Malli Nindu Jabili December 16 2023 Episode 522: వసుంధర మాలినికి బొట్టు పెడుతుంది.మీరా అది చూసి నా కూతురు కూడా ఇలాగే పండగ జరుపుకోవాలని అనుకుంటుంది మనసులో. మీరా గారు ఏంటి అంత పరధ్యానంలో ఆలోచిస్తున్నారు అని మాలిని అడుగుతుంది. ఏమీ లేదమ్మా అని మీరా అంటుంది. నా కూతురు చలిమిడి ఫంక్షన్ జరుపుకుంటుందని కుళ్ళుకుంటున్నావా అని వసుంధర అంటుంది. నా కూతురుకు జరిగితే ఎంత సంతోషిస్తానో నాకు అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉందమ్మా అని వసుంధర అంటుంది. నాకు అలా అనిపించడం లేదు నాకు త్రేము సంతోషంగా ఉంది నీ కూతురేమో కష్టాలు పడుతుందని మనసులో అసూయ పెట్టుకున్నావేమో అని వసుంధర అంటుంది. అలా ఎందుకు అనుకుంటానమ్మా నేను ఎప్పటికీ మాలిని అమ్మ గారిని అలా చెడు జరగాలని అనుకోను అని మీరా అంటుంది. వసుంధర ఇలాంటి టైం లో కూడా ఈ గొడవలన్నీ అవసరమా మాలిని ఒకసారి గౌతమ్ కి ఫోన్ చెయ్ అని అంటాడు శరత్.
లేదు డాడీ ఆఫీస్ నుంచి బయలుదేరానని చెప్పాడు వస్తాడులే అని మాలిని అంటుంది. మాలిని వచ్చి ఇలా కూర్చోమ అని వసుంధర అంటుంది. మామ్ అరవింద్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని మాలిని అంటుంది. ఇంతలో ముత్తైదులు కూడా వస్తారు. మాలిని ఎంత అందంగా ఉన్నావు అని ముత్తైదువులు అంటారు. నా కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళండి దిష్టి పెట్టకండి అని వసుంధర అంటుంది. కూతురి మీద ఈగను కూడా వాళ్ళనివ్వదు వసుంధర కూతురు అంటే ఎంత ప్రేమ అని ముత్తైదులో ఒకరు అంటారు. అరవింద్ కూడా వస్తాడు.కట్ చేస్తే, మాలిని నీ కూర్చోబెట్టి చలిమిడి ఫంక్షన్ చేస్తారు.తనకు పసుపు కుంకుమలు పెట్టి ఆశీర్వదిస్తారు ముత్తైదువులు. ఇక మేం బయలుదేరుతాం వసుంధర గారు అని వాళ్ళు అంటారు. అరే ఇప్పుడు ఎందుకు భోజనాలు చేశాక వెళ్ళండి అని వసుంధర అంటుంది. మాలిని అందరికీ వాయనాలు ఇవ్వమ్మా అని వసుంధర అంటుంది. మాలిని అందరికీ వాయినం ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతుంది. ముత్తైదువులు వెళ్లిపోతారు.
అరవింద్ మాలినీకి ఇంత సంతోషంకరమైన పండుగ జరుగుతుంటే నువ్వేంటి డల్ గా ఉన్నావ్ ఏం జరిగింది అని శరత్ అడుగుతాడు. మా పెళ్లి విషయం తెలిసిన కానుంచి గౌతమ్ నన్ను మల్లి నీ చాలా టార్చర్ చేస్తున్నాడు మామయ్య నోటికొచ్చినట్టేలా మాట్లాడుతున్నాడు అని చెప్తాడు అరవింద్. మాలిని అమ్మ మీరు చెప్పారని గౌతమ్ బాబు ఇంట్లోకి రానిచ్చాడు కానీ నా కూతురు మీద ప్రేమతో కాదమ్మా నా కూతురు ఇంకెన్ని కష్టాలు పడవలో అని మీరా ఏడుస్తుంది. ఇప్పుడే ఏం జరిగింది ఇంకా రేపు ఉంటుంది చూడు పెద్ద గొడవ అని వసుంధర మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే,మాలిని మల్లి కి ఫోన్ చేసి మల్లి అరవింద్ ఆఫీసులో జరిగిందంతా చెప్పాడు ఇంట్లో కూడా నిన్ను గౌతమ్ టార్చర్ చేస్తున్నాడా నన్ను వచ్చి మాట్లాడమంటావా అని అడుగుతుంది మాలిని. ఏం వద్దు అక్క ఇప్పుడైనా బాగానే మాట్లాడుతున్నాడు ఉదయాన రాజీనామా లెటర్ ఇవ్వగానే అలా మాట్లాడారు అంతే అని మల్లి అంటుంది.
ఏంటి మల్లి ఏడుస్తున్నావా అని మాలిని అడుగుతుంది. నేనేమీ ఏడవట్లేదు అక్క అని మల్లి అంటుంది. నిజమా పొట్ట అని మాలిని అంటుంది. కొట్టేందుకు అక్క నా మల్లి సూపరు గ్రేట్ అని గౌతమ్ బాబు మెచ్చుకునేలా చెప్పిస్తాను చూడు అని మల్లి అంటుంది. మల్లి మీ అమ్మ మాట్లాడుతుందట అని మాలిని అంటుంది. నేను చాలా వర్క్ లో ఉన్నాను అక్క నేను అమ్మతో తర్వాత మాట్లాడుతాను అని మల్లి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే, గౌతమ్ మల్లి ఇంటికి వెళ్దామని కార్ దగ్గరికి వస్తారు.స్టాఫ్ అంతా బాయ్ సార్ బాయ్ మేడం అంటూ వెళ్ళిపోతారు. మల్లి కార్లో కూర్చోవాలా వద్దా అని నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరికోసం ఎదురు చూస్తున్నావ్ నీ మొదటి భర్త గురించా అతను వెళ్ళిపోయినట్టున్నాడే మళ్లీ వచ్చి తీసుకెళ్తానన్నాడా అని గౌతమ్ అంటాడు. నన్ను ఎంతగానో ప్రేమించే ఆ కళ్ళు నన్ను ఎంతో అపురూపంగా చూసుకునే మనిషి నన్ను సూటి పోటి మాటలతో వేధిస్తుంటే గుండె రెండు ముక్కలైపోతుంది అని మల్లి అంటుంది.
నీకు గుండె రెండు ముక్కలు మాత్రమే అయిపోయింది నేను మాత్రం బ్రతికి ఉన్న చచ్చిపోయిన శవం లా మిగిలిపోయాను నువ్వు చేసిన మోసానికి మరి నా గుండె ఎన్నిసార్లు బద్దలై పోవాలి అని గౌతమ్ అంటాడు. ఇంతలో స్టాఫ్ లో నుంచి ఒక అమ్మాయి వచ్చి సార్ మనం ఎటైనా బయటికి వెళ్దామా అని అంటుంది. నాక్కూడా చాలా రోజుల కానించి మనసేం బాగోలేదు ప్లాన్ చేద్దాంలే అని గౌతమ్ అంటాడు.ఏంటి మేడం కార్ ఎక్కకుండా అలాగే ఉన్నారు సార్ ఫీల్ అవుతారు సార్ కు మీరంటే చాలా ఇష్టం కూర్చోండి మేడం అని బలవంతంగా మల్లి నీ కారులో కూర్చోబెడుతుంది అమ్మాయి బాయ్ సార్ బాయ్ మేడం అంటూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. నువ్వు తింటే తినడం నువ్వు నవ్వితే నవ్వడం ఒక అప్పటి రోజులు ఇప్పుడు అలాంటి గౌతమ్ కాదు కార్ దిగు అని అంటాడు గౌతమ్.
ఇంటిదాకా డ్రాప్ చేయొచ్చు కదా అని మల్లి భయపడుతూ అంటుంది. నేనేమైనా క్యాబ్ డ్రైవర్ నా దిగు అని గౌతమ్ మల్లి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. మల్లి బాధ పడుకుంటూ ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. కొంచెం దూరం వెళ్ళగానే తను ఆఫీసులో పనిచేసే అతన్ని కారెక్కించుకొని మరి తీసుకొని వెళ్తాడు గౌతమ్. కట్ చేస్తే, వసుంధర ప్రీతికి ఫోన్ చేస్తుంది. మేడం ఇప్పుడే ప్రింట్ అవుతుంది రేపు తెల్లారేసరికి పబ్లిక్ సీట్ అయిపోతుంది అని ప్రీతి చెప్తుంది. ఓకే ప్రీతీ నేను చెప్పినట్టు చెయ్యి రేపు 5 గంటల వరకు అని వసుంధర అంటుంది. అలాగే మేడం కానీ నా అమౌంట్ సంగతి అని ప్రీతి అంటుంది. నీ అకౌంట్లో 10 లక్షలు వస్తాయి చూడు అని వసుంధర అంటుంది. థాంక్యూ మేడం అని ప్రీతి ఫోన్ కట్ చేస్తుంది. మల్లి రేపు తెల్లవారితే అందరికీ సూర్య ఉదయం నీకు మాత్రం సూర్యాస్తమయం అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!