Malli Nindu Jabili November 03 episode 485: అరవింద్ ఇప్పుడు నేలకొండపల్లి వెళ్లడం అవసరమంటావా నువ్వు రానని చెప్పు అని మాలిని అంటుంది. బాస్ కి రానని చెప్పలేను కదా మాలిని నా డ్యూటీ నేను చేయాలి అని అరవింద్ అంటాడు. నేలకొండపల్లిలో నీకు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మళ్లీ అందులోకి వెళ్ళిపోతావేమో జాగ్రత్తగా ఉండు అని మాలిని అంటుంది. నాకు తెలుసు మాలిని నేను అంత వెర్రి వాడిని కాదు అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే మాలిని అల్లుడు త్వరగా రండి ఆకలి దంచేస్తుంది ఈ వంటలు చూస్తుంటే నోరూరుతుంది ఎప్పుడు తినేద్దామా అన్నంత ఆకలి వేస్తుంది రండి రండి అని వనజాక్షి అంటుంది.
వస్తున్నాను పిన్ని అని మాలిని అంటుంది. రేయ్ యాదగిరి వంటలు మస్తుగా ఉన్నట్టునయి కదరా స్మెల్ బాగా వస్తుంది అని వనజాక్షి అంటుంది. అవును అక్క చూస్తుంటే నోరూరుతుంది అని యాదగిరి అంటాడు. ఇంతలో అరవింద్ మాలిని వచ్చి అక్కడ కూర్చుంటారు. మాలిని ఈ హైదరాబాదులో మా దోస్తు ఒకడు ఉన్నాడు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచిండు. నేను రాను అనేసరికి వంటలు చేసి క్యారేజీ నాకోసం పంపించాడు అని వనజాక్షి అంటుంది. అవునా పిన్ని అని మాలిని అంటుంది. రేయ్ యాదగిరి అల్లుడికి బిడ్డకి వడ్డించు రా అల్లుడు నా లెక్క మస్తుగా తినలే కానీ ఏందయ్యా కొంచెం కొంచెం తింటున్నావు అని వనజాక్షి అంటుంది. ఆ మాటలకి అరవింద్ ఏమి అనలేక స్మైల్ ఇస్తాడు అంతే. మాలిని మీరు కొన్ని రోజులు హనీమూన్ కి వెళ్లి రావచ్చు కదా అని వనజాక్షి అంటుంది.
పోయిన వారం నేను హనీమూన్ కి ప్లాన్ చేశాను పిన్ని కానీ మీరా వల్ల మల్లి వల్ల అంతా వేస్ట్ అయిపోయింది అని మాలిని అంటుంది. అల్లుడు పని ఎప్పుడైనా చేసుకోవచ్చయ్య బిడ్డ నువ్వు ఒకసారి హనీమూన్ కి వెళ్లి రండి ఇక్కడ అన్ని పనులు నేను చూసుకుంటాను అయినా నీకు నెలకి జీతం ఎంత అల్లుడు అని వనజాక్షి అంటుంది. లక్ష రూపాయలు అత్తయ్య అని అరవింద్ అంటాడు. రేయ్ యాదగిరి నీ జీతం ఎంత రా అని వనజాక్షి అంటుంది. నాకు నెలకు 60 వేల కజితం అని యాదగిరి అంటాడు. నెలకు వచ్చే జీతం కాదురా పైన వచ్చే కమిషన్ గురించి చెప్పు అని వనజాక్షి అంటుంది. నెలకి రెండు మూడు లక్షలు వస్తాయి అని యాదగిరి అంటాడు. చూసినవా అల్లుడు నా దగ్గర పని చేసేటోనికి ఎంత జీతం వస్తుందో నువ్వు లక్ష రూపాయలు చేయడమేంటి ఆ ఉద్యోగం మానేసి నా దగ్గరికి రా అల్లుడు కోట్లలో సంపాదన ఉంటుంది అని వనజాక్షి అంటుంది. ఆయనని జాబ్ మానేయమని ఎందుకంటావు లే పిన్ని ఆ మల్లి ఉన్న ఆఫీసును వదిలిపెట్టి అరవింద్ రాడు అని మాలిని అంటుంది.
మాలిని ఎందుకు అలా నిష్టూరంగా మాట్లాడతావు నాకు జర్నలిజం అంటే ఇష్టం అందుకే చేస్తున్నాను అని అరవింద్ అంటాడు. ఇంతలో శరత్ మాలిని కి ఫోన్ చేసి రేపు మనమందరం నేలకొండపల్లి బయలుదేరుతున్నాం అని అంటాడు. నాకు ఇష్టం లేదు డాడీ నేను రాను మీరు వెళ్ళండి అని మాలిని అంటుంది. మాలిని నాయన తోటి గట్లనే నా మాట్లాడేది ఈటీవీ నేను మాట్లాడుతా అని వనజాక్షి ఫోన్ తీసుకొని హలో బావగారు బాగున్నారా నువ్వు నీ ఇంట్లో ఉండకుండా గా ఇంట్లో ఉండుట ఏంది బావ ఇదేమి నాకు నచ్చట్లే సరేగాని నేలకొండపల్లికి మేమందరం వస్తున్నాం అని వనజాక్షి అంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చావు వనజాక్షి మీ అక్క ఎలా ఉంది అని శరత్ అంటాడు. మా అక్క ఏమి బాగోలేదు బావగారు అని వనజాక్షి అంటుంది.
కట్ చేస్తే మల్లి కి వనజాక్షి ఫోన్ చేసి మేమందరము నేలకొండపల్లి వస్తున్నా అక్కడ నీ సంగతి చూసుకుంటాను అని వనజాక్షి అంటుంది. ఇంతలో కౌసల్య వచ్చి మల్లి ఈ చీర నీకు బాగుంటుంది కట్టుకొని రామ అని అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే అత్తయ్య అని మల్లి అంటుంది. నీకు గౌతమ్ ఏదో సప్రైజ్ ఇస్తానన్నాడు అ విషయం నీకు చెప్పలేదా అని కౌసల్య అంటుంది. చెప్పలేదు అత్తయ్య అని మల్లి అంటుంది. ఇంతలో గౌతమ్ వస్తాడు ఏంట్రా గౌతమ్ మల్లి కి నువ్వు సప్రైజ్ గురించి చెప్పలేదా అని కౌసల్య అంటుంది. మల్లి నువ్వు త్వరగా రెడీ అయ్యారా మనం బయలుదేరుదాం అని గౌతమ్ అంటాడు. అలాగే అని మల్లి వెళ్ళిపోతూ ఉండగా. కౌసల్య గౌతమ్ చూడరా నిన్ను ఏమీ అడగలేక మల్లి వెళ్ళిపోతుంది అని అంటుంది. గౌతమ్ అప్పుడు మల్లి నీ పిలిచి మనం నువ్వు పుట్టిన నేలకొండపల్లి వెళుతున్నాం అక్కడ నువ్వు పుట్టినా గుర్తులు నువ్వు వాడుకున్న జ్ఞాపకాలు అన్నీ మెమొరీస్ మళ్లీ నీకు తిరిగి ఇవ్వబోతున్నాను మల్లి అని గౌతమ్ సంతోషంతో అంటాడు.
ఆ మాట వినగానే మల్లి కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఏంటి మల్లి టెన్షన్ పడుతున్నావు వెళ్లి త్వరగా రెడీ అయ్యారా మనం బయలుదేరుదాం అని గౌతమ్ అంటాడు. అలాగే అని మల్లి వెళ్ళిపోయి అరవింద్ కి ఫోన్ చేస్తుంది.హలో మల్లి నేలకొండపల్లి అందరం వెళ్తున్నాము అంట అక్కడికి వెళ్తే మన పెళ్లి జరిగిన విషయం అక్కడ ఉన్న వాళ్ళు గౌతమ్ కి చెప్తారు ఇప్పుడు ఎలా అని అరవింద్ అంటాడు. అదే బాబు గారు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అంతా ఆ భగవంతుడి మీద భారం వేస్తున్నాను నేను చేసేది ఏమీ లేదు అని మల్లి అంటుంది.
ఇంతలో మాలిని వచ్చి అరవింద్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు మల్లి తోటే ఫోన్లో మాట్లాడుతున్నావా మల్లి తో మాట్లాడితే ఫోన్ పగలగొడతాను చూడు అని ఫోను ఎత్తేస్తుంది మాలిని. ఇక్కడ కూడా గౌతమ్ మల్లి దగ్గరికి వచ్చి మల్లి ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు ఇంకా రెడీ అవ్వలేదా అని అంటాడు. అయిపోయిందండి అని మల్లి అంటుంది. నువ్వు నగలు పెట్టుకొని నీకోసం వెయిట్ చేస్తాను అని గౌతమ్ అక్కడే కూర్చుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!