Aishwarya Rajesh: కొంతమంది ముద్దుగుమ్మలు మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పలు అవార్డులు సైతం అందుకుంది ఐశ్వర్య రాజేష్. తండ్రి అలనాటి హీరో రాజేష్ కాగా తాత అమర్నాథ్ కూడా హీరో కం ప్రొడ్యూసరే. ఇక ఈ ముద్దుగుమ్మ మేనత్త స్టార్ నటి కూడా. అయినప్పటికీ కుటుంబాలలో జరిగిన విషాదల కారణంగా ఆర్థిక ఇబ్బందులలో టెన్త్ చదువుతున్న సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. ఎంతో ఇష్టంతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఆశించింది ఐశ్వర్య రాజేష్. అయితే పలువురు డైరెక్టర్లు ఐశ్వర్య రాజేష్ను నల్లగా ఉన్నావని.. నీ పర్సనాలిటీ హీరోయిన్ మెటీరియల్ కాదని కామెంట్స్ చేసేవారు.
ఇంకా హరాస్మెంట్లు మరియు అవమానాలు, రిజెక్షన్స్ ఎన్నో ఎదురయ్యాయి. అయినప్పటికీ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు ఐశ్వర్య రాజేష్. అన్ని ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది ఐశ్వర్య. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక మూవీ.. రాంబట్టు. ఈ సినిమా విడుదలయ్యి ఇప్పటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. 1990 జనవరి 10న చెన్నైలో పుట్టింది ఐశ్వర్య రాజేష్. తల్లిదండ్రులు అలనాటి హీరో రాజేష్ ,నాగమణి. ఇక వీరి తల్లిదండ్రుల పెళ్లిళ్లు వల్లనే వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. వీరిద్దరి పెళ్లి వారి కుటుంబంలో వారికి ఇష్టం లేకపోవడంతో వారి కుటుంబం అంతా చల్లా చెదురు అయిపోయారు. ఇక ఐశ్వర్య రాజేష్ కి ముగ్గురు అన్నయ్యలు సైతం ఉన్నారు.
తన తల్లిదండ్రులకి నాలుగవ సంతానంగా జన్మించింది ఐశ్వర్య రాజేష్. ఓసారి రాజేంద్రప్రసాద్ నటిస్తున్న రాంబంటు షూటింగ్, చెన్నైలో జరుగుతుంటే అక్కడికి ఐశ్వర్య రాజేష్ను తీసుకెళ్లారు రాజేష్. ఇక అక్కడే ఐశ్వర్యాన్ని చూసిన రాజేంద్రప్రసాద్ స్వయంగా ఓ పాటలో ఐశ్వర్యతో చేయించాలని నిర్ణయించుకున్నారు. అలా రాంబంటు సినిమాలో ఓ పాటలో నటించింది ఐశ్వర్య రాజేష్. ఇక అనంతరం ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం లాగా నిలిచింది. ఇక ఐశ్వర్య రాజేష్కు తమిళనాడు స్టేట్ లో బెస్ట్ యాక్టర్స్ గా కూడా అవార్డు వచ్చింది.
ఇక అనంతరం అనేక అవార్డులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఆరబోయడం మొదలుపెట్టింది. తాజాగా లావణ్య త్రిపాఠి ధరించిన కోర్ట్ లాగానే ఈమె కూడా బ్లూ కలర్ కోర్ట్ అండ్ ఫాంట్ ధరించి ఎద అందాలను చూపిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలోని చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!