Pallavi Prashanth Sivaji: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రైతు బిడ్డగా యూట్యూబ్ లో గుర్తింపు పొంది బిగ్ బాస్ షో సీజన్ సెవెన్ లో అడుగుపెట్టి అద్భుతమైన గేమ్ ఆడటం జరిగింది. హౌస్ లో అన్ని రకాలుగా అందర్నీ అలరిస్తూ ప్రశాంత్ టైటిల్ గెలవడం జరిగింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత బిగ్ బాస్ షో బయట జరిగిన గొడవల కారణంగా ప్రశాంత్ పై కేసు నమోదు కావటం తెలిసిందే. దీంతో నాలుగు రోజులపాటు చంచల్ గూడా జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో విడుదల కావడం జరిగింది. కాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలవడంలో శివాజీదీ అతి పెద్ద పాత్ర అని చెప్పవచ్చు.
కామన్ మ్యాన్ గెలవాలి… నువ్వు గెలిస్తే చాలామందికి ఆదర్శమవుతావు.. గేమ్ నువ్వు ఆడుకో నేను వెనకాల చూసుకుంటా అని షోలో శివాజీ చాలావరకు ప్రశాంత్ టైటిల్ గెలవడంలో చక్రం తిప్పారు. ఈ క్రమంలో ప్రశాంత్ నీ టార్గెట్ చేసుకుని సీరియల్ బ్యాచ్ అనేక ప్లాన్స్ వేసిన వాటన్నిటిని.. శివాజీ తనదైన ప్లానింగ్ తో ఫెయిల్ అయ్యేలా చేశారు. టైటిల్ గెలిచాక ప్రశాంత్ కూడా శివాజీ అన్న వలనే తాను విన్నర్ అయినట్లు అనేక ఇంటర్వ్యూలో చెబుతున్నారు. దీంతో టైటిల్ గెలిచిన ప్రశాంత్ కంటే శివాజీకి బయట మంచి పాజిటివ్ ఇంప్రెషన్ రావటం జరిగింది. నటుడిగా అదొక పాపులారిటీ అయితే ఈ బిగ్ బాస్ షోతో… శివాజీ మీద చాలామందికి గౌరవం అమాంతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి శివాజీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని యూట్యూబ్ ఛానల్ కి 1,3 మిలియన్ ల మంది సబ్ స్క్రైబర్స్, ఇంస్టాగ్రామ్ లో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వీటివల్ల డబ్బులు వస్తాయి అనే విషయం కూడా ప్రశాంత్ కి తెలియదు. మొన్నటివరకు అతడు మానిటైజేషన్ చేసుకోలేదు. అది కూడా అతనికి తెలియదు…అంత అమాయకుడు. మా ఇంటికి ప్రశాంత్ వచ్చిన సమయంలో…నేను మానిటైజేషన్ చేయటం జరిగింది. అసలు బయట ప్రపంచం గురించి ప్రశాంత్ కి అంతగా ఏమీ తెలియదు. అప్పుడు అనిపించింది నిజంగా నేనొక సామాన్యుడిని గెలిపించాను అని.. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ప్రశాంత్ మాత్రమే కాదు యావర్…కూడా చాలా సెన్సిటివ్ ఎమోషనల్ అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!