Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం ముగిసింది. ఈ ఎపిసోడ్ లో టైటిల్ విన్నర్ గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నీ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా టైటిల్ ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ 15 లక్షల విలువ చేసే కారు.. 15 లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకోవడం జరిగింది. వీటితోపాటు ప్రశాంత్ రెమ్యూనరేషన్ లక్షలలో ఉండనుంది. ఓవరాల్ గా కోటి రూపాయల సొత్తును… ప్రశాంత్ దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీజన్ సెవెన్ ట్రోఫీ అందుకున్న ప్రశాంత్… తనకి వచ్చిన ప్రైజ్ మనీ 35 లక్షల రూపాయలు.. రైతులకే ఖర్చు పెడతానని స్పష్టం చేశారు.
అదేవిధంగా తనని గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. బిగ్ బాస్ లో ఆడాలని ఎన్నో రోజులుగా… అనుకున్న… అన్నం తినకుండా అన్నపూర్ణ స్టూడియో ముందు.. తిరిగిన రోజులు ఉన్నాయి. రైతుల కోసమే వచ్చి ఆడాను గెలిచాను. కారును నాన్నకు నెక్లెస్ అమ్మకు ఇస్తా జై జవాన్ జై కిసాన్ అని ప్రశాంత్ తెలియజేయడం జరిగింది. సీజన్ సెవెన్ లో మొదటి నుండి అత్యధికమైన ఓటింగ్ రాబడుతున్న కంటెస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ నిలవడం జరిగింది. సుమారు 105 రోజులపాటు జరిగిన ఈ షోలో.. ప్రశాంత్ చాలా కష్టపడి గేమ్ ఆడటం జరిగింది. ఈ క్రమంలో చాలాసార్లు సెలబ్రిటీ ఇంక బుల్లితెర కంటెస్టెంట్స్.. టార్గెట్ చేసిన గాని ఎక్కడ తగ్గలేదు. శివాజీ .. ఒక విధంగా ప్రశాంత్ కి కవచంగా ఉన్నాడు.
ప్రశాంత్ గెలవడంలో శివాజీ పాత్ర మరువలేదని చెప్పవచ్చు. ఫిజికల్ టాస్కులలో.. నామినేషన్ సమయంలో ప్రశాంత్.. కరెక్ట్ పాయింట్ లేవనెత్తుతూ గేమ్ ఆడాడు. ఎక్కడా కూడా నోరు జారకుండా చాలా కంట్రోల్ గేమ్ ఆడటం జరిగింది. బయట.. ప్రశాంత్ కి పెళ్లయిందని కోట్లు ఆస్తులు ఉన్నాయని కొన్ని పీఆర్ టీమ్స్ నెగటివ్ ప్రచారం చేసిన.. అవేమి తన విజయాన్ని ఆపలేకపోయాయి. ఓటింగ్ లో రైతుబిడ్డ తిరుగులేని ఓట్లు కొల్లగొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో అమర్ మూడో స్థానంలో శివాజీ నాలుగో స్థానంలో యావర్ ఉన్నాడు.