Nindu Noorella Saavasam April 9 2024 Episode 206: రేయ్ నాకు కావాల్సింది నగలు ఆస్తి కాదు అమర్ తో పెళ్లి అందుకు ఏమైనా చేయడానికి సిద్ధం నన్ను నమ్ము కావాలంటే ఆ డూప్లికేట్ నగలు కూడా తెచ్చిస్తాను చూసుకో అని మనోహరి అంటుంది. మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను మేడం ఇవి గనుక డూప్లికేట్ అని తెలిస్తే డైరెక్ట్ గా అమరేంద్ర దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తాను అంటూ ఆ డ్రైవర్ వెళ్ళిపోతాడు. హమ్మయ్య వీడి పీడ విరగడయిపోయింది ఇక అమర్ తో పెళ్లి ఎవరు ఆపలేరు అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, అంజలి సోఫా వెనకాల ఉండడం చూసిన గుప్తా గారు బాలిక ఈరోజు నా నుండి ఎవరు నిన్ను తప్పించలేరు అని అంటాడు. నేను ఈయన వెనకాల ఉన్నది ఎలా కనిపెట్టారు అని నీలా అనుకుంటుంది. బాలిక నిన్ను మా లోకమునకు తీసుకుపోవడం తథ్యం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని గుప్తా అనడంతో నీలా తననే అంటున్నాడు
అనుకొని వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకుని ఎవరు ఆపినా నేను ఊరుకోను అని అంటుంది. అమ్మ గుప్తా గారు నన్ను మీ లోకమునకు తీసుకుపోవడానికి ఇంత ప్లాన్ వేస్తావా ఉండు నీ పని చెప్తా అని బయటికి వచ్చి గుప్తా గారు మీరు రొమాంటిక్ ఫోజు ఆపండి అంటూ పరిగెత్తుతుంది. బాలిక ఆగము అని గుప్తా వెళుతూ ఉండగా నన్ను తీసుకువెళ్లండి నేను వస్తాను అని నీలా అంటుంది. ప్రేమ ఎంత ప్రమాదకరమో పెద్దలు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది అంటూ తనని వదిలించుకొని వెళ్ళిపోతాడు గుప్తా. కట్ చేస్తే, అంజలి వెళ్లి ఒక సోఫాలో కూర్చుంటుంది. ఏం బాలిక నీ ఆటలు ఆపుము ఇక మా లోకమునకు పోదాము అని గుప్తా అంటాడు. ఏంటి గుప్తా గారు నన్ను తీసుకు వెళ్ళడానికి నాన్న ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు దొరకనుగా అని అంజలి అంటుంది. బాలిక నువ్వు ఒకరి ఒంట్లో ఇంతసేపు ఉండడం అంతా మంచిది కాదు అని గుప్తా అంటాడు. మామయ్య గారు టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంటూ అంజలి పరిగెత్తుతుంది.
కట్ చేస్తే, శివరామ్ కి టాబ్లెట్ ఇచ్చి వేసుకోండి మామయ్య అని అంటుంది. అచ్చం మీ అమ్మ లాగా మాట్లాడుతున్నావ్ ఏంటి అంజు అని శివరామ్ అంటాడు. అమ్మ బ్రతికున్నప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోమని నీకు చెప్పేది కదా తాతయ్య అప్పుడప్పుడు మాకు చెప్తూ ఉండేది అని అంజు అంటుంది. చూశారా అండి మన కోడలు చనిపోయిన తన ప్రేమ ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంది అని నిర్మల అంటుంది. అంత మంచి కోడల్ని ఇచ్చినందుకు సంతోషపడాలో ఇంతలోనే దూరమై పోయినందుకు బాధపడలో అర్థం కావట్లేదు అని శివరామ్ బాధపడతాడు. వాళ్ళ మాటలు విన్న అంజలి బాధపడుతూ బయటికి పరిగెత్తుతుంది. కట్ చేస్తే, బాలిక నీ కుటుంబం దగ్గర నీ ఉనికిని తెలియజేయాలనుకున్నచో నీకు కష్టములు ఎక్కువ అవును వారికి బాధనే మిగులను అందుకే నేను చెప్పినది వినుము బాలిక మా లోకానికి పోదాం అని గుప్తా అంటాడు. నేను రాను గుప్తా గారు ఈ ఒక్క రోజుకి ఇక్కడ ఉండనివ్వండి అని అంజలి అంటుంది. నిన్ను ఎలా తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు అని గుప్తా గారు ముందు ముందుకు వెళుతుండగా అంజలి వెనుకకు అడుగులు వేస్తూ పూజ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న దేవుడి శక్తి ముందు అరుంధతి నిలబడలేక బయటికి వచ్చేస్తుంది.
నేనేంటి ఇలా బయటికి వచ్చాను అంజలి అని చూసేసరికి అంజలి పూజ మందిరంలో ఉంటుంది. గుప్తా గారు నన్ను ఈ ఒక్క రోజుకు ఉండనివ్వండి అంటూ పరిగెత్తుతుంది అరుంధతి. బాలిక నీ పరుగు ఆపము ఎక్కడికి పరిగెత్తుతున్నావు అని గుప్తా తన వెనకాల పరిగెత్తుతాడు. ఇంతలో భాగమతి వచ్చి అక్క ఇక్కడే వెనకాల ఉంది మీరు ఆట ఆడుతున్నారా అని అడుగుతుంది. అవును ఆ బాలికను పట్టుకోవాలని అని గుప్తా అంటాడు. అక్క ఎక్కడ ఉన్నదో నేను మీకు చెప్తాను మిమ్మల్ని గెలిపిస్తాను అని భాగమతి అంటుంది. ఇక్కడ ఎవరూ లేరే అని రాథోడ్ అటు ఇటు చూసి మిస్సమ్మ మాటలు నాకు ఒక్కోసారి ఏమీ అర్థం కావట్లేదు అంటూ వెళ్ళిపోతాడు. ఒకపక్క భాగమతి ఒకపక్క గుప్తా గారు వచ్చి అరుంధతిని చుట్టుముడుతారు. అక్క దొరికిపోయావ్ కొంచెం జాగ్రత్తగా ఉంటే చచ్చిపోయే దానివి కాదు కదా అని భాగమతి అంటుంది. నీ రాక కోసం ఈ బాలిక మరణం లిఖించబడి ఉన్నది బాలిక అని గుప్త అంటాడు. ఏమంటున్నారు గుప్తా గారు అని భాగమతి అంటుంది.
నీవు వచ్చి నన్ను గెలిపించింతివి కదా ఈ బాలిక ను పట్టుకోవాలని ఉన్నది అని గుప్తా మాట మారుస్తాడు. నాకు వేరే పని ఉంది మీరు ఆడుకోండి అంటూ భాగమతి వెళ్ళిపోతుంది. ఇక నిన్ను ఎవ్వరు రక్షించలేరు బాలిక నా నుండి అని గుప్తా గారు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండగా అరుంధతి కాళ్ల మీద పడి గుప్తా గారు ఈ ఒక్క రోజుకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి మా ఆయనతో మనోహరి పెళ్లి జరగకూడదు బంగారం లాంటి ఈ కుటుంబానికి ఆ రాక్షసి కోడలు కకూడదు నా పిల్లల నైనా గుర్తుకు తెచ్చుకొని నన్ను ఈ ఒక్క రోజుకి ఇక్కడే ఉండనివ్వండి ఇక మీదట మిమ్మల్ని ఏమీ అడగను అని అరుంధతి ప్రాధేయపడుతుంది. పిల్లల్ని గుర్తుకు తెచ్చుకున్న గుప్తా గారు సరే బాలిక నీ పిల్లలని చూసి నీకు ఈ ఒక్క రోజుకి గడువు ఇస్తున్నాను కానీ రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు మనము ఈ లోకమును విడిచి మా యమలోకమునకు పోవుటకు సిద్ధం కావలెను అని గుప్తా అంటాడు. చాలు గుప్తా గారు మీరు చేసిన ఈ మెయిల్ ఎప్పటికీ మర్చిపోను అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, డ్రైవర్ నగలు తీసుకుని వెళ్లి ఒక బంగారు షాపులో అమ్మడానికి బేరం పెడతాడు.
వాటిని చూసి నా సెట్ డూప్లికేట్ నాగలు తెచ్చి డబ్బులు కావాలంటావా ఉండు పోలీసులు పట్టిస్తాను అని అంటాడు. ఇవి డూప్లికేట్ నగల అని పారిపోతాడు ఆ డ్రైవర్. దూరంగా పారిపోయి మనోహరి కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా డబ్బులు ఇస్తే నీ పీడ విరగడైపోతుంది అంటే మళ్ళీ ఫోన్ చేస్తున్నావ్ అని మనోహరి అంటుంది. ఏంటి మేడం డూప్లికేట్ నాగలని నాకిచ్చి పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటున్నావా డైరెక్ట్ గా మిల్ట్రీ అతని దగ్గరికి వెళ్లి నేను నిజ స్వరూపం బయట పెడతాను అని డ్రైవర్ అంటాడు. రేయ్ నీ దగ్గర ఉన్నాయి డూప్లికేట్ అయితే నా దగ్గర ఒరిజినల్ ఉన్నాయేమో చూస్తాను ఉండు అని మనోహరి చూసేసరికి అక్కడ కూడా డూప్లికేట్ నగలే ఉంటాయి. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది రేపు పొద్దున కెల్లా నీకు డబ్బులు ఇస్తాను అని మనోహరి అంటుంది. మేడం రేపు ఉదయం వరకే నీకు టైం ఆ తరువాత మిల్ట్రీ అయిన దగ్గరికి వెళ్లి అంతా నిజం చెప్పేస్తాను అని ఆ డ్రైవర్ బెదిరిస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!