Malli Nindu Jabili March 28 2024 Episode 609: కౌసల్య కాఫీ పెడుతుంది. మల్లి డైనింగ్ టేబుల్ కింద కూర్చుంటుంది. కౌసల్య కాఫీ పెడుతూ ఉండగా గౌతమ్ మల్లి బుగ్గలు గిచ్చుతూ ఉంటాడు. కౌసల్య కాఫీ పెట్టి పోసి ఇద్దరు తాగండి అంటుంది. గౌతమ్ ఈ మధ్య నువ్వు మల్లి మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నావ్ నాకెందుకు నువ్వు తప్పు చేస్తున్నావ్ అనిపిస్తుంది అని కౌసల్య అంటుంది. ఎందుకమ్మా అలా అంటున్నావ్ అని గౌతమ్ అంటాడు. ఏ భర్త అయినా భార్య మీద ప్రేమ ని తప్పు చేస్తే ఎక్కడ దొరికిపోతానని అతి ప్రేమని చూపిస్తాడు అది నీలో నాకు కనబడుతుంది నువ్వేమైనా తప్పు చేస్తున్నావా అని కౌసల్య అడుగుతుంది. అమ్మ మల్లి అంటే నాకు ప్రాణం మల్లి జోలికి ఎవరొచ్చినా నేను ఊరుకోను ఏమైనా చేస్తాను అని గౌతమ్ అంటాడు.
అదే రా నా భయం అంతా ఎక్కడ నువ్వు తప్పు చేస్తావని భయపడుతున్నాను అని కౌసల్య వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళిపోయింది శ్రీమతి గారు బయటికి రండి అని గౌతమ్ అంటాడు. ఎందుకండీ అత్తయ్య గారు అలా అన్నారు అని మల్లి అంటుంది. అమ్మ మాటలు ఏమీ పట్టించుకోకు కాఫీ తాగు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, గౌతమ్ పడుకుంటాడు మల్లి కి మాత్రం నిద్ర పట్టదు ఆలోచిస్తూ ఉంటుంది కౌసల్య అన్న మాటలు. ఆలోచించి అటు ఇటు తిరిగి ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక వెళ్లి పడుకుంటుంది. అది గమనించిన గౌతమ్ కళ్ళు తెరిచి చూస్తాడు. కట్ చేస్తే ఇంతలో తెల్లవారుతుంది. మల్లి లేచి టాబ్లెట్ వేసుకుంటుంది.
మల్లి ఫోన్ తీసుకొని మీరా కి ఫోన్ చేస్తుంది ఫోన్ కలవకపోవడంతో శరత్ కి ఫోన్ చేస్తుంది. బాగున్నావా మల్లి అని శరత్ అంటాడు. బాగానే ఉన్నాను నాన్న అమ్మ ఫోన్ ఎందుకు కలవడం లేదు అని మల్లి అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మ అమ్మకి ఫోన్ ఇస్తాను మాట్లాడతావా అని శరత్ అంటాడు. ఏం జరిగిందో చెప్పండి నాన్న అని మల్లి అనడంతో శరత్ జరిగిన విషయం అంతా చెబుతాడు. నాన్న నేను ఇప్పుడే వస్తున్నాను అని మల్లి ఫోన్ కట్ చేస్తుంది.గౌతమ్ రెడీ అవుతూ ఉంటాడు. మల్లి వెళ్లి ఏమండీ నాకు 5000 కావాలి ఇస్తారా అని అడుగుతుంది. గౌతమ్ పరిసలో చూసుకుంటే డబ్బులు లేకపోవడంతో లోపలికి వెళ్లి 5000 తెచ్చి మల్లి ఇస్తాడు. 5000 అడిగాను ఎందుకని అడగరా అని మల్లి అంటుంది.
నువ్వు అడిగితే ప్రాణమైన ఇస్తాను 5000 ఒక లెక్క నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు మల్లి అని గౌతమ్ అంటాడు. మల్లి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అంటూ గౌతమ్ వెళ్తూ అరిచేతిలో ముద్దు పెట్టి గాలిలో ఊగుతాడు అది చేతిలోకి తీసుకొని మల్లి ముద్దు పెట్టుకుంటుంది.అత్తయ్య గారు రాత్రి అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అవి విన్నక నుంచి నా మనసంతా చిందర వందర అయిపోయింది అని మల్లి అనుకుంటుంది. కట్ చేస్తే, మీరా చెట్లకు నీళ్లు పోస్తుంది. ఇంతలో మల్లి అక్కడికి వచ్చి అమ్మ రా అని లోపలికి తీసుకెళ్లి వసుంధర గారు ఇలా రండి అని పిలుస్తుంది. ఎందుకే అలా అరుస్తున్నావ్ అని వసుంధర అంటుంది. ఫోన్ తీసి మీరాకి ఇచ్చి అమ్మ నువ్వు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు అని అంటుంది. ఓ విషయం నీదాకా చేరిపోయిందా అని వసుంధర అంటుంది. నేను చెప్పలేదు అమ్మగారు అని మీరా అంటుంది.
నేనే చెప్పాను వసుంధర అని శరత్ అంటాడు. మీరెప్పుడూ ఒక మంచి తండ్రిలా ఉండలేకపోతున్నారా అని వసుంధర అంటుంది.వసుంధర గారు నువ్వు ఈ ఫోన్ పలగొడితే నేను ఇంకొక ఫోన్ కొనిస్తాను అమ్మ నాతో మాట్లాడితే మీకేంటండి ప్రాబ్లం. మీకంటేమీ కూతురు ఇంట్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకుంటారు మాకు అలా కాదు కదా మా అమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ నువ్వు వసుంధర ముందటనే ఫోన్ చెయ్ అని మల్లి అంటుంది. ఫోన్ చేయని ఆ ఫోన్ పగలగొడతాను అని వసుంధర అంటుంది. వసుంధర నువ్వు మంచిగా మారవా అని శరత్ అంటాడు. మంచిగా మారడం గురించి మీరు చెప్తున్నారా డాడీ మమ్మీని అనడానికి నీకు ఏ అర్హత లేదు అని మాలిని అంటుంది.
వసుంధర అమ్మగారు ఒకటి గుర్తుపెట్టుకోండి మాలిని అక్కకి మీరు పెళ్లి చేయాలను చూస్తే మాత్రం నేను ఆపేస్తాను అరవింద్ బాబు గారు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. మీ ముందుకు తీసుకురావడమే ఆలస్యం ఈ లోగా మాలిని అక్కకు పెళ్లి చేయాలని చూస్తే నేను ఆ పెళ్లి జరగనివ్వను అని మల్లి అంటుంది.అక్క మీ అమ్మ ఏదో ఒకటి చేసి మి మనసు మార్చి పెళ్లి చేయాలనుకున్న నువ్వు పెళ్లి చేసుకోకు నువ్వుచేసుకున్న నేను పెళ్లి జరగనివ్వను అనిమల్లి అంటుంది. నా కూతురు మనసు మారి పెళ్లికి ఒప్పుకుంటే నీలాంటి మల్లి నువ్వు 100 మంది వచ్చినా అడ్డుకోలేరు అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!