Mamagaru January 11 2024 Episode 106: ఆ పేపర్ గోడకు అతికిస్తాడు చంగయ్య. దానిమీద లెక్కలు వేసి ముగ్గురు కోడళ్ళని ఉద్యోగాలు చేయనీయకుండా చేయాలి ముగ్గురు కొడుకు కోడల మధ్య విభేదాలు రావాలి చిన్న కొడుకు చిన్న కూతురుతో ఈ ముగ్గురు కోడండ్లు కొడుకులును దేవమ్మను మాట్లాడనివ్వకూడదు మొత్తం మీద కోడల్ని ఉద్యోగాలకి వెళ్ళనివ్వకుండా చేయాలి ఇది చాణిక్య చంగయ్య సిద్ధాంతం అని మనసులో లెక్కలు వేసుకుని అనుకుంటాడు చంగయ్య. నాన్న ఆ లెక్కలేయటి ఆ ఇంటు ప్లస్సులు ఏంటి అసలు మాకు ఏమీ అర్థం కావట్లేదు అని పాండురంగ అంటాడు. మావయ్య గారు చదువుకున్న నాకే అర్థం కావట్లేదు మీకెలా అర్థం అవుతాయి ఆ లెక్కలు అని శ్రీలక్ష్మి అంటుంది. ముందు ముందు నీకే అర్థమవుతుంది లేరా నాకు అర్థమైతే సరిపోతుంది కదా అని చంగయ్య అంటాడు. ఆ మాత్రం దానికి అక్కడ అతికించడం దేనికి నాన్న మాకు అర్థం కాకూడదా అని గంగాధర్ అంటాడు. మికు అర్థం కావడానికి కాదురా నేను అతికించింది నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందని అక్కడ అతికించాను రోజు చూసుకున్నప్పుడల్లా నా పని నేను చెయ్యాలని గుర్తుకు వస్తుంది అని చ0గయ్య వెళ్ళిపోతాడు.
పాండురంగ ఆ పేపర్ దగ్గరికి వెళ్లి చూసి అసలు ఈ లెక్కలు ఏంటి మూడు రెండు ఒకటి ఏంటి ఒకవేళ ఆ మూడు అంకెలు ముగ్గురు కొడుకులా లేదంటే ముగ్గురు కోడండ్ల మరి కింద తొమ్మిది అంకె ఎందుకు వేశాడు అని పాండురంగ అంటాడు. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు కానీ పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు ముందు ఆ సంగతి చూడండి అని దేవమ్మ అంటుంది. ఏవండీ డ్రైవర్ కు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి పిల్లలు ఇంకా రాలేదని వసంత అంటుంది. సుధాకర్ ఫోన్ చేస్తే మీ పిల్లలు నాకన్నా ముందే వెళ్లిపోయారు సార్ అందుకే నేను వెళ్లిపోయాను అని డ్రైవర్ చెప్తాడు. వసంత డ్రైవర్ కన్నా ముందే పిల్లలు వెళ్లిపోయారంట అతనెక్కించుకొని రాలేదంట అని సుధాకర్ చెప్తాడు. ఒకసారి ప్రిన్సిపల్ సార్ కూడా ఫోన్ చేసి అడగండి అని వసంత అంటుంది. ప్రిన్సిపాల్ కి కూడా ఫోన్ చేస్తే అదే మాట చెప్తాడు. సార్ కూడా పిల్లలందరూ వెళ్లిపోయారు స్కూల్లో ఎవరూ లేరని చెప్పాడు అని సుధాకర్ చెప్తాడు. ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్దాం పదండి అని పాండురంగ గంగాధర్ సుధాకర్ ముగ్గురు బయలుదేరుతారు. కట్ చేస్తే,
స్కూల్ దగ్గరికి వెళ్లి వాచ్మెన్ నీ అడుగుతారు మా పిల్లలు ఎక్కడికి వెళ్లారు నువ్వు చూడలేదా అని. సార్ డ్రైవర్ బస్ ఏసుకొని వచ్చే లోపే మీ పిల్లలు ఎవరిదో కారులో ఎక్కి వెళ్లారు సార్ అని వాచ్మెన్ చెప్తాడు. అలా ఎలా ఎక్కి వెళ్తారు మీ పర్మిషన్ లేకుండా అని పాండురంగ అంటాడు. అన్నయ్య లోపల వెళ్లి అడుగుదాం పద ఇన్చార్జిని అని పాండురంగ అంటాడు. అక్కడ కూడా వాళ్ళు అదే మాట చెప్తారు పిల్లలందరూ వెళ్లిపోయారు మా స్కూల్ టైం లో అయితే మా పర్మిషన్ తీసుకోగలరు సార్ స్కూల్ వదిలి పెడితే ఎవరి ఆటోలో ఎవరు బస్సులో వాళ్లే వెళ్లిపోతారు అని అతను చెప్తాడు. కట్ చేస్తే,
ఇంతలో గంగా వసంత కూడా ఆటో వేసుకొని స్కూల్ దగ్గరికి వస్తారు. పిల్లలు గురించి ఏమైనా తెలిసిందా అని వసంత అడుగుతుంది. లేదు వసంత ఎవరిదో కారెక్కి వెళ్లిపోయారంట అని సుధాకర్ చెప్తాడు. ఇంతలో సుధాకర్ ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరిదో కొత్త నెంబర్ అని సుధాకర్ ఫోన్ ఎత్తుతాడు. మీరు లాయర్ వసంత గారి భర్త నా ఆవిడకు ఒకసారి ఇవ్వండి నేను మాట్లాడాలి అని అతను అంటాడు. మా టెన్షన్ లో మేమున్నామండి ఇప్పుడు వసంతతో ఏం మాట్లాడతారు అని సుధాకర్ అంటాడు. వసంత ఫోన్ తీసుకొని హలో ఎవరండీ మీరు మీకేం కావాలి అని వసంత అంటుంది. మేడం మీరు శ్రీధర్ గారి కేసును వదిలేయాలి లేదంటే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా రారు మీ పిల్లల్ని మేము కిడ్నాప్ చేసాం అని అతను చెప్తాడు. కిడ్నాప్ చేశారా దేనికయ్యా అని వసంత అంటుంది. మీరు రేపు కోర్టుకు వెళ్లకపోతే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారు లేదంటే మాత్రం మీ పిల్లల్ని మేము వదిలిపెట్టం అని అతను బెదిరిస్తాడు. అతని మాటలు విన్న వసంత భయపడిపోతుంది. కట్ చేస్తే,
ఇంటి దగ్గర నుంచి దేవమ్మ టెన్షన్ పడుతూ సిరి వసంత కు ఒకసారి ఫోన్ చెయ్యి పిల్లలు దొరికారో లేదో అని అంటుంది. అమ్మ వదిన మెసేజ్ పెడుతూనే ఉంది వాళ్ళు కూడా మనలాగే టెన్షన్ పడతారు కదా అని సిరి అంటుంది. నాకెందుకు భయంగా ఉంది మళ్లీ ఒకసారి చెయ్యి అని దేవమ్మ అంటుంది. సిరి ఫోన్ చేసి అన్నయ్య పిల్లలు దొరికారా అని అడుగుతుంది. లేదమ్మా దొరకగానే ఫోన్ చేస్తాను అని సుధాకర్ చెప్తాడు. అమ్మ పిల్లలు ఇంకా దొరకలేదంట వెతుకుతున్నారంట అని సిరి చెప్తుంది. కట్ చేస్తే,
అక్క బావ ఫోన్ కి ఎందుకు ఫోన్ వస్తుంది అతను నీతోటి ఎందుకు మాట్లాడతాను అంటున్నాడు అంతసేపు ఏం మాట్లాడావు అని శ్రీలక్ష్మి అంటుంది. చెప్తాను శ్రీలక్ష్మి రెండు రోజులుగా నేను కేసు వాదిస్తున్నాను ఆ కేసు ఓడిపోతామేమోనని వాళ్లు భయపడిపోయారు అని వసంత అంటుంది. ఆ కేసుకి మన పిల్లలకి సంబంధం ఏంటి అక్క అని శ్రీలక్ష్మి అంటుంది. నేను పనిచేసే సార్ దగ్గర ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ శ్రీధర్ అనే ఒక అతను కబ్జా చేశాడు ఆ కేసు ఆల్మోస్ట్ గెలిచేస్తామని పిల్లల్ని అడ్డం పెట్టుకొని నన్ను కోర్టుకు వెళ్ళొద్దంటున్నారు అని వసంత చెప్తుంది. పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అక్క అని శ్రీలక్ష్మి అంటుంది. అవును శ్రీలక్ష్మి పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని వసంత టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఎలా ఏం చేద్దాం అని గంగా అంటుంది. కట్ చేస్తే,
చంగయ్య ఇంతలో ఇంటికి వస్తూ ఉండగా పిల్లలు ట్యూషన్ కి వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు మీరు కూర్చుని చదువుకోండి ఎందుకు అల్లరి చేస్తున్నారు అని వాళ్ళని బెదిరించి ఇంట్లోకి వెళ్తాడు చంగయ్య లోపలికి వెళ్తాడు. ఏమైంది సిరి ఎందుకు అలా ఉన్నారు పిల్లలు బయట అల్లరి చేస్తున్నారు శ్రీలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది చంగయ్య అంటాడు. పిల్లలకు ఏదో బుక్కులు అవసరం ఉంటే బయటికి వెళ్ళింది అని దేవమ్మ చెప్తుంది. నువ్వు అబద్దం చెప్తున్నావ్ దేవమ్మ ఎప్పుడు నేను రాగానే మంచినీళ్లు తెచ్చి ఇచ్చే వాళ్ళు కదా అని చ0గయ్య అంటాడు. నిజంగానే పిల్లల కోసమే బయటికి వెళ్లిందండి అని దేవమ్మ అంటుంది. సరే సిరి పిల్లలు బయట అల్లరి చేస్తున్నారు వాళ్ళని అల్లరి చేయొద్దని చెప్పమ్మా అని చ0గయ్య అంటాడు. దేవమ్మ వెళ్లి చంగయ్యకు మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది.సిరి వెళ్లి వాళ్ళని బెదిరిస్తూ కూర్చుని చదువుకోమని చెప్తుంది..
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!