Puri Jagannadh: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఈయన.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. వైష్ణో అకాడమీ అనే పేరుతో ప్రొడెక్షన్ హౌస్ను స్థాపించిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత ఇదే సంస్థను పూరీ కనెక్ట్స్ గా మార్చి తన బ్యానర్లోనే సినిమాలను చేస్తున్నారు.
ఈ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని ప్రముఖ హీరోయిన్ ఛార్మి చూసుకుంటూ వస్తోంది. పూరి తెరకెక్కిస్తున్న ప్రతి సినిమాకి ఛార్మినే ప్రొడక్షన్ వర్క్ ను చూసుకుంటోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ ఛార్మీని పక్కన పెట్టబోతున్నారట. అందుకు కారణం ఆయన కూతురు పవిత్రనే అని అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చిన్నప్పుడే `బుజ్జిగాడు` సినిమాలో నటించింది పవిత్ర.. హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, పవిత్ర అన్న ఆకాశ్ పూరీ.. తన చెల్లెలుకు నటన కంటే నిర్మాణం అంటే ఎంతో ఇష్టమని.. ప్రొడక్షన్లోకి వస్తుంది అంటూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇక కూతురికి సినీ పరిశ్రమలోకి దింపాలని పూరీ నిశ్చయించుకున్నారట.
ఇందులో భాగంగా ఛార్మీని తప్పించి త్వరలోనే పూరి కనెక్ట్స్ బాధ్యతలని పవిత్రకి అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే లేడీ ప్రొడ్యూసర్గా పవిత్ర ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!