Nindu Noorella Saavasam March 25 2024 Episode 194:లెటర్ ని చూస్తాడు అమరేంద్ర. పిల్లలు ఎందుకు మీరు అలా లెటర్ రాసి పెట్టారుఅని భాగమతి అడుగుతుంది.డాడీ తో మాట్లాడే ధైర్యం లేక అలా లెటర్ రాసి పెట్టాము మిస్సమ్మ అని అంజు అంటుంది.అంజు మీరు చేసింది మంచి పనే కానీ మీ మీద కక్ష పెట్టుకుని మిమ్మల్ని ఏమైనా చేస్తుంది మనోహరి అని భాగమతి అంటుంది.ఇంతలో అమరేంద్ర పిల్లలు అందరు కిందికి రండి అని పిలుస్తాడు.అందరూ కిందికి వస్తారు.కట్ చేస్తే,ఈ లెటర్ రాసి పెట్టింది ఎవరు అని అమరేంద్ర అడుగుతాడు.నేనే రాశాను డాడీ అని అంజలి అంటుంది.నాతో ఏ విషయమైనా చెప్పడానికి మీకు భయం ఎందుకు అని అమరేంద్ర అంటాడు.అంటే మేము రాసిన లెటర్ చదివారా డాడీ మా మీద నీకు కోపం లేదా అని అంజలి అంటుంది.డాడీ మేము రాసిన దానికి మీరు ఓకే అంటున్నారా అని అమృత అంటుంది.
సంబర్ సెలవలో ట్రిప్పు కి ముందే వెళ్లాలనుకుంటున్నారు అందుకు కావలసినవి కొన్ని అడిగారు దీంట్లో తప్పు పట్టడానికి ఏముంది అని అమరేంద్ర రాథోడ్ పిల్లలకి ఏం కావాలో అన్ని కొన్ని ఇచ్చి పంపించు అని చెప్తాడు అమరేంద్ర. అది విన్న పిల్లలు భాగమతి షాక్ అవుతారు. సార్ ఒక్కసారి ఆ లెటర్ ఇస్తారా అని భాగమతి అడుగుతుంది. లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు అమరేంద్ర. లెటర్ చదివిన భాగమతి షాక్ అయిపోతుంది. మిస్సమ్మ ఆ లెటర్ రాసింది నేను కాదు అని అంజలి అంటుంది. మనోహరి వంక చూసేసరికి బొమ్మలు ఎగిరేస్తూ చూస్తుంది భాగమతిని. మీరు మా పెళ్ళికి ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని మనోహరి అంటుంది. పిల్లలు కోపంగా వెళ్ళిపోతారు. ఇప్పుడే ఏం చూసావ్ మిస్సమ్మ నేను కొట్టే దెబ్బకి బొమ్మ కనపడుతుంది నీతో తర్వాత మాట్లాడుతాను అని రాథోడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు
అలాంటి వాళ్ల కోసం ఎందుకు ఇలాంటి పనులు చేస్తావ్ శుభలేఖలు అయ్యాయి అంట వెళ్లి తీసుకురా అని పంపిస్తుంది మనోహరి.కట్ చేస్తే,ఏంటి గుప్తా గారు మనోహరి పిల్లల్ని క్యాంప్ ముందే పంపించేస్తుంది ఇలా ఎందుకు చేస్తుంది ఇవన్నీ చూడడం కోసమేనా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని అరుంధతి అంటుంది. అదే కదా బాలిక నేను చెప్పేది ఇక్కడ ఉండి నీ కుటుంబం చెల్లా చెదిరవుతుంటే చూసి బాధపడే కంటే మా లోకమునకు పోదాము పా అని గుప్తా అంటాడు. గుప్తా గారు నా కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా నేను ఎక్కడికి రాలేను అయినా పౌర్ణమి వచ్చినప్పుడు నాకు ఏదో శక్తులు వస్తాయని నాకు అర్థమైంది అని అరుంధతి అంటుంది. అలాంటిదేమీ లేదు బాలిక అంతా నీ భ్రమ అని గుప్తా అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి అమరేంద్ర చూస్తాడు.గుప్తా గారు పౌర్ణమి అనేసరికి మీరు ఏమిమాట్లాడడం లేదు నాకు శక్తులు వస్తాయని మీ మౌనమే చెబుతుంది అని అరుంధతి అంటుంది.
బాలిక అటువంటిది ఏమీ లేదు నీకు ఏ శక్తులు రావు అని గుప్తా అంటాడు. గుప్తా గారు మా ఆయన వస్తున్నారు మీరేమీ మాట్లాడకండి అని అరుంధతి అంటుంది. నీ పతిదేవుడు వచ్చిన నాకు ఏమీ భయము అయిననూ నీకు ఏ శక్తులు రావు అని గుప్తా అంటాడు. ఇంతలో అమరేంద్ర వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ నీ ముందు ఎవరూ లేరు కదా అని అడుగుతాడు. ఇప్పుడు ఆయనకేం చెప్పి తప్పించుకుంటారో ఆలోచించండి అని అరుంధతి అంటుంది. మా బామ్మతో మాట్లాడుతున్నాను ఆవిడజీవించి లేదు అని గుప్తా అంటాడు.చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చా అని అమరేంద్ర అంటాడు. మటన్ వేసుకుని కళ్ళు మూసుకొని మనసున్న ధ్యానం చేసిన యెడల మరణించిన వారు కనిపించదరు అని గుప్తా అంటాడు.
నిజంగా చనిపోయిన వారు కనపడతారా అని అమరేంద్ర అంటాడు. దేశమును కాపాడు నీవు భార్యను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసు ప్రేమకు ఎవరైనా దాసులే కళ్ళు మూసుకుని ధ్యానం చేయుము నీకు కనిపించుతారు అని గుప్తా అంటాడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు. ఆయన అలాగే అంటారండి ఆయన మాటలు ఏమీ పట్టించుకోకండి ఆయన ఆటపటించడానికి అన్నారు అని అరుంధతి అమరేంద్ర కి ఎదురుగా కూర్చుని అంటుంది. ధ్యానంలో ఆరు కనిపించగానే కళ్ళు తెరిచి చూస్తాడు అమరేంద్ర. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అరుంధతి ఉంటుంది ఆరు అని అమరేంద్ర అరుంధతి మొహం చేతులతో పట్టుకుంటాడు. బాలిక నీకు నిజముగా కనిపించుచున్నదా అని గుప్తా అంటాడు.
అరుంధతి ఏడుస్తూ అమరేంద్ర చేతుల్ని ముట్టుకుంటుంది. ఆరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అమరేంద్ర. అరుంధతి మాయమైపోతుంది. అమరేంద్ర చేతుల్ని చూసుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ పిలుస్తుంది మనోహరి. ఏంటి అత్తయ్య గారు ఈ పిలుపు నీకు కొత్తగా ఉన్నా అమర్ కి నాకు పెళ్లి అయిన తర్వాత అలాగే పిలవాలి కదా అందుకే అలవాటు చేసుకుంటున్నాను అని మనోహరి అంటుంది. పర్వాలేదు అమ్మ అని నిర్మల అంటుంది. నిన్నటిదాకా ఇంట్లో నన్ను ఉండనిచ్చారు ఆరు స్థానం ఇచ్చింది ఆంటీ అని మనోహరి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!