టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తే.. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా పండగ కానుకగా అక్టోబర్ 5న అట్టహాసంగా విడుదల కాబోతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాకు అన్ని చోట్ల అద్భుతంగా బిజినెస్ జరుగుతోంది. పోటీగా చిరంజీవి `గాడ్ ఫాదర్` ఉన్నాసరే నాగార్జున అన్ని చోట్ల ఆదరగొట్టేస్తున్నాడు.
ముఖ్యంగా ఆంధ్రాలో `ది ఘోస్ట్` మూవీకి భారీ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. రూ. 9 కోట్ల రేంజ్ లో ఈ మూవీ థియేటర్ హక్కులు అమ్మడుపోయాయని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఫైనల్గా ఈ చిత్రం టోటల్ బిజినెస్ ఏ రేంజ్లో ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.