Satyabhama Serial January 17 2024 Episode 23: సత్య పెళ్లి కుదిరినందుకు కుటుంబ సభ్యులందరూ సంతోషంలో గుడికి వెళ్లాలనుకుంటారు. సత్తి ని ఓపెన్ చెయ్ గుడికి తీసుకు వెళుతుంది సత్య నాయనమ్మ. గుళ్లో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సత్య జాగ్రత్తగా ఉండడం కాదు తప్పు చేస్తే కచ్చితంగా ఎదిరిస్తాను అని అంటుంది. అదే గుడికి కాళీ కూడా వస్తాడు. కాళీ సత్య ని ఇబ్బంది పెట్టాలని గుడికి వస్తాడు. కాళీ ఫ్రెండ్, అన్నా నువ్వు అనుకున్నది సతీ నీ కృషిని విడదీయడం కదా మరి సత్తి దగ్గరికి ఎందుకు ఇప్పుడు మనం అని అంటాడు సత్య అందం అహంకారం రెండు ఉన్న మనిషి అందుకే దాన్ని మనం దూరం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా క్రిష్ గాడు సతిని ప్రేమించడం మానేస్తాడు అని ఒక ప్లాన్ ప్రకారం గుడికి వస్తాడు కాళీ.
ఇక క్రిష్ సత్య వాళ్ళందరూ గుడికి వెళ్లడం చూసి ఇంట్లో విశ్వనాథం ఒక్కడే ఉన్నాడని గమనించి, అతని దగ్గర మంచి మార్కులు సంపాదించడానికి నీట్ గా రెడీ అయ్యి, సాఫ్ట్ గా మాట్లాడుతూ విశ్వనాథం దగ్గరికి ఎంట్రీ ఇస్తాడు. విశ్వనాథన్ క్రిష్ ని చూసి ఎవరు బాబు మీరు అని అడుగుతాడు. నన్ను గుర్తు పట్టలేదా మీకు హెల్ప్ చేశాను కదా రోడ్డుమీద అని గతం గుర్తు చేస్తాడు క్రిష్ ఆ బాబు గుర్తుపట్టాను మీరే కదా ఆరోజు నాకు హెల్ప్ చేశారు అని అంటాడు విశ్వనాథం రండి బాబు లోపలికి అని అడుగుతాడు పక్కనే ఉన్న బాబిని చూసి ఎవరి ఈ అబ్బాయిని అడిగితే నా తమ్ముడు అని చెప్తాడు క్రిష్. బాబి తో క్రిష్ మామగారింటికి మొదటిసారి అడుగు పెట్టబోతున్నాను కుడికాలతో వెళ్లాలా అని అడుగుతాడు కాళ్ళు విరగట్టించుకోకుండా ముందు బయట పడాలన్న మనం అని అంటాడు. అరే బాబీ నా సంగతి నీకు తెలియదురా చూడ్డానికి నేను మాస్ కానీ లోపల అంతా క్లాస్, మా మామగారి దగ్గర ఎలా నటిస్తానో చూడు అని అంటాడు. బాబీ ముందు కుడికాలు పెట్టాలి కదా అని ఇంట్లోకి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తాడు క్రిష్. లోపలికి వెళ్తూనే సత్యం తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్న అత్తారింటికి వచ్చిన కొత్త కోడలు కూడా నీలా ఫీల్ అవ్వదు అని అంటాడు బాబి.
ఫీలింగ్ గురించి నీకేం తెలుస్తుంది రా లోపలికి పదా అని అంటాడు.విశ్వనాథం అక్కడే నించున్నావేంటి బాబు లోపలికి రా అని అంటాడు. అమ్మ తోడు ఒట్టేసి చెప్తున్నాను సారు మీ ఇల్లు అంటేనే ఇల్లు అని ఇల్లంతా చూస్తూ సత్య ఫోటో చూసి ఆగిపోతాడు. మీ ఇల్లు ఒక దేవతను గుడి లెక్కన ఉంది దేవత ఏంటి బాబు అని అంటే, అది సారు మీరు చదువు చెప్తారు కదా సరస్వతి దేవి మీ ఇంట్లో కొలువైంది అని అంటున్నాను అంటాడు. మీరు కూర్చుండు బాబు నేను ఇంటికి తీసుకు వస్తాను అని విశ్వనాథం లోపలికి వెళ్తాడు. క్రిష్ సత్తి గదిలోనికి వెళ్లి సత్య ఫోటోని చూస్తూ ఉంటాడు. విశ్వనాథం టీ పెట్టుకుని బయటికి వచ్చేటయానికి బాబి వెళ్లి బలవంతంగా కృష్ణ సత్య గదిలో నుంచి బయటికి తీసుకు వస్తాడు. విశ్వనాథం మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు. వెంటనే క్రిష్ విశ్వనాథం కాళ్ళ మీద పడి,నాకు జాబ్ వచ్చింది మీకు చెబుదామని వచ్చాను.అని అంటే, నిన్ను చూస్తే ముచ్చట వస్తుంది బాబు అని అంటాడు విశ్వనాధమ్, ఇలాంటి మంచివాడు మీకు అల్లుడైతే బాగుంటుంది కదా సారు అని అంటారు బాబి. వెంటనే క్రిష్ అరే ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు సార్ అని అంటాడు బాబి మీరు మాటవరసకన్నా నువ్వు చెప్పింది నిజమే బాబు ఇంత మంచివాడు అల్లుడైతే ఏ ఆడపిల్ల తండ్రి అయినా సంతోషిస్తాడు అని అంటాడు విశ్వనాథం. క్రిష్ చాలా సంతోషిస్తాడు. బాబీ మాట్లాడే తింగరి మాట్లాడుతూ విశ్వనాథం కి అక్కడ డౌట్ వస్తుందో అని క్రిష్ భయపడతాడు బాబీ ని అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు.
ఇక గుడిలో భైరవి తన కోడలు చేత మొక్కు తీర్చిస్తూ ఉంటుంది. సత్యవాళి గుడిలోకి వెళ్తూ ఉంటే, భైరవి కోడలు నీళ్లు తీసుకొని ఎదురవుతుంది. నీళ్లు తీసుకురావడానికి ఇబ్బంది పడుతుంటే తొందరగా తీసుకురమ్మని భైరవి అరుస్తుంది. ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ ఉండడానికి సత్య గమనిస్తుంది. భైరవి తన కోడలితో ఇంత కొట్టుకుంటూ చేస్తే నువ్వు 108 బిందు రేపటికి పూర్తి చేస్తావు తొందరగా కానీ అరుస్తూ ఉంటుంది ఆ మాటలు అన్ని సత్య కూడా వింటూ ఉంటుంది. ఊరికే నేను పొయ్యమన్నానని నీళ్లు పోయడం కాదు మనసారా మొక్కు అని అంటుంది. సత్య అంతా గమనిస్తూ ఇబ్బందిపడటం చూసి బాధపడుతూ ఉంటుంది.భైరవి తన కోడలతో మాట్లాడే మాటలని,విని ఆశ్చర్య పోతుంది.చిన్న బిందెనే మొయ్య లేకపోతే నువ్వు కడుపులో బిడ్డను ఎలా మోస్తావు మా వంశాన్ని వారసుని ఎలా ఇస్తావు అని అరుస్తూ ఉంటుంది.కళ్ళు తిరుగుతూ ఉంది అత్తమ్మ ప్రాణం పోయేటట్టుంది మిగిలిన బిందెలు మళ్ళీ ఎప్పుడైనా మోస్తాలే అని అంటుంది. తోలు తీస్తే ఇంకొకసారి అలా మాట్లాడావంటే ఇదేమన్నా ఇనిస్టాల్మెంట్ బిజినెస్ అనుకున్నావా ఈ పూట సగం పోసి రేపు సగం పోయడానికి అని అంటుంది భైరవి. మంతనాలు చేయకుండా ముందు బిందువులు నీళ్లు తీసుకొని అమ్మవారికి అభిషేకం చేయకు అని అరుస్తుంది. బలవంతంగా వెళ్లి నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. నీళ్లు తీసుకుని వస్తూ వస్తూ భైరవి కోడలు కింద పడబోతుంది. వెంటనే భైరవి, అపచారం జరిగిపోయింది క్షమించు తల్లి, అని దేవుడికి దండం పెట్టుకుంటుంటే భైరవి కోడలితో, తప్పు చేసింది కాక ఇంకా క్షమించమని అడుగుతున్నావా అని చేయి చేసుకోబోతుంది అక్కడే ఉన్న సత్య వచ్చి అడ్డుపడుతుంది. మధ్యలో నువ్వెవరు నీకేం పని నువ్వు ఎందుకు నడిమిట్ల వస్తున్నావ్? చెయ్యి విడిచిపెట్టు అని అంటుంది భైరవి. సత్య చెయ్యి విదిలించి పక్కకు వేస్తుంది. ఎందుకు ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. అది నా కోడలు నేనేదైనా చేస్తాను.
కోడలు అంటే మీ బానిస అని అంటుంది సత్య. పెళ్లి ఐదేళ్లయింది ఇంతవరకు దానికి కడుపులో కాయ కాయలేదు. గప్పుడు కోడలు మీద అరగకుండా ముద్దు పెట్టుకోమంటావా అని అంటుంది భైరవి సత్యతో, 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేసి మొక్కుకోవే పిల్లలు పుడతారని మంచిగా సంజయించి తీసుకొస్తే మొండికేస్తుంది అని అంటుంది భైరవి. మొండికేయడం కాదు తన వల్ల కావడం లేదని ఏడుస్తుంది. అడుగు ముందుకు వేయలేక బాధపడుతుంది మీకు కనిపించట్లేదా అని అంటుంది సత్య. నువ్వు గుళ్లో ఉద్ధరించడానికి వచ్చావా, దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చావా అని అంటుంది భైరవి. నీకు ఇంకా పెళ్లయినట్టు లేదు రేపు పెళ్లయితే నాలాంటి అత్త వస్తే నువ్వు ఏం చేస్తావ్ అని అంటుంది భైరవి. తప్పు చేస్తే నేను ఎవరినైనా ఊరుకోను తనకి శక్తి లేనప్పుడు ఈ ముక్కులు ఏంటి ఏ దేవుడు ఏ దేవత మనల్ని మనం హింసించుకొని మొక్కు తీర్చుకోమని అడగలేదు. బిడ్డలు పుట్టకపోతే కోడలు కోడలు కాకుండా పోతుందా మరి అది ఇవ్వరా, అని అంటుంది సత్య. అంతలో అక్కడికి వచ్చిన రేణుక సత్యని చూసి ఏంటి మా అమ్మతో మాట్లాడుతున్నావ్ అని అంటుంది. ధరణి పోయేదానివి నెత్తి దించుకొని పోకుండా ఎందుకే మా ఫ్యామిలీ మెంబర్లు తలదురుస్తున్నావ్ అని అంటుంది భైరవి కూతురు. నీ ప్రాణం నీకు అనవసరం అనుకుంటే ఎట్లనే రెచ్చిపో అని అంటుంది. నువ్వు నోరు మూసుకొని వెళ్లకపోతే నా మరి అది ఏంటో చూపిస్తాను అని అంటుంది. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని అంటుంది సత్య. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే, సత్యనారాయణమ్మ చూసి వచ్చి నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ పదా అని అంటుంది. భైరవి దగ్గర నుంచి సత్యం తీసుకొని వెళ్ళిపోతుంది. సవా లక్ష సార్లు చెప్పాను అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దని, అవన్నీ నీకు అవసరం లేదు, అని అంటుంది. మనకి తగులుతున్న ఎదురు దెబ్బలు సరిపోవునమ్మా అన్ని విషయాలు దొరకవు ఎందుకు అని సత్య నాయనమ్మ అరుస్తుంది.పూజకు టైం అయింది తొందరగా ప్రదక్షిణ చేసి రండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా కాళీ గమనిస్తూ ఉంటాడు సత్య ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు.
రేపటి ఎపిసోడ్ లో క్రిష్ సత్య వాళ్ళు ఉండే గుడి దగ్గరికి వస్తాడు ఆ గుడిలో ఖాళీని చూస్తాడు కాళీ క్రిష్ తో ఈ గుడిలో అమ్మవారి కుంకుమ ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళు నుదుటిని పెడితే వాళ్ళతో సగం పెళ్లయిపోయినట్టే అన్న అని చెప్తాడు. మరి నా సంపంగి, కి నా మనసులో మాట ఎట్లా తెలుస్తుంది అని అంటాడు. మనం పొట్లం కట్టి పేపర్ మీద ఏం రాస్తామంటే నేను నీకు నచ్చితే ఈ బొట్టు పెట్టుకొని రాసిద్ధం, అని కాళీ, క్రిష్ కి ఐడియా ఇస్తాడు. ఒక చిన్న పాప వెళ్లి సత్య దగ్గర దేవుడి కుంకుమ పెట్టుకుంటే మంచిది అక్క తీసుకొని ఒక పొట్లన్నీ ఇస్తుంది. సత్య ఎవరిచ్చారు నీకు అని అడిగితే, క్రిష్ వైపు చూపిస్తుంది ఆ పాప సత్య ఆ పొట్లం ని తీసుకుంటుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!