చూడు మీరా నేను మాలినీ పెళ్లి సంబంధాలు చూస్తున్నానని నువ్వు వెళ్లి మల్లి కి చెప్పావే అనుకో ఆ మల్లి వచ్చి పెళ్లి సంబంధాలు ఆపింది అనుకో తల్లి కూతుర్లు నా చేతిలో చేస్తారు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వసుంధర. కట్ చేస్తే, ఈమధ్య పుస్తకాల కంటే ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఏం చేస్తున్నావే అని కౌసల్య నీలిమని అంటుంది. ఇంతలో మల్లి ఇంటికి వస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి పొద్దున్నే ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని కౌసల్య అంటుంది. వాకింగ్ కి వెళ్ళాము అత్తయ్య అని మల్లి చెబుతుంది. సర్లే ఒక కాఫీ పెట్టి తీసుకురా అని కౌసల్య అంటుంది. మల్లి కాఫీ పెట్టడానికి వెళుతుంది. కిచెన్లోకి వెళ్లిన మల్లి ఆలోచిస్తూ కాఫీలో చక్కరకు బదులు ఉప్పు వేసి పోసుకొచ్చి కౌసల్య కి ఇస్తుంది.
తాగిన కౌసల్య ఉంచి కాఫీలో ఉప్పేసావేంటే అని అంటుంది. లేదు అత్తయ్య నేను చెక్కరే వేశాను అని మల్లి అంటుంది. లేదు వదిన ఉప్పు వేశావు అని నీలిమా తాగి చెబుతుంది.ఏదో ధ్యాసలో పడి మర్చిపోయాను అని మల్లి అంటుంది. అంత పరధ్యానంలో ఎందుకు కాపీ పెట్టావే అని కౌసల్య ఉంటుంది. అత్తయ్య నిన్న ఒక నర్స్ కలిసి అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు హాస్పిటల్కి రా ఫుటేజ్ ఇస్తాననింది కానీ అక్కడికి వెళ్తే ఫుటేజ్ లేదు రిజిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే ఉన్నాయని ఇచ్చింది అని ఆలోచించుకుంటూ మర్చిపోయి ఉప్పేసాను అని మల్లి అంటుంది. ఇక ఆపుతావా ఆ అరవింద్ భజన నీకు అరవింద్ కి పెళ్లి మాత్రమే అయ్యిందా ఇంకా ఏమైనా సంబంధం ఉందా అని కౌసల్య అంటుంది. కోపంతో రగిలిపోతున్న మల్లి కౌసల్య మీదికి చేయలేపుతుంది.
కళ్ళు నెత్తికెక్కేయ నా మీదికే చేయిలేపుతున్నావ్ అని కౌసల్య అంటుంది. ఒక మనిషి చనిపోలేదు బ్రతికున్నాడని చెబితే నమ్మకుండా ఆయనకి నాకు అక్రమ సంబంధం అంటగడతారా అరవింద్ బాబుది నాది పవిత్ర బంధం అది మీకు ఎప్పటికీ అర్థం కాదు అని మల్లి అంటుంది. వాడు చావకుంన బాగుండేది మాలిని నువ్వు వాని వెనకాల తిరిగేవాళ్లు అనే కౌసల్య అంటుంది.వాడు రానీయవే నీ సంగతి చెప్పిస్తాను అంటూ కౌసల్య వెళ్ళిపోతుంది. వదిన ఏది ఏమైనా అమ్మ మీదకి చెయ్ లేపడం తప్పు అని నీలిమ అంటుంది.
కట్ చేస్తే, అరవింద్ నువ్వు బ్రతికున్నావని ఒకరు చచ్చిపోయావని ఇంక ఒక్కరు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు నువ్వు బ్రతికున్నావా చచ్చిపోయావా అని మాలిని బాధపడుతుంది. ఇంతలో ఆకాశ అక్కడికి వస్తాడు. ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని ఆకాష్ అంటాడు. నిన్న ఇచ్చింది సరిపోలేదా మళ్లీ వచ్చావు అని మాలిని అంటుంది. మేడం నేను ఒక ఫ్రెండ్ గా మీకోసం వచ్చాను మీరు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి మళ్లీ అలాంటి ఆలోచన చేయకుండా ఉండడం కోసం మిమ్మల్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాను మీరు నా వెంట వస్తారా రారా అని ఆకాష్ అంటాడు. నేను ఆత్మహత్య చేసుకోను అది ఎప్పుడో వదిలేసాను అని మాలిని అంటుంది.
ఆకాష్ చెప్పింది బాగానే ఉంది మాలిని ఒక్కసారి వచ్చాక అది పోదు వెళ్లి ఒకసారి డాక్టర్ ని కలిసి రా అని వసుంధర అంటుంది. నీ మంచి కోరే చెప్తున్నాడు కదా మాలిని వెళ్ళు అని శరత్ అంటాడు. మేడం తొందరగా రండి నాకు వేరే షూట్ ఉంది అని ఆకాష్ మాలిని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మల్లి కౌసల్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ నడుచుకుంటూ వస్తుంది.ఇదే ఫస్ట్ టైం ఆడవాళ్లు నా బండి మీద ఎక్కడ చాలా థాంక్స్ మేడం అని ఆకాష్ అంటాడు.మా అమ్మానాన్న బలవంతంగా పంపించారు నేను రాను అన్నాను అని మాలిని అంటుంది.మేడం ఒక కవి ఏమన్నాడోతెలుసా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అన్నాడు ఎందుకంటే ఆడవాళ్లు రాను అంటే వస్తానని అర్థం అంట మీరు రానన్నారు కానీ వచ్చారు మీకు కూడా మనసులో ఇష్టం ఉంది కదా మేడం అని ఆకాష్ అంటాడు.ఏంటి మేడం ఒప్పుకున్నారు మీరు కూడా అని ఆకాష్ అంటాడు. నేనేమీ అనలేదు కదా అని మాలిని అంటుంది.
మీ మౌనం అంగీకారం అన్నట్టుంది మేడం అని ఆకాష్ అంటాడు. కట్ చేస్తే, నీలిమ ఈ విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పేస్తే బాగుంటుంది అని బన్నీ అంటాడు.బన్నీ ఎవరైనా చూస్తే బాగోదు మా ఇంట్లో పరిస్థితులు ఇంకా సర్దుకోలేదు అని నీలిమ అంటుంది. ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా అని బన్నీ అంటాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా మల్లి వాళ్ళని చూస్తుంది. మల్లి చూసిన నీలిమ బన్నీ మా వదిన చూసేసింది పద వెళ్లిపోదాం అని మొహానికి చున్నీ కట్టుకొని బైక్ వేసుకొని ఇద్దరూ మల్లికి దొరకకుండా వెళ్ళిపోతారు.నీలిమ ఆగండి అని మల్లి వాళ్ళ వెనకాలే పరిగెత్తుతుంది. అలా వెళ్తున్నాం మల్లి కి ఒకచోట గౌతమ్ కనిపిస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది