Malli Nindu Jabili February 21 2024 Episode 578: అడ్రస్ తెలుసుకొని మారి వస్తున్నాను అంటే ఏదో చేయడానికి వస్తుందని అనుకుంటున్నారు కదా అని మాలిని అంటుంది. నువ్వు మీ అమ్మ ఊరికే మా ఇంటికి రారు కదా అని కౌసల్య అంటుంది. సార్ రండి అని మాలిని పోలీసులు పిలుస్తుంది. పోలీసులు ఎందుకు తీసుకొచ్చావు అని గౌతమ్ అంటాడు. తన భర్త అరవింద్ గారిని చంపింది మీరేనని మాలిని గారు కంప్లైంట్ ఇచ్చారు హత్య జరుగుతున్నప్పుడు చూసిన శంకరమ్మ కూడా ఉంది నువ్వు అరవింద్ కి ఫోన్ చేసిన ప్రూఫ్స్ ఉంది అందుకే నేను అరెస్టు చేస్తున్నాం అని ఎస్ఐ చెబుతాడు. నా కొడుకు ఆ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు తెలిసి కూడా ఎందుకు మాలిన ఇలా చేస్తున్నావ్ అని కౌసల్య అంటుంది. ఏం చెప్పినా ఫలితం లేదు నీకు జైలు శిక్ష పడాల్సిందే అని మాలిని అంటుంది. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కోర్టులో చెప్పుకోండి అంటూ ఎస్సై అరెస్టు చేసి తీసుకువెళ్లిపోతాడు గౌతమ్ ని. మాలిని నా కొడుకు ఇలాంటి తప్పు చేయడు తనని దయచేసి వదిలిపెట్టు అని కౌసల్య అంటుంది.
ఇంతలో ఆగండి అని మల్లి అంటుంది. నా భర్తను చంపిన నీ భర్తని అరెస్టు చేయిస్తున్నాను రేపు జైల్లో పెడతారు ఆ తర్వాత ఉరిశిక్ష పడుతుంది అని మాలిని అంటుంది. అక్క నేను ఇందాక ఒక శుభవార్త చెప్పాలనుకున్నాను నువ్వు చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు అని మల్లి అంటుంది. శుభవార్త ఏంటది అని మాలిని అంటుంది. అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారు అని గురువుగారు చెప్పిన విషయం అంతా మల్లి చెబుతుంది.ఆయన చెప్పింది అక్షరాల సత్యమని అందరూ నమ్ముతున్నారు అందుకే నేను గుడికి వెళ్లి మొక్కుకున్నాను అప్పుడు ఒక అతను నాకు ఫోన్ చేసి అరవింద్ బాబు గురించి చెప్పాడు అని మల్లి చెబుతుంది. మనం వెంటనే అడ్రస్ దగ్గరికి వెళ్దాం పద అక్క అని మల్లి అంటుంది. నువ్వు చెప్పేది నిజమా మల్లి అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు గారిని తీసుకొస్తామండి అక్క నా భర్తని అరెస్ట్ చేయద్దు అని చెప్పు బాబు గారిని తీసుకొద్దాం అని మల్లి అంటుంది. మల్లి నువ్వు చెప్పింది నిజమా నా అరవిందు బతికే ఉన్నాడా అని మాలిని సంతోషిస్తుంది.
ఎస్ఐ గారు గౌతమ్ వదిలేయండి ఐ యాం సారీ అని మాలిని అంటుంది. మాలిని మల్లి అరవింద్ ని వెతుక్కుంటూ వెళ్తారు. పోలీస్ వాళ్ళు గౌతమ్ ని వదిలేసి వెళ్లిపోతారు. కట్ చేస్తే, మల్లి నువ్వు చెప్పిన శుభవార్త వింటుంటే నాకు ప్రాణం లేచి వచ్చినంత పనైంది నా జీవితంలో ఇంతటి శుభవార్త ఎప్పుడు వినలేదు అని మాలిని అంటుంది. మనం కష్టాల్లో ఉన్నామని ఆ భగవంతుడు మన కష్టాన్ని తీర్చడానికి అరవింద్ బాబుని బ్రతికి ఉంచాడు అక్క అని మల్లి అంటుంది. ఈ విషయం అమ్మకు చెప్తే నా కంటే ఎక్కువ సంతోషిస్తుంది అని మాలిని అంటుంది. వద్దక్క బాబు గారిని డైరెక్టుగా ఇంటికి తీసుకెళ్దాం వాళ్ళ కళ్ళలో ఆనందం నేరుగా చూద్దాం అని మల్లి అంటుంది. అక్క ఇదే ఇల్లు అక్క ఇక్కడే ఆపు కారు అని మల్లి చెబుతుంది. లోపలికి వెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. మల్లి ఇదే ఇల్లా కరెక్ట్ గానే అడ్రస్ చెప్పారా అని మాలిని అంటుంది. అరవింద్ నీ కోసం ఎంతగానో బాధపడుతున్నాను నాకు ఒకసారి కనిపించు అరవింద్ అని మాలిని అంటుంది.
బాబు గారు మీరు ఎక్కడ ఉన్నారు మీ కోసం మేము వచ్చాము రండి అని మల్లి అంటుంది.అటుగా ఒక ఇద్దరు వెళ్తూ ఉండగాఏవండీ ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూశారా అని అడుగుతుంది. లేదండి చూడలేదు అని వాళ్ళు చెబుతారు. మల్లి నిజంగానే నీకు ఫోన్ వచ్చిందా అబద్ధం చెప్తున్నావా అని మాలిని అంటుంది. స్వామీజీ చెప్పింది అబద్ధం కాదు నాకు ఫోన్ వచ్చింది కల కాదు అని మల్లి అంటుంది. భగవంతుడా ఎందుకు నా జీవితంతో ఆటలాడుకుంటున్నావు నా అరవింద్ ను నా ముందుకు పంపించు అని బాధపడుతుంది మాలిని. అరవింద్ బాబు గారు కనిపించేంతవరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అక్క అని మల్లి అంటుంది.
అరవింద్ బ్రతికున్నాడని అబద్ధం చెప్పావు కదా నీ భర్త ని అరెస్టు నుంచి కాపాడడానికి నా భర్త బ్రతికున్నాడని అబద్ధం చెప్పి ఇంత దూరం తీసుకొచ్చావు అని మాలిని అంటుంది.నా మీద ఒట్టేసి చెప్పుకుంటున్నాను అక్క నేను అబద్ధం చెప్పలేదు అని మల్లి అంటుంది. అక్క అంటూనే నాకు వెన్నుపోటు పొడుస్తున్న వు నమ్మను అని మాలిని అంటుంది. ఎందుకిలా చేశావు మల్లి అని తనని నెట్టేస్తూ జారీ మాలిని మెట్ల మీద పడిపోతుంది. మాలిని స్పృహ కోల్పోతుంది. అక్క లేఖ అని మల్లి మాలిని లేపుతుంది.వెంటనే మల్లి మాలినిని హాస్పిటల్ తీసుకువెళ్తుంది.
ఏమైందమ్మా అని డాక్టర్ అడుగుతారు. ఎమోషన్ లో జారి కింద పడిపోయింది మా అక్కను చూడండి అని చెబుతుంది మల్లి. డాక్టర్లు మాలిని ని టెస్ట్ చేస్తూ ఉంటారు. నాన్నకి ఈ విషయం చెప్పాలి అని మల్లి వెంటనే శరత్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెబుతుంది. ఎవరికి ఏమైంది మల్లి అని శరత్ అంటాడు. మీరు హాస్పిటల్ కి రండి వచ్చాక చెబుతాను అని మల్లి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!