యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొద్ది నెలల క్రితం భార్య, స్టార్ హీరోయిన్ అయిన సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో గ్రాండ్గా గోవాలో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా గుర్తింపు కూడా పొందారు. కానీ, అనూహ్యంగా వీరు విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
సమంతతో విడిపోయాక చైతు తన ఫోకస్ను పూర్తిగా కెరీర్ పైనే పెట్టారు. సమంతతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్న విషయంపై ఎక్కడా స్పందించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న చైతు.. త్వరలోనే `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన నాగచైతన్య.. వెంకీ కూతురు రిప్లై వైరల్!
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై బడా నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. జూలై 22న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఆసకక్తిర విషయం ఏంటంటే.. `జోష్` సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది దిల్ రాజే. ఆ తర్వాత ఒక్కసారి కూడా చైతు దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయలేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు `థ్యాంక్యూ` మూవీతో వీరిద్దరూ కలిశారు.
ఈ విషయంపై చైతు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `జోష్ తర్వాత కూడా దిల్ రాజుగారు చాలా కథలను నా దగ్గరికి పంపించారు. సరైన కథ పడినప్పుడు చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. అలా వెయిట్ చేస్తూ ఉండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. అయితే థ్యాంక్యూ కథను వినిపించినప్పుడు మాత్రం వెంటనే ఒప్పేసుకున్నాను. అందుకు కారణం కథలోని కొత్తదనం .. పాత్రలోని వైవిధ్యం. దిల్ రాజు గారితో 12 ఏళ్ల గ్యాప్ వచ్చిందనే బాధకంటే కూడా, ఒక మంచి సినిమా చేశామని ఆనందమే ఎక్కువగా ఉంది.` అంటూ చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!