Nindu Noorella Saavasam November 27 2023 Episode 91: అమరేంద్ర కోపంగా ఇంట్లోకి వెళ్లి రాథోడ్ అని పిలుస్తాడు. ఏంటి సార్ అని రా తోడుంటాడు. అమరేంద్ర కోపంగా వెళ్తున్నాడని అరుంధతి కూడా తన వెనకాల పరిగెత్తుకుంటూ, వెళ్లి ఏమైందండీ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అంటుంది. రాథోడ్ నేను పొద్దున చెప్పిన విషయం గురించి ఏం చేశావు ఏమైనా క్లూ దొరికిందా అని అమరేంద్ర అంటాడు. ఇంకా లేదు సార్ అని రాథోడ్ అంటాడు. ఇదంతా ఎవరో కావాలనే చేశారు వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళని వదిలిపెట్టను అని అమరేంద్ర అంటాడు. మన ఇంట్లో ఎవరికి ఏమైంది అండి ఏమైనా యాక్సిడెంట్ అయిందా అని అరుంధతి అంటుంది. అమరేంద్ర వచ్చాడు తనకు టీ ఇచ్చి బోలెడన్ని కబుర్లు చెబుతూ ఉండాలి అని మనోహరి టీ పట్టుకొని వస్తుంది. ఏంటి అమర్ ఎవరిని నువ్వు వదిలిపెట్టను అంటున్నావు ఏం జరిగింది అని మనోహరి అంటుంది. రాథోడ్ డోర్ దగ్గరికి వెయ్యి అని అమరేంద్ర అంటాడు. ఏమైంది దీని గురించి ఆలోచిస్తున్నావు అని మనోహరి అంటుంది.
ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను కానీ నేనెంతో అరుంధతికి నువ్వు అంతే అందుకే చెప్తున్నాను, కావాలని ప్లాన్ చేసి అరుంధతిని చంపేశారు అని అమరేంద్ర అంటాడు. మాట వినగానే మనోహరి చేతుల్లో ఉన్న టీ కప్పు కింద పడిపోతుంది. అరుంధతి ఎవరికి ఏ పాపం చేసి ఉండదు హత్య చేయాలని ఎవరు చూస్తారు అని అనోహరి అంటుంది.మా పెళ్లి రోజు కంటే ముందు జరిగినవన్నీ కావాలనే చేశారు ఒక పథకం ప్రకారం అనుకోని అరుంధతిని యక్సిడెంట్ చేసి చంపేశారు వాళ్ళు ఎవరైనా సరే నా కుటుంబం జోలికి వచ్చారు కాబట్టి వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అందుకే నేనే ఆ కేసుని ఎంక్వయిరీ చేస్తున్నాను అని అమరేంద్ర అంటాడు.ఆ మాట వినగానే మనోహరి గుండెల్లో దడ పుట్టి గొంతులో తడి ఆరిపోయి భయపడుతుంది. ఏంటి మనోహరి నువ్వు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావ్ అని అమరేంద్ర అంటాడు. యాక్సిడెంట్ ఎవరు చేశారో నేను కొడైకెనాల్కి వెళ్లి తెలుసుకొని రానా అని మనోహరి అంటుంది. ఏమీ అవసరం లేదు మనోహరి ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు తెలిస్తే బాధపడతారు అని అమరేంద్ర అంటాడు. యాక్సిడెంట్ చేసి చంపడం ఏంటండీ ఎవరు చేసి ఉంటారు అని అరుంధతి కుక్క కూల్ పోతుంది.
సరే అమరేంద్ర నేను నీలా ని టీ తీసుకు రమ్మని చెప్తాను అని మనోహరి వెళ్ళిపోతుంది. రాథోడ్ ఏ చిన్న క్లూ దొరికిన వెంటనే ఇన్ఫామ్ చెయ్ అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, అంతా అయిపోయింది అమరేంద్రకు నిజం తెలిసిపోయిది నేనే ఆ యాక్సిడెంట్ చేయించాను అని తెలిస్తే నన్ను వదిలిపెట్టడు అమరేంద్ర అని మనోహరి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే, ఏంటి అక్కా తమ్ముడు ఏవో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అని రామ్మూర్తి అంటాడు. ఏమీ లేదు కానీ నువ్వేంటి అంత సంతోషంగా ఉన్నావు అని వాళ్ళ ఆవిడ అంటుంది. తెలిసిన వాళ్లు భోజనానికి రమ్మన్నారు వెళ్తున్నాను అని రామ్మూర్తి అంటాడు. నాకు తెలియకుండా ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని వాళ్ళ ఆవిడ అంటుంది.నారాయణ వాళ్ళ కూతురు వచ్చిందంట చూసి వెళ్దువు గాని రా అని చెప్పాడు వెళ్తున్నాను అని రామ్మూర్తి అంటాడు. అది సరే మీరేంటి పొద్దున బయటికి వెళ్లారు ఎక్కడికి అని రామ్మూర్తి అడుగుతాడు. ఊరికే బయటికి వెళ్ళాము అని నీకు చెప్పాలా ఒరేయ్ తమ్ముడు అటుకు మీద డబ్బాలున్నాయి తీద్దువు రారా అని వాళ్ళ తమ్ముని తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ల ఆవిడ.
ఇంతలో భాగమతి వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నారు నాన్న అని భాగమతి అంటుంది. ఏమీ లేదమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. ఈరోజు ఏంటి నాన్న చాలా సంతోషంగా ఉన్నావు అని భాగమతి అడుగుతుంది. ఏమీ లేదమ్మా నా మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గర అయ్యారు అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను అని రామ్మూర్తి అంటాడు. నిన్ను ఇంతగా సంతోషపెట్టిన వాళ్ళు ఎవరో నాకు పరిచయం చేయి నాన్న అని భాగమతి అంటుంది. అలాగే చేస్తాను లేమ్మా అని రామ్మూర్తి అంటాడు. నాన్న సరస్వతి గారి గురించి ఏమైనా తెలిసిందా అని భాగమతి అడుగుతుంది. లేదమ్మా తెలిసిన వాళ్ళను కూడా అడిగాను కానీ వాళ్లు ఇంకా దొరకలేదని చెప్పారు మీ అక్క దొరికే లోపు నేను చచ్చిపోతాను అనుకుంటా, అదే జరిగితే చావులో కూడా నాకు మనశ్శాంతి ఉండదమ్మ అని రామ్మూర్తి అంటాడు.
మీరు అలా అనకండి నాన్న మన అక్క దొరుకుతుంది మా అక్క పిల్లలతో తాతయ్య అని పిలిపించుకుంటారు అక్కతో నేను నాకిష్టమైనవన్నీ వండించుకుని తింటాను అక్క బట్టలు నేను వేసుకుంటే అక్క వచ్చి నీతో చెబితే నువ్వు వచ్చి నన్ను కోప్పడతావు అప్పుడు నేను అలుగుతాను ఆ తరువాత నువ్వు అక్క వచ్చి సారీ చెప్తారు నేను అక్క చేయి పట్టుకొని ఆనందంగా నిద్ర పోతాను అని భాగమతి ఏడుస్తుంది. నీ మనసులో ఇంత బాధని దాచుకొని నాతో సంతోషంగా మాట్లాడుతున్నావా అమ్మ అని రామ్మూర్తి అంటాడు. కట్ చేస్తే ఎవరికి అవసరం ఉంది అరుంధతి ని ప్లాన్ వేసి చంపేంత కక్ష ఎవరికి ఉంది అని అమరేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో భాగమతి లేట్ అయిపోయింది ఆయన కంట పడకూడదు అనుకుంటూ లోపలికి వెళ్తుంది.
అక్కడే అమరేంద్ర ఉంటాడు, భాగమతిని చూసి ఎక్కడికి వెళ్లావు ఇప్పటిదాకా అని అంటాడు. కొంచెం పని ఉండి బయటికి వెళ్లాను లేట్ అయింది సారీ అని భాగమతి అంటుంది. చూడు నువ్వు పిల్లల్ని చూసుకుంటావని నిన్ను పెట్టాను నువ్వే ఇప్పటిదాకా బయట తిరిగి వస్తే పిల్లలును ఎవరు చూసుకుంటారు నీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను తీరుస్తాను నువ్వు నా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చావు,నీకు కావాల్సింది ఏదైనా సరే చేసి పెడతాను అని అమరేంద్ర అంటాడు. అయ్యో నాకు డబ్బు అవసరం లేదండి అని భాగమతి అంటుంది. అయితే ఇంకేదైనా హెల్ప్ కావాలా అని అమరేంద్ర అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!