Naga Panchami: మన యువరాణి కొత్త ఎత్తుగడ వేస్తున్నది మహా మృత్యుంజయ యాగం చేసి మోక్ష ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నించుచున్నది అని ఫణేంద్ర నాగదేవతో చెప్తాడు. అలా జరగకూడదు ఆ యాగము జరిగితే మోక్ష అని పంచమి కాటు వేసి చంపలేదు అందుకని ఆ యాగము ఆగిపోవాలి అని నాగదేవత అంటుంది. ఆ యాగమునకు అన్ని ప్రయత్నంలు చేస్తున్నారు మాత అని ఫణేంద్ర అంటాడు. మహా మృత్యుంజయ యాగం వెనుక ఎవరున్నారో అర్థమైంది అదే జరిగితే వరమో ఏమీ చేయలేము ఆ యాగమును ఆపడానికి స్వయంగా నేనే వెళ్లి ప్రయత్నిస్తాను నువ్వు వెళ్లి నీ ప్రయత్నంలో నువ్వు ఉండు యువరాణి మోక్ష ఇలాంటి పరిస్థితుల్లో ఏకం అవ్వకూడదు అలా జరిగితే మన యువరాణి పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది అని నాగదేవత అంటుంది. అలా జరగనివ్వను మాత అని ఫణీంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,
నీలాంబరి ధ్యానం చేస్తూ ఆత్మని విడదీసి మోక్ష దగ్గరికి వెళ్లి తన ఒంట్లో ఏదో మాయని ప్రవేశపెట్టి లేపుతుంది మోక్ష లేసేసరికి ఆత్మ రూపంలో ఉన్న నీలాంబరి కనిపిస్తుంది. నీలాంబరి వెనకాల వెళుతూ ఉంటాడు మోక్ష. నీలాంబరి ఆత్మ తను కూర్చున్న దగ్గరికి వచ్చి ఈ నిలబడి తనలో కలిసిపోతుంది. నీలాంబరి లేచి మోక్షని కౌగిలించుకుని నన్ను నేను నీకు అర్పించబోతున్నాను అని చెప్తుంది. సుబ్బు మాయజాలం చేత నీలాంబరి దూరంగా విసిరి వేయబడుతుంది. ఇంతలో సుబ్బు వచ్చి పాముల గురించి పొద్దున మాట్లాడుకోవచ్చు కదా ఇంత రాత్రివేళ ఎందుకు అని అంటాడు. సుబ్బు నువ్వా అని అంటాడు మోక్ష. ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వచ్చాను సుబ్బు ఇక్కడ చూస్తే నీలాంబరి కనిపించింది అని మోక్ష అంటాడు. అర్ధరాత్రులు పిచాచాలే పిలుస్తాయి అలా వెళితే పీల్చి పిప్పి చేస్తాయి ఇంకెప్పుడూ ఎవరు పిలిచినట్టు అనిపించినా రాకు మోక్ష పంచమిని కనిపెట్టుకొని ఉండు అని అంటాడు సుబ్బు. మోహిని సుబ్బు చెప్పాడు అంటే అది కరెక్టే అవుతుంది నువ్వు కూడా అర్ధరాత్రి వేళ తిరగకు వెళ్లి పడుకో బాయ్ సుబ్బు అంటూ మోక్ష వెళ్ళిపోతాడు. నీలాంబరి చుట్టూ త్రిశూలాలు అటు ఇటు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాయి. నీలాంబరి కి జగన్మాత చెప్పిన మాట గుర్తుకు వచ్చి నమస్కారం చేసుకుంటుంది. దానితో త్రిశూలాలు మాయమైపోతాయి తను రూమ్ లోకి వెళ్ళిపోతుంది నీలాంబరి. కట్ చేస్తే,
డాడీ నీతో కొంచెం మాట్లాడాలి అని మోక్ష అంటాడు. దేని గురించి మోక్ష అని రఘు అంటాడు. రేపు ఒక ఫంక్షన్ చేయాలి డాడీ అని మోక్ష అంటాడు. నిన్ననే పెళ్లి రోజు చేసుకున్నావు మళ్లీ ఏం ఫంక్షన్ అని చిత్ర అంటుంది. ప్రతి దాంట్లో తగుదునమ్మా అని దూరిపోతారు నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అని భార్గవ్ అంటాడు. మేము ఇంటి కోడళ్లం ఎవరు ఏం చేయాలి అనుకున్న పెత్తనం తీసుకున్న వాళ్లు మాకు చెప్పాల్సిందే అని జ్వాల అంటుంది. వాళ్ల మాటలకే కానీ నువ్వు చెప్పు మోక్ష ఏం ఫంక్షన్ అని వైదేహి అడుగుతుంది. మహా మృత్యుంజయ యాగం చేయాలి అని మోక్ష అంటాడు. పూజలు యాగాల గురించి నువ్వు చాలా దూరంగా ఉంటావు కదా యాగం గురించి మాట్లాడితే మాకు విచిత్రంగా ఉంది అని రఘు అంటాడు. మన పరిస్థితులు ఒక్కోసారి నమ్మేలా చేస్తాయి అని మోక్ష అంటాడు. మీ తాతయ్య కూడా మొదట్లో ఏది నమ్మేవాడు కాదు ఆ తరువాత నీలాగే నమ్మి ఎవరెవరిని తీసుకొచ్చి పూజలు చేయించేవాడు అని శబరి అంటుంది. అవునా సేమ్ టు సేమ్ తాత ఎక్కువగా నాగ దోషం తో భయపడేవాడు కదా ఇప్పుడు మోక్ష కి కూడా అలాగే జరుగుతుందా పౌర్ణమి దగ్గరికి వచ్చింది కదా పాములు కాటేసినట్టు కలవచ్చు ఉంటుంది అంతే కదా మోక్ష అని జ్వాల అంటుంది.
ఎన్ని పూజలు చేసినా తాతగారు పాము కాటు వల్లే కదా బామ్మ పోయారు అని చిత్ర అంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చిత్ర కాటు వేయాలనుకున్న పాము వదిలిపెడుతుందా చెప్పు అని జ్వాల అంటుంది. మాటలు రాకుండా ఉండే టాబ్లెట్ ఉంటే బాగుండేది రెండు తెచ్చి వీళ్ళ నోట్లో పడేస్తే మాట్లాడకుండా మూలన పడుండే వాళ్ళు అని రఘు వాళ్ళ చెల్లెలు అంటుంది. నా గదిలోకి రా మోక్ష అక్కడ మాట్లాడుకుందాం అని రఘు అంటాడు. ఇందులో సీక్రెట్ ఏముంది నాన్న నాకు నాగదోషం ఉందని అందరికీ తెలుసు అందుకని ఒక యాగం చేస్తే ఈ కార్తీక పౌర్ణమికి గండం నుంచి తప్పించుకో వచ్చని తెలిసింది అని మోక్ష అంటాడు. ఏమి యాగం మోక్ష సర్పయాగమా అశ్వమేధ యాగమా అని జ్వాల వెటకారం చేస్తూ అంటుంది. మహా మృత్యుంజయ యాగం చేస్తే మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు అని పంచమి అంటుంది.
ఇలాంటి పూజలకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు మామయ్య నంబూద్రి గారు ఒకరోజు ఇలాగే పూజ మొదలుపెట్టాడు ఆరోజు పాము రాకుండా పోయిందా ఒకటికి నాలుగు వచ్చాయి ఏదో ఆరోజు గండం తప్పింది కానీ లేకుంటే ఆ రోజేమోక్ష పైకి పోయేవాడు అని జ్వాల అంటుంది. నోరు మూయండి లేకపోతే ఆ యాగంలో వేసే మిమ్మల్ని కాల్చి పడేస్తాను అని వైదేహి అంటుంది. మోక్ష ఆ యాగం రేపే జరిపిద్దాము అని రఘు అంటాడు. మా ఊరి దగ్గర నాగ సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారికి ఈ యాగం గురించి బాగా తెలుసు అని పంచమి అంటుంది. అయితే మీ అమ్మగారికి ఫోన్ చేసి నాగసాధులతో మాట్లాడమని చెప్పు ఆ యాగాని అక్కడ చేద్దాము అని రఘు అంటాడు. రఘు నేను కూడా వస్తాను రా అని శబరి అంటుంది. సరే మోక్ష మీరు ఎప్పుడు అంటే అప్పుడే బయలుదేరుదాం అని రఘు అంటాడు. సరే పద పంచమి మీ అమ్మకు ఫోన్ చేసి చెబుదాము అని మోక్ష వెళ్లిపోతాడు. అక్క మనం ఆ యాగానికి వెళ్లకుండా తప్పించుకుందాం అని చిత్ర జ్వాల అనుకుంటారు. కట్ చేస్తే,
స్వామికి నాగదేవత ప్రణామములు అని అంటుంది నాగదేవత. శుభమస్తు అని సుబ్బు దీవిస్తాడు. స్వామి మా నాగజాతి మీద నీకు కోపం వచ్చిందా అని నాగదేవత అంటుంది. ఆ అనుమానం ఎందుకు వచ్చింది నాగదేవత అని సుబ్బు అంటాడు. మీ భక్తురాలికి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు కానీ మా యువరాణి విషయంలో మీరు చూపించే కరుణా కటాక్షాలు మాకు ఆటంకాలను కలిగిస్తున్నాయి నాగజాతి లక్షణం శత్రువుని కాటు వేసి చంపడమే కదా మా నాగలోకపు నియమము అని నాగదేవత స్వామిని అడుగుతుంది..
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!