Nindu Noorella Saavasam October 2 ఎపిసోడ్ 43: ఇంత మందిని తను ఒక్కతే ఎలా చూసుకునేది ఇంత పెద్ద ఇల్లును ఎలా మైంటైన్ చేసేది తను చాలా గ్రేట్ నలుగురు పిల్లల్ని భర్తని ఎంత బాగా చూసుకుందో ఏమో అందుకే కాబోలు అందరూ ఆమె కోసం అంతలా బాధపడుతున్నారు కానీ ఏం లాభం అప్పుడే ఆమెకు ఆయుష్ తీరిపోయి పై లోకానికి వెళ్లిపోయింది ఎంత ఉంటే ఏం లాభం అనుభవించే అదృష్టం లేదు కదా ఆ పిల్లల్ని అత్తమామల్ని ఆమె భర్తని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటున్న మనోహరీ అంత మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది ఏమోలే మనకు ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందు ముందు చూద్దాం కానీ ఇప్పుడు ఏం చేద్దాం అని భాగమతి అనుకుంటూ ఉండగా ఇంతలో రాథోడ్ ఫోన్ చేస్తాడు.
హలో మిస్సమ్మ ఎక్కడున్నావు అని రాథోడ్ అంటాడు. అవుట్ హౌస్ లో ఉన్నాను సార్ లేకపోతే ఏంటి సార్ మీరు వదిలేసి వెళ్లాక ఇంట్లో ఉండక ఇంకెక్కడ ఉంటాను ఇప్పుడు తెలిసొచ్చిందా నేను రాకుండా అక్కడ ఏమి జరగదని నాకు తెలుసు సార్ మీరు నన్ను మళ్ళీ రమ్మని ఫోన్ చేస్తారని అయినా సరే నేను రాను సార్ మీరు అంతగా బతిలాడక్కర్లేదు నేను రానంటే రాను వదిలేసి వెళ్లారు కాబట్టి మీరు ఏమైనా అనుకోండి అని భాగమతి అంటుంది. హలో మిస్సమ్మ అంత లేదు గాని ఆపమ్మ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ పక్క వాళ్ళని మాట్లాడిన ఇస్తావా లేదా నీ అంతట నువ్వే ఏదేదో ఊహించుకోకు నేను చెప్పేది కాస్త వింటావా లేదా ఇంట్లో ఒక గ్రీన్ కలర్ సంచి మర్చిపోయాము అది తీసుకొని నువ్వు త్వరగా నది దగ్గరికి రా పంతులుగారు టైం లేదని అంటున్నారు నువ్వు త్వరగా రావాలి అని రాథోడ్ అంటాడు.
భాగమతి ఎక్కడ ఉందని గదులన్నీ వెతుకుతుంది ఆఖరికి ఒక గదిలో ఆ సంచి కనిపిస్తుంది గ్రీన్ కలర్ సంచి కనిపించింది సార్ అనిభాగమతి అంటుంది. అయితే వెంటనే తీసుకొని త్వరగా రా అని రాథోడ్ అంటాడు. కట్ చేస్తే నీళ్లు మనం రావద్దని వదిలేసి వచ్చిన దానికి ఫోన్ చేసి ఫోటో తీసుకురమ్మని అంటున్నారు దాని అదృష్టం ఏంటే ఇలా కలిచోస్తుంది అని మనోహరి అంటుంది. అంతే అమ్మ ఈ పది రోజులు కానించి మీరు ఎంత కష్టపడి అన్ని దగ్గర ఉండి చూసుకున్నారు కానీ ఏం లాభం ఫోటో మర్చిపోయారు దానివల్ల ఆ అమ్మాయికి అందరూ ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఏం చేస్తాం మీ దురదృష్టం ఇలా ఉంది అని నీలు అంటుంది. తొందరలో కావాల్సింది మాత్రం మర్చిపోయి వెళ్తారు ఏంటో ఈ మనుషులు అని భాగమతి ఆ సంచి తీసుకొని నాది దగ్గరికి వెళుతుంది అక్కడ అరుంధతిని చూసి సైలెంట్ గా మాట్లాడకుండా బాధపడుతూ వెళుతుంది.
ఏంటమ్మా ఇంత లేటు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు ఏటి అని రాథోడ్ ఆ సంచి తీసుకొని వెళ్ళిపోతాడు. బాబు పూజకు కావలసిన వస్తువులని సిద్ధమయ్యాయి మీరు వచ్చి కూర్చుంటే మొదలుపెడదాం అని పూజారి అంటాడు. భాగమతి అక్కడ నుంచి వెళ్లి దూరంగా కూర్చుంటుంది. మిస్టర్ గుప్తా గారు ఇప్పుడు ఏం చేద్దాం ఆ అమ్మాయి నన్ను చూసినట్టుంది అని అరుంధతి అంటుంది. మిస్టర్ గుప్తా గారు ఆ అమ్మాయి చూసే ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అరుంధతి అంటుంది. ఆవిడ చూసింది చిత్రాన్ని కాదు విచిత్రాన్ని ఆ బాలిక ముఖం చూస్తుంటే చూసినట్టే అనిపిస్తుంది నువ్వు ఆ మా దగ్గరికి వెళ్లి నువ్వు చూసింది ఇంకెవరికి చెప్పకు అని ఆ అమ్మాయితో చెప్పు అని గుప్తా అంటాడు.
అంతేనంటావా గుప్తా గారు ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పొచ్చు కదా ఈన్ని రోజులు మనిషిని అనుకోని మాట్లాడింది ఇప్పుడు ఆత్మ అంటే భయపడుతుందేమో అని భాగమతి అంటుంది. గుప్తా గారు తనకేం పట్టనట్టు నిలబడి చూస్తాడు.ఏంటో ఈయన అవసరమైనప్పుడల్ల బిగుసుకు పోతూ ఉంటాడు ఏమీ మాట్లాడడు అని భాగమతి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అందరూ ఏడుస్తూ ఉంటారు అమరేంద్ర అరుంధతిని తలుచుకొని ఏడుస్తాడు. ఏంటే నీళ్లు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే ఆ అమ్మాయి ఏంటి అక్కడ దూరంగా వెళ్లి కూర్చుంది అని మనోహరి అంటుంది.
తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా అని నీళ్ళు అంటుంది.నాకే కౌంటర్ల తెలిసిందే చెప్పు అని మనోహరి అంటుంది. అంటే అమ్మగారు తనను అందరూ గుర్తించాలని దూరంగా వెళ్లి కూర్చుందేమో అని నీళ్లు అంటుంది. తను దూరంగా వెళ్లి కూర్చుంటే ఎవరు గుర్తిస్తారు అని మనోహరి అంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఇంపార్టెంట్ ఇచ్చి అడగట్లేదా అలాగే తను కూడా అనుకొని ఉంటుంది అని నీళ్లు అంటుంది. అంతదాకా వస్తే దాన్ని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను కానీ దాని వెనకాల అందరూ తిరిగేలా చేయనివ్వను వేస్తా ఏదో ఒక ప్లాన్ వేసి దాని ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టేలా చేస్తా అని మనోహరీ అనుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!