Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి అరవింద పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పద్మావతి కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కృష్ణ ఎలాగైనా ఈ వ్రతం ఆపాలని, వెండి ప్రతి మా ఇంటికి రాకుండా చేయాలి అనుకుంటాడు.
ఈరోజు 409 వ ఎపిసోడ్ లో, పద్మావతి తో అరవింద పూజ కి టైం అవుతుంది ఇంకా మీ అమ్మగారు రాలేదు అని అంటుంది. పంతులుగారు కూడ పూజకు టైం అవుతుందమ్మా తొందరగా రండి అని అంటాడు అందరూ పార్వతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు వస్తుందా రాదా అని అంటుంది కుచల.
వెండి ప్రతిమ దొంగతనం..
అందరూ ఎదురు చూస్తూ ఉండగా పార్వతి వస్తుంది. పద్మావతి మా అమ్మ వచ్చింది పూజ మొదలు పెట్టొచ్చు ఇంకా అని అంటుంది. పార్వతి దగ్గరికి వెళ్లి ఏంటమ్మా ఇంత లేట్ చేసావు అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుందని పంతులుగారు చెప్తున్నారు. తొందరగా ఇటు ఇవ్వు అని చెప్పి తన చేతిలో ఉన్న సంచిని తీసుకొని, వెండి ప్రతిమ కోసం వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా కానీ అది దొరకదు. కుజులా పద్మావతి తో అసలే లేట్ అయిందంటే గంటలు గంటలు చూస్తావేంటి తొందరగా ఇవ్వు అని అంటుంది. పార్వతి ఏడుస్తూ ఉంటుంది. ఇందులో వెండి ప్రతిమ లేదేంటమ్మా అని అంటుంది పద్మావతి. ఇక నిజం దాచిపెట్టి ప్రయోజనం లేదనుకున్న పార్వతి ఏదైతే అది అయింది నిజం చెప్పేస్తాను అని వెండి ప్రతిమ నేను కొన్నాను నేను ఇంటికి వచ్చే దారిలో ఎవరో దొంగతనం చేశారు అని అంటుంది. దీంతో ఒకసారి అందరూ షాక్ అవుతారు కృష్ణ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దొంగతనం చేయించింది కృష్ణ కాబట్టి. పార్వతి కావాలనే తీసుకురాలేదు అని అనుకుంటారని, ముందు ఇంటికి వెళ్లకూడదు అనుకుంటుంది కానీవచ్చి నిజం చెప్పాలి అని అనుకొని నిజం చెప్తుంది.మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను నన్ను క్షమించండి అమ్మ అని అడుగుతుంది.
Nuvvu Nenu prema: తమ్ముడికి సహాయం చేసిన అండల్… అనుకున్నది సాధించిన కృష్ణ..
పార్వతిని అవమానించిన కుచల..
పార్వతి చెప్పింది అంతా విని క్షమించాలా మిమ్మల్ని అని అంటుంది కుచల. వావ్ వాట్ ఏ పర్ఫామెన్స్ అని అంటుంది.వెంటనే నారాయణ బాధల్లో ఉన్న వాళ్ళని దెప్పి పడవ మాకు అని అంటాడు కుచులతో, సన్మానాలు ఏమైనా చేయాలా ఇప్పుడు ఈవిడకి అని అంటుంది.మీకు ఎవరికి అర్థం కాదు ఏందంటే ఇదంతా ఒక పెద్ద డ్రామా అని అంటుంది కుచల. ఈవిడ కావాలనే వెండి ప్రతిమ తీసుకురాకుండా ఇలా మాట్లాడుతుంది. మన దగ్గర ఇలా ఏడిస్తేనే కదా మీరంతా ఈ నాటకాన్ని పడిపోయి నిజాన్ని అబద్ధం అని అనుకుంటారు. ఈమె ఎప్పుడైతే నాకు మాటిచ్చిందో 16 రోజులు పండగ రోజు తీసుకొస్తానని అప్పుడే అనుకున్నకచ్చితంగా ఈవిడ తీసుకురాలేదు అని ఇప్పుడు అదే నిజమైంది.ఇద్దరు కూతుర్లని గాని ఇంత పెద్ద ఇంటికి కోడలుగా పంపించినప్పుడు మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఒక పది వేలు పెట్టి అమ్మవారి ప్రతిమ కొనలేని బతుకులు వీళ్ళవి, కూతుల కోసం పది వేలు కూడా ఖర్చు పెట్టలేని బతుకులు వీళ్లు, వీళ్ళ మొహాలు చూస్తేనే దరిద్రం చుట్టుకుంటుంది. అంతంత మాటలు అనకండి వదినా అని అంటుంది పార్వతి. నేను నిజం చెప్తున్నాను ఒట్టేసి చెప్తున్నాను అని అంటుంది. వింటున్నాం కదా అని అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుండాలి అని అంటుంది కుచల. పద్మావతిప్రాణం పోయినా మేము అబద్ధాలు చెప్పేవాళ్లం కాదు మా అమ్మ నిజమే చెబుతుంది లేదంటే అట్నుంచి అటు వెళ్లిపోయేది కదా ఇక్కడికి వచ్చి నిజం చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలతో ఆడుకున్నట్టు ఎంతైనా మీ ఫ్యామిలీ అంతా ఒకటే కదా, మాటిస్తారు తప్పుతారు మీకేం కొత్త కాదు కదా ఇది అని అంటుంది కుచాల. మిమ్మల్ని మాయ చేయాల్సిన అవసరం మా అమ్మ వాళ్లకు లేదు, తల తాకట్టు పెట్టైనా అనుకున్న తీసుకొస్తారు. నేను ఇక్కడికి వచ్చిందే జరిగింది చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అని అంటుంది పార్వతి. అంతలో ఆర్య వచ్చి అత్తయ్య కావాలని ఎందుకు చేస్తుందమ్మా వాళ్ళిద్దరు కూతుర్ని వ్రతం చేసుకుంటే ఇలా ఎందుకు చేస్తుంది. తనకు ఆ ఉద్దేశం ఉంటే మాల ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేసి మా చేత అమ్మవారి ప్రతిమ కొనమని చెప్పి కన్వెన్స్ చేసేది కదా, ఆవిడ అలా చేయలేదంటేనే నీకు అర్థం కావట్లేదా అత్తయ్య చెప్పింది అబద్ధం అని నాకు అనిపించట్లేదు, అని అంటాడు విక్కీ.. విక్కీ చెప్పింది నిజమే అని ఇంట్లో అందరూపార్వతికి సపోర్ట్ చేస్తారు. కృష్ణ గొడవ పెద్దదయి వ్రతం చెడిపోతుంది అని అనుకుంటే గొఇంట్లో అందరూ కలిసి గొడవను ఆపేటట్టున్నారే అని మనసులో అనుకుంటాడు. కుచల వీళ్ళ గురించి మీకు ఇప్పుడు తెలియదు ఏదో ఒక రోజు తెలుస్తుంది అని అంటుంది.
Krishna Mukunda Murari: మురారి తన భర్త అని అందరికీ తెలిసేలా చేసిన ముకుంద.. సూపర్ ట్విస్ట్ రేపటికి..
అమ్మవారి బొమ్మను తయారుచేసిన అక్కాచెల్లెళ్ళు..
పద్మావతి మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని కుచల తో అంటుంది. నారాయణ ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిన దాని గురించి చూడండి అని అంటాడు. ఏంటి జరిగేది ఇంకా వ్రతం చేయడానికి వెండి ప్రతిమి లేనప్పుడు పూజ ఎలా చేస్తాము అని అంటుంది కుచల. ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. పద్మావతి వెంటనే నేను చేస్తాను అని అంటుంది. కుచల మీ అమ్మ చేసింది కదా ఒకసారి ఇప్పుడు నువ్వు అలానే చేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది. లేదు వెండి ప్రతిమ లేకపోయినా అమ్మవారి పూజ కోసం కావాల్సిన అమ్మవారి ప్రతిమని నేను తయారు చేస్తాను అని అంటుంది పద్మావతి. అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!
పూజ చేసినా అక్కా చెల్లెలు..
అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు..పంతులుగారు చాలా తొందరగా బాగా అమ్మవారి ప్రతిమని తయారు చేశారు అని అంటాడు.ఇక ఇంట్లో అందరూ పద్మావతి అనుల ని పొగడ్డం మొదలుపెడతారు.కృష్ణ ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే వీళ్ళు పూజ జరిపించేశారు అని అనుకుంటాడు మనసులో,పంతులుగారు కంకణం ఇచ్చి మీ భార్య చేతికి కట్టండి అని విక్కీతో చెప్తాడు.వికీ దిక్కులు చూస్తూ ఉంటాడు చూస్తావ్ ఏంటి పద్మావతి కట్టు అంటుంది అరవింద. మీరిద్దరూ కలకాలం కలిసి మెలిసివు సంతోషంగా ఉండాలి అంటే, ఈ కంకణం కట్టండి అని అంటుంది. నా కోరిక అదే విక్కీ మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఇలానే ఉండాలి అని అంటుంది అరవింద.అరవింద కోసం విక్కీ పద్మావతి చేతికి కంకణం కడతాడు.ఆర్య అను చేతికి కంకణం కడతాడు.పంతులుగారు ఇక పూజ చేయండి అమ్మ అని అంటాడు. పద్మావతి అను ఇద్దరూ పూజ పూర్తి చేస్తారు. ఇక పంతులుగారు పూజ పూర్తయింది మీ భర్తలు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు. పద్మావతి విక్కి దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. నా మనసు అర్థం చేసుకోలే నీతో నేను అప్పటికే కలిసి ఉండలేను అని మనసులో అనుకుంటాడు విక్కి. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆశీర్వాదం తీసుకోరా ఏంటి అని అంటుంది అరవింద.పద్మావతి విక్కీ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. విక్కీ ఆశీర్వదించకుండా అలానే నించుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో,కృష్ణ పద్మావతి విక్కి ల మధ్య గొడవ పెట్టాలి అనుకుంటాడు. పద్మావతి దేవుని దగ్గర శుభ్రం చేస్తూ ఉండగా విక్కీ ఒక ఫైల్ ని అక్కడ పెడతాడు ఆ ఫైల్ మీద పసుపు కుంకుమ కృష్ణవేసి ఏమి తెలియనట్టు ఫైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. విక్కీ వచ్చి పద్మావతి పసుపు కుంకుమ రాసింది ఫైల్ కి అనుకొని అరిచేస్తాడు. అందరి ముందు పద్మావతిని బాధ్యత అంటే ఏంటో నీకు ఎప్పటికీ తెలియదు అని అంటాడు.