ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ప్రస్తుతం ప్రకటించిన టికెట్ను కూడా మారుస్తున్నారని తెలుస్తోంది. రాత్రికి రాత్రి ఏం జరిగినా ఆశ్చ ర్యం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. అదేంటి ఉన్నట్టుండి.. అనుకుంటున్నారా? ఇక్కడే కీలక విషయం ఉంది. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో శింగనమల రాజకీయాలు యూటర్న్ తీసుకు న్నాయి. వైసీపీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్న రామాంజనేయులుపై బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ట్రక్కు డ్రైవర్కు టికెట్ ఇచ్చారని.. వేలిముద్రగాడని.. చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశం లో అన్నారో తెలియదు కానీ.. ఇవి టీడీపీకి సెగ పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రామాంజనేయులు ఎవరు? అంటే.. చంద్రబాబు, జగన్ల కంటే కూడా ఫేమస్ అయిపోయాడు. ఆయన ఫొటో తెలియక పోవ చ్చు. కానీ, చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత రామాంజనేయులు పేరు మాత్రం అందరికీ తెలిసింది. ఇక, శింగనమల రాజకీయం కూడా యూటర్న్ తీసుకుంది.
అసలే సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ.. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బండారు శ్రావణి శ్రీకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఈ కేటాయింపుపై తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నా రు. అయినప్పటికీ.. చంద్రబాబు మొండిగానే ముందుకు సాగుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎం.ఎస్ రాజు వర్గం శ్రావణికి ఏమాత్రం సహకరించడం లేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలునియోజకవర్గంలోటీడీపీ గ్రాఫ్ను తగ్గించాయి. ఇక, కాంగ్రెస్ తరఫున బలమైన నాయకుడి గా సాకే శైలజానాథ్ పోటీకి దిగుతున్నారు.
దీంతో టీడీపీ ముప్పేట చిక్కులు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీశారు. అయితే..అందరినీ కాదు.. గతంలో పార్టీ తరఫున గెలిచి.. తర్వాత వైసీపీలోకి వెళ్లిన యామినీ బాలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమెను పార్టీలోకి తీసుకోవడం తోపాటు.. శింగనమల టికెట్ను కూడా ఆమెకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తద్వారా.. స్థానికంగా పట్టుకున్న శమంతకమణి వర్గం.. టీడీపీకిఅనుకూలంగా మారడంతోపాటు.. ఎం.ఎస్. రాజు వర్గంకూడా సానుకూలంగా మారుతుందనే లెక్కలు వేస్తున్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాల.. ఈ రోజో రేపో.. టీడీపీలోకి రానున్నారు తర్వాత.. నాలుగు రోజుల్లోనే టికెట్ మార్పుపై చంద్రబాబు ప్రకటన చేయనున్నట్టు తెలిసింది.