టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శ్రీవిష్ణు ఆసుపత్రిపాలయ్యారు. గత కొద్ది రోజుల నుండీ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఇంటి నుంచే చికిత్స తీసుకున్నారు. అయితే బ్లడ్ ప్లేట్ లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో.. శ్రీవిష్ణు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దాంతో ఆయన్ను ఈరోజు ఉదయం హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. ఈ విషయం బయటకు రావడంతో.. శ్రీవిష్ణు ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాక్షిస్తున్నారు.
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు.. బ్రోచేవారెవరురా తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయాడు. ఈయన నుంచి చివరిగా వచ్చిన గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, భళా తందనానా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
అయినప్పటికీ శ్రీవిష్ణు వెనక్కి తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన `అల్లూరి` అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తో ప్రదీప్ వర్మ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు కెరీర్లోనే తొలిసారి పోలీస్ ఆఫీసర్గా చేస్తున్న చిత్రమిది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!