Nindu Noorella Saavasam March 22 2024 Episode 191: అమర్ నీతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు వస్తావా అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, ఏంటి అమర్ నువ్వు చేసేది ఆరు ఉంటే పిల్లల్ని సంబర్ సెలవులు వచ్చినప్పుడు నిన్ను ఒప్పించి మరి పంపించేదంట ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని మనోహరి అంటుంది. చూడు మనోహరి పిల్లల వెంట ఎవరూ లేకుండా పంపియను ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు పంపియను అని అమరేంద్ర అంటాడు. అమర్ మన పెళ్లి జరగబోతుంది ఇలాంటి టైంలో వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంత బాధ పడతారు వాళ్ళమ్మ స్థానంలోకి నేను వస్తున్నానని వాళ్లు బాధపడతారు అందుకే పిల్లల్ని పెళ్లయ్యేదాకా ట్రిప్ పంపించమంటున్నాను అని మనోహరి అంటుంది. అమరేంద్ర ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే, మేడం పిల్లలు ట్రిప్ కి వస్తారు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అమరేంద్ర అంటాడు. అలాగే సార్ అని మేడం వెళ్ళిపోతుంది. తాతయ్య మేము ట్రిప్ కు వెళ్లడం మాకు ఇష్టం లేదు మీరే డాడీకి చెప్పండి అని పిల్లలు బాధపడతారు. మేము ఏమి చేయాలేము పిల్లలు అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి మిస్సమ్మ ఎలా ఉంది నేను ఇచ్చిన ట్రస్టు అమర్ తో నాకు పెళ్లి అవ్వడం పిల్లల్ని దూరం చేయడం వాళ్ళని హాస్టల్లో వేసేయడం ఈ ముసలి వాళ్ళని అనాధాశ్రమంలో వేయడం అంత నువ్వు చూస్తూ ఉండగానే జరుగుతుంది చూడు నీ కళ్ళ ముందే ఈ కుటుంబాన్ని చల్లచెదురు చేసి ఆడుకుంటాను అని మనోహరి వెళ్ళిపోతుంది. మనోహరి గారిది స్పీడు చూస్తుంటే ఆవిడతో ఛాలెంజ్ చేసి మనం పొరపాటు చేసాము ఏమో అనిపిస్తుంది మిస్సమ్మ మనుషుల జీవితాలతో ఆడుకునే మనోహరి ఈ కుటుంబాన్ని ఏం చేస్తుందో అని రాథోడ్ బాధపడతాడు.
కట్ చేస్తే, గుప్తా గారు బాగి నా చెల్లెలు ఆయన మా నాన్న అందుకే నేను బాగి కి కనపడుతున్నాను ఆయనకు నేను ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన బాధ చూస్తుంటే ఒక్కసారైనా నన్ను చూడాలని పశ్చాత్తాప పడుతున్నారు అందుకేనా బాగీకీ నన్ను అక్క అని పిలిచింది నా పిల్లల్ని నా కుటుంబాన్ని మనోహరి నుంచి కాపాడాలని చూస్తుంది నేను వెంటనే వెళ్లి బాగి కి నిజం చెప్పేస్తాను అని అరుంధతి అంటుంది. సరస్వతి మేడం దగ్గర నువ్వు ఒక్కదానివే పెరగలేదు కదా బాలిక మనోహరి కూడా పెరిగింది మనోహరి కలవడానికి వచ్చి ఉండొచ్చు కదా మనోహర్ని కలవడానికి మిస్సమ్మ ఇక్కడికి వచ్చిందేమో నువ్వెందుకు బాలిక అపోహ పడుతున్నావ్ అని గుప్తా అంటాడు. లేదు గుప్తా గారు నేను బాగి కి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాను మీరు నన్ను మభ్య పెట్టడానికి అబద్దం చెబుతున్నారు మీకు తెలిసే ఉంటుంది కదా చెప్పండి అని అరుంధతి అంటుంది. చూడు బాలిక నువ్వు మిస్సమ్మకి నిజం చెప్పాలని ప్రయత్నం మానేసి పిల్లల్ని కాపాడాలి కుటుంబాన్ని కాపాడాలని మనోహరితో ఒంటరిగా యుద్ధం చేస్తున్న భాగమతికి సహాయం చేయి అని గుప్తా అంటాడు.
నేను బాకీ కి తప్పఇంకెవరికి కనిపించను నేను ఎలా సహాయం చేయగలను అని అరుంధతి అంటుంది. మనసులో గట్టిగా అనుకోబాలిక నీకు శక్తి వచ్చి నువ్వు సహాయం చేస్తావు పౌర్ణమి నాడు అని గుప్తా ఆపేస్తాడు. పౌర్ణమి నాడు ఏం జరుగుతుంది గుప్తా గారు చెప్పండి అని అరుంధతి అంటుంది. ఏమున్నది పౌర్ణమినాడు చంద్రుడు గుండ్రముగా నుండును అని గుప్తా వెళ్ళిపోతాడు . లేదు గుప్తా గారు అమావాస్యన డు నేను కనపడకుండా పోయాను అంటే పౌర్ణమి నాడు నాకు ఏదో శక్తి వస్తుంది అంతే కదా అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, మిస్సమ్మ మేము ట్రిప్ కి వెళ్ళమని నాన్నతో నువ్వైనా చెప్పు మిస్సమ్మ అని పిల్లలు బాధపడతారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్లే లేరు మిస్సమ్మ అమ్మ ఉంటే ఇలా చేసేది కాదు అన్ని మాకు నచ్చినవే చేసేది అని పిల్లలు బాధపడతారు.
నేను ఉన్నంతవరకు మిమ్మల్ని మీ నాన్నకి ఎవరు దూరం చేయలేరు ఎలాగో అలా మిమ్మల్ని ట్రిప్ కు వెళ్లకుండా నేను చేస్తాను అని భాగమతి అంటుంది. పిల్లలు మీ బాధను చూసి బాధపడడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను అని రాథోడ్ కన్నీరు పెట్టుకుంటాడు. భాగమతి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. మనోహరి ఆంటీ వచ్చిన కానుంచి మనకు ఇవన్నీ కష్టాలు మనోహరి ఆంటీ మనల్ని ట్రిప్ కి పంపిస్తున్నట్టు లేదు డాడీకి దూరం చేస్తున్నట్టు ఉంది అని అంజలి అంటుంది. మనోహరి ఆంటీ నుంచి మనల్ని కాపాడేది ఎవరు అని ఆకాష్ అంటాడు. మనల్ని కాపాడడానికి ఎవరూ రారు కానీ మనమే డాడీ దగ్గరికి వెళ్లి మనోహరి ఆంటీ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేదం అని అంజలి అంటుంది.
ఈ ప్లాన్ బాగానే ఉంది కానీ డాడీకి ధైర్యంగా చెప్పగలమా అని అమృత అంటుంది. డాడీ తో మాట్లాడాలేము కాబట్టి ఒక లెటర్ రాసి డాడీ రూమ్ లో పెడదాం అది చదువుకొని డాడీ అర్థం చేసుకుంటాడు అని అంజలి అంటుంది. సరే అయితే అలాగే చేద్దాం అని పిల్లలు అనుకుంటారు. అమ్మ పిల్లలు మా మేడం ఎంతో కష్టపడి అమరేంద్ర ని పెళ్లికి ఒప్పిస్తే మీరు పెళ్లి చెడగొట్టాలని చూస్తారా మిమ్మల్ని ఆపమని మనోహరి కి చెప్పాలి అని నీలా అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!