈరోజు ఆఫీస్ కి వెళ్లడం లేదు ఆయన పండు కి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు కానీ నన్ను పట్టించుకోవడం లేదు అందుకే ఈరోజు ఆఫీస్ కి వెళ్ళలేదు అని చెప్తుంది. అవునా అలా ఎందుకు చేస్తున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. ఇంతలో శ్యామ్ రాధకి వాటర్ తెచ్చి ఇస్తాడు. రాధా వాటర్ తాగుతూ ఉంటుంది.ఏమోనే తెలుసుకుంటాను అని రుక్మిణి వాళ్ళ కారు ముందు నుంచే వెళ్ళిపోతుంది కానీ వాళ్లను చూడదు.శ్యామ్ రాదని తీసుకొని ఎవరూ లేని చోటుకి వెళ్తాడు.
కట్ చేస్తే ఎవరు లేని ప్లేస్ కి తీసుకువచ్చాడు ఈయన అక్క గురించి చెప్తాడు అనుకుంటా అని రాదా అనుకుంటుంది. రాధా నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను నికు తెలుసా నేను చెప్పేది ఇంకెవరు వినకూడదు నువ్వు మాత్రం వింటే చాలు అని శ్యామ్ అంటాడు. రాధా నేను ఇన్ని రోజులు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావ్ అని నన్ను అడిగావు దానికి కారణం ఏంటో ఈరోజు చెప్తాను అని శ్యామ్ అంటాడు.
నా మొదటి భార్య తిరిగి వచ్చింది రాదా నకు ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది అది చాలదన్నట్టు ఒకరోజు ఆఫీసుకు వచ్చి నాకు ఉద్యోగం ఇస్తావా చస్తావా అని బెదిరించింది తప్పక ఉద్యోగం ఇచ్చాను ఈ విషయం తెలిస్తే నువ్వు ఏమైపోతావో నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు అని నీకు చెప్పలేదు రాదా నీకు నిజం చెప్తే కలిగే బాధ కంటే అబద్ధం చెప్తేనే ఎక్కువ బాధ పడతావని అర్థమైంది అందుకే నేను నీకు నిజం చెప్పేశాను రాదా అని శ్యామ్ అంటాడు. నేను ఆడవాళ్ళనే గౌరవించని నన్ను నీ రాక నన్ను మార్చేసింది ఆడవాళ్లను గౌరవించేలా చేసింది నిన్ను ప్రేమించేలా చేసింది మళ్లీ జీవితం మీద నాకు ఆశ కలిగిలా చేసింది అంతెందుకు మా అమ్మ నాన్నలకి కొడుకు గా ఉండి సంతోషపెట్టగలుగుతున్నాను అంటే అంతా అని వలెనే రాదా అలాంటి నిన్ను వదిలిపెట్టి నేను బ్రతకలేను నా మొదటి భార్య గురించి తెలిస్తే ఎక్కడ నువ్వు నాకు దూరమైపోతావో అని శ్యామ్ అంటాడు.
రాధా అంతగా నా జీవితాన్ని పెనవేసు కున్నాను నువ్వు నాకు దూరమైతే ఎలా తట్టుకోగలను నువ్వు లేకపోతే నేనులేను రాదా అని శ్యామ్ బాధపడతాడు. కట్ చేస్తే, ఏంటండీ రాధ ఫోన్ కలవట్లేదు శ్యామ్ రాదని ఎక్కడికి తీసుకు వెళ్లి ఉంటాడు అని మధుర కంగారు పడుతుంది. చేతు నేను రెడీ అయ్యాను డాడీ ఎక్కడ అని పండు అడుగుతాడు. మీ నాన్న మీ అమ్మ ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు రా అని ధనంజయ్ అంటాడు. మరి స్కూల్ దగ్గర నన్నెవరూ డ్రాప్ చేస్తారు నువ్వు చేస్తావా అని పండు అడుగుతాడు. నేను డ్రా చేస్తాను పండు అని శిరీష అంటుంది. అయితే ఓకే అని పండు అంటాడు.
అదేంటమ్మా నీకు పని ఉంది కదా అని మధుర అంటుంది. పర్వాలేదా ఆంటీ మీరెల్లి టిఫిన్ కట్టండి నేను పండు కి శూలు వేస్తాను శిరీష అంటుంది. ఏమండీ రాధకి ఫోన్ ట్రై చేస్తూ ఉండండి ఎక్కడికి వెళ్లారు ఏమో అని మధుర వెళ్ళిపోతుంది. ఏమండీ వీళ్ళు ఇంతగా కంగారు పడుతున్నారంటే ఏదో మ్యాటర్ ఉంది అది మనకు ఉపయోగపడుతుంది అని చలపతి దాక్షాయిని అనుకుంటారు. కట్ చేస్తే, మీ మొదటి భార్య మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చిందంట అని రాదా అడుగుతుంది. ఏముంది రాధా నా జీవితం సర్వ నాశనం చేయడానికి వచ్చింది నాతో కలిసి బ్రతకడానికి వచ్చిందంట అని శ్యామ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది