తెలుగు సినిమా రంగంలో తిరుగులేని క్రేజీ హీరోయిన్ గా పూజా హెగ్డే చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ అమ్మడు నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. దీంతో చాలామంది నిర్మాతలకు మరియు దర్శకులకు లక్కీ హీరోయిన్ గా ఉంది. సమంత ఇంకా కాజల్, అనుష్క తరం తర్వాత… పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుని విజయాలు సాధించింది. తెలుగులో తెలుగు లేని క్రేజ్ దక్కించుకున్న పూజ హెగ్డే… ఈ ఏడాది ప్రారంభంలో రెండు భారీ ఫ్లాపులు పడ్డాయి. “రాధేశ్యం”, “ఆచార్య”.. వంటి రెండు సినిమాలతో దారుణమైన పరాజయాలు పూజ హెగ్డే మూట కట్టుకుంది.
ఇటువంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒప్పుకున్న సినిమాల విషయంలో.. పూజా హెగ్డే లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం దృష్టి అంత బాలీవుడ్ పైన పెట్టి తెలుగులో సినిమా ఆఫర్లు వస్తున్నా కానీ పూజ హెగ్డే చేయడానికి గతంలో మాదిరిగా ముందుకు రావడం లేదని వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ తరహాలోనే కాజల్ అగర్వాల్ మరి కొంతమంది హీరోయిన్ లు.. లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ పై దృష్టి పెట్టి .. టాలీవుడ్ ని చిన్నచూపు చూడడం జరిగింది.
అయితే ఇక్కడ నుండి వెళ్లిన సదరు హీరోయిన్ లు.. బాలీవుడ్ లో మొదటిలో అవకాశాలు వచ్చిన తర్వాత పరాజయం పాలై మళ్లీ తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చారు. అదేగతి రానున్న రోజుల్లో పూజా హెగ్డే కి పడటం గ్యారెంటీ అని కొంతమంది అంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకి ఇంకా పవన్ అదేవిధంగా హరీష్ శంకర్ సినిమాకి చేయడానికి ప్రారంభంలో ఓకే చెప్పినా గాని తాజాగా మాత్రం కండిషన్స్ పెడుతున్నట్లు.. టాక్ వస్తుంది. ఇదే సమయంలో బాలీవుడ్ పైన పూజ ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఇప్పటికే సల్మాన్ సినిమా ఒకటి.. చేయటానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.