Trinayani April 8 2024 Episode 982: గాయత్రీ పాపకి గాయత్రి దేవి చీర కట్టుకుని తీసుకువస్తుంది విశాలాక్షి. ఆ పాపని చీరలో చూసి అందరూ షాక్ అయిపోతారు. చీర భలేగా కట్టావే అని హాసిని అంటుంది. మీ అమ్మ ఏది రాజా పిలువు చూస్తానన్నది కదా అని హాసిని అంటుంది. ఇంకెక్కడి మమ్మీ మాత ఇందాక వచ్చిన గాలివానకు చీర కప్పుకొని పడుకొని ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు. విశాల్ గాయత్రి పాపని చీరలో చూసి దగ్గరికి వెళ్లి అమ్మ లక్ష్మీపురం వెళ్లే రోజు ఇలాగే చీర కట్టుకొని వెళ్లావు మళ్లీ తిరిగి రాలేదు ఇప్పుడు నిన్ను ఈ చీరలో చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా చనిపోయిన నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తి నా బిడ్డగా పుట్టి నా దగ్గరే పెరుగుతావని నైని చెబితే ఏమో అనుకున్నాను కానీ ఈ చీరలో నిన్ను చూస్తుంటే నన్ను కన్న తల్లిని బిడ్డగా ఎత్తుకొని మురిసిపోతున్నాను అనిపిస్తుంది అని విశాల్ బాధపడతాడు. ఏంటి పెద్ద బావ గారు విశాల్ బావగారు అంతగా ఫీల్ అయిపోతున్నారు గాయత్రి పాప గాయత్రి అత్తయ్య అయినట్టు అని సుమన అంటుంది.
ఏమో గాయత్రి పాపే గాయత్రి పెద్దమ్మేమో అని వల్లభ అంటాడు. విశాల్ బాబు ఎమోషనల్ లో గాయత్రి అక్క అని చెప్పేస్తాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు పావనమూర్తి.బాబు గారు ఎందుకు అంతబాధపడుతున్నారు అని నైని అంటుంది. ఏమీ లేదు నైని ఈ చీర కట్టుకోగానే మా అమ్మ గుర్తుకు వచ్చింది అని విశాల్ అంటాడు. ఈ గాయత్రి పాప చీర కట్టుకోగానే గాయత్రి అమ్మ గారి తేజస్సు వచ్చేసింది అని నైని అంటుంది. అలా అయితే నేను కూడా చీర కట్టుకుంటాను నాకు కూడా ఆస్తంతా రాసిస్తారా అని సుమన అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ చిట్టి పాప గాయత్రీ దేవి అయింది కదా అని హాసిని అంటుంది. చివరిలో దేవి తగిలించుకుంటే గాయత్రి అత్తయ్య అయిపోతుందా అని సుమన అంటుంది. మనకేం తెలుసు చిన్న మరదలా నిజంగానే గాయత్రి పాపే గాయత్రి పెద్దమ్మేమో అని అనుమానం వస్తుంది అని వల్లభ అంటాడు.
మీకు అలాంటి డౌట్లు ఏమి అక్కర్లేదు తనే గాయత్రి అని విశాలాక్షి అంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని నైని అడుగుతుంది. లలితా దేవి గారు గాయత్రీ దేవిని నామకరణం చేసింది ఇప్పుడు గాయత్రి చీర కట్టుకొని తనలాగే తేజస్సుతో ఉంది అలాంటప్పుడు ఈ పాప గాయత్రీ అని ఎందుకు అనుకోకూడదు అని విశాలాక్షి అంటుంది. అది కరెక్టే కానీ గాయత్రి అమ్మ గారి త్వరగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని నైని అంటుంది. ఈ చీరలో గాయత్రీ పాప అచ్చం గాయత్రి పెద్దమ్మలాగే ఉంది అన్నయ్య అని విక్రాంత్ అంటాడు. అరే మళ్లీ అదే మాట అంటారు గాయత్రీ పాప చీర కట్టుకున్నంత మాత్రాన గాయత్రీ దేవి అయిపోతుంద అని సుమన అంటుంది. ఏంటి నీకు ప్రూఫ్ కావాలా అని హాసిని అడుగుతుంది. వదిన ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా ఏమి అక్కర్లేదు అని విశాల్ అంటాడు. వీళ్లకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా విశాల్ లేదంటే ఇలాగే నోరు పారేసుకుంటారు అని హాసిని అంటుంది.
అంటే ఏంటి అక్క మీరు చెప్పేది గాయత్రి అత్తయ్య చీర కట్టుకున్నంత మాత్రాన గాయత్రి పాపా గాయత్రి అత్త ఎలా అవుతుంది అందుకు మేము ఒప్పుకోము అని సుమన అంటుంది. చెల్లి దీని మీద ఇప్పుడు ఇంత పెద్ద గొడవ ఎందుకు గాయత్రి పాపను చీరలో చూడాలనుకున్నారు చూశారు అని నైని అంటుంది. గాయత్రి పాప గులాబీ రంగు చీర కట్టుకుంటే తన గుండెలు అదిరిపోతాయి కాబట్టి అందుకే ఇక్కడ నుంచి పారిపోయింది అని విశాలాక్షి అంటుంది. మా మమ్మీ ఏమి భయపడిపోలేదు అని వల్లభ అంటాడు . మా అమ్మకి ఎదురుగా వస్తే చచ్చిపోతుంది పుత్ర అని ఎద్దులయ్య అంటాడు. అంటే గాయత్రి పాప మా అమ్మని చంపేస్తుందా అని వల్లభ అంటాడు. గాయత్రి అమ్మగారు తిరిగి వచ్చాకే అది జరుగుతుంది బావగారు మీరే మీ భయపడకండి అని నైని అంటుంది. ఆవిడ వస్తే వీళ్ళు నిజంగానే చస్తారులే చెల్లి అని హాసిని అంటుంది.
ఈ చీరకి అంత పవర్ ఉందా అని వల్లభ ముట్టుకుంటాడు వెంటనే షాక్ కొట్టి కింద పడిపోతాడు. ఏంటి రాజా దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా అని హాసిని అంటుంది. గాయత్రి అమ్మగారు పేరే కాదు తను కట్టుకున్న చీరను కూడా టచ్ చేయలేరు అని అంటుంది.కట్ చేస్తే,విశాలాక్షి ఉగాది పండుగ గురించి చెప్తూ ఉంటుంది. ఏంటి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని సుమన అడుగుతుంది. ఏమి లేదు మాత విశాలాక్షి పండగ గురించి చెప్తుంటే వింటున్నాం అని ఎద్దులయ్య అంటాడు. అది మా అక్క చెప్తే బాగుంటుంది కానీ ఈ చిన్న పిల్ల విశాలాక్షికేం తెలుసు అని సుమన అంటుంది. చెల్లి నాకన్నా విశాలాక్షి చాలా బాగా చెబుతుంది అని నైని అంటుంది. పూజలు పునస్కారాలు చేసే నీ కన్నా గొప్పగా ఆ పిల్ల ఎలా చెబుతుంది అక్క మీరు మరీ విడ్డూరం చేసి ఆ పిల్లని నెత్తికెక్కించుకుంటున్నారు అని సుమన అంటుంది. తను శివ భక్తురాలు అందరికంటే చాలా తెలుసు అని విశాల్ అంటాడు .
అవునా ఈ పిల్ల ఇంకా పెద్ద మనిషి కూడా అయిందో లేదో కానీ తనకు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయి అని వల్లభా పక పక నవ్వుతాడు. ఎక్కువగా నవ్వకు పళ్ళు రాలిపోతాయి అని హాసిని అంటుంది. పుత్ర ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావ్ అని ఎద్దులయ్య అంటాడు. బావగారు అన్నదాంట్లో తప్పేముంది అని సుమన అంటుంది. ఇంతలో వల్లభ ఒక్క నిమిషం అంటూ బాత్రూంలోకి వెళ్తాడు. అలా పదిసార్లు వెళ్లి వచ్చి నీరసపడిపోతాడు. ఏమైంది బావగారు ఎందుకలా డీలా పడిపోయారు అని నైని అడుగుతుంది. చేసిన తప్పు అనుభవించాలి కదా అని విశాలాక్షి అంటుంది. బావగారు ఇప్పటిదాకా బాగానే ఉన్నారే మీకు ఏం జరిగింది అని మన అంటుంది.నాకు రక్తంతో మోషన్స్ అవుతున్నాయి అని వల్లభ అంటాడు. అదేంటి అల్లుడు రక్తంతో మోసినవ్వడం ఏంటి అని పావను మూర్తి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!