Big Breaking: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్ లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తొంది. దావూద్ ఇబ్రహీంకు విఫప్రయోగం జరగడం వల్ల అసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తను పాకిస్థాన్ మీడియా కూడా ప్రసారం చేస్తొంది. భారీ భద్రత నడు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ అధికారికంగా దృవీకరించలేదు. అక్కడి మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం దావూద్ ఇబ్రహం చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తొంది.
ముంబాయి పేలుళ్లలో సూత్రధాని అయిన భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్ లో తలదాచుకున్నాడు. 1993 లో ముంబాయిలో జరిగిన బాంబు దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలతో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లలో ఒకరిగా దావూద్ ఉన్నారు. అంతే కాకుండా 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో పది మంది పాకిస్థానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబాయిలో ఉన్న తన నెట్ వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్య్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ చెబుతూ వస్తొంది. దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు ఆలీషా పార్కర్, సాజిద్ వాగ్లే నుండి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముంబాయి పోలీసులు. దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలోఉంటున్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి తెలియజేశాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో దావూద్ నిందితుడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్ల రివార్డును గతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. నిషేదిత ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.
Pawan Kalyan Chandrababu: పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు .. ఆ కీలక అంశాలపై చర్చ ..?