Trinayani november 06 episode 1077: నేను మా ఆవిడ వెనకాల వెళ్తాను మావయ్య అని వల్లభ అంటాడు.మా ఆయనకి తొందర ఎక్కువ లే బాబు అయినా విక్కీ సుమన వెంట వెళ్తాడు కదా నువ్వు ఎందుకు తొందరపడి నోరు జారతావు అని దురంధర అంటుంది. మనం అందరం వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని సుమన అంటుంది. ఇంతలో గాయత్రి నడుచుకుంటూ వచ్చి పెట్ట దగ్గర నిలబడుతుంది.వదిన గాయత్రీ చూడు అక్కడ నిలబడింది అది కింద పడితే కాళ్ళ మీద పడుతుంది వెళ్లి తియ్యి అని విక్రాంత్ అంటాడు. నైని గాయత్రీ దగ్గరికి వెళ్లి గాయత్రీ ని ఎత్తుకొని ఆ పెట్టిన ఓపెన్ చేసి చూస్తే దాంట్లో తమలపాకు కనబడుతుంది ఇది కూడా మన వెంట తీసుకు వెళ్తే బాగుంటుందేమో బాబు గారు అని నైని అంటుంది. అలాగే నైనీ తీసుకురా మనకేమైనా అవసరం పడుతుందేమో అని విశాల్ అంటాడు. అది సరే మీరు బయలుదేరండి లేట్ అవుతుంది అని తిలోత్తమ అంటుంది. ఏంటి సుమన ఇదే అవతారంతో వస్తావా నగలు తీసుకురా అని వల్లభ అంటాడు.
ఎందుకు బావగారు బాగానే ఉందిగా ఈ చీర ఇలాగే వస్తాను అని సుమన అంటుంది. చెల్లి అదేమన్నా మీ పుట్టిల్లు అనుకుంటున్నావా అడివి అక్కడ మనుషులు ఎవరూ తిరగరు కాబట్టి దొంగలు ఎక్కువగా ఉంటారు నీ నగలతో పాటు నిన్ను కూడా వన్ ప్లస్ ఆఫర్ గా తీసుకువెళ్తారు అని హాసిని అంటుంది. అవును సుమన నువ్వు వెళ్లి అవన్నీ తీసేసి రా అదంతా అడవి నిజంగానే దొంగలు నీ మీద పడి నగలు దోచుకుంటారు అని విశాల్ అంటాడు. తానాను కూడా తీసుకెళ్తే దరిద్రం పోతుంది అని విక్రాంత్ అంటాడు. రేయ్ నగలు తీసి ఇంట్లో పెట్టేస్తే సరిపోతుంది కదా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు అని విశాల్ అంటాడు. సరే నేను నగలు తీసి చీర కూడా మార్చుకొని వస్తాను అని సుమన అంటుంది.అందరం వెళ్తున్నాము మీరు రావట్లేదా అమ్మ అని విశాల్ అంటాడు. దూరంగా వెళ్లేటప్పుడు నేను నా పిల్లలు కలిసి ప్రయాణం చేయొద్దనేదే మా ఆలోచన ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే మాలో ఒకరమైన మిగులుతాము కదా అన్నదే మా ఆశ అదే నిజం కూడా నేను రాను మీరు వెళ్ళండి అని తిలోత్తమ అంటుంది. బేష్ మంచి ఆలోచన అని డమఅక్క అంటుంది. చెల్లి మనం కూడా చీరలు మార్చుకొని వద్దాము పద అని హాసిని అంటుంది.
ముగ్గురిని మేము ముగ్గురము చూసుకుంటాము మీరు వెళ్లి రండి అని పావన మూర్తి అంటాడు.వాళ్లను అటు ఇటు వెళ్లకుండా నేను చూసుకుంటాను కదా అని డమఅక్క అంటుంది. కట్ చేస్తే, అందరూ నాగులపురం వెళ్తారు. అందరూ చూస్తూ ఉండండి ఇక్కడ దొంగలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అని విశాల్ అంటాడు. వచ్చి మా ఆయనను ఎత్తుకుపోరులే అని హాసిని అంటుంది. ఆ అంటూ వల్లభా నవ్వుతాడు. వదిన జోక్ ఏసిందని కూడా బ్రోకు అర్థం కావట్లేదు అని విక్రాంత్ అంటాడు. రేయ్ అదే అర్థం కాదు ఇంకా దాని మాటలేం అర్థం అవుతాయి మీరు కిందికి చూస్తూ నడవండి రా నామీద జోకులు ఆపేసి అని వల్లభ అంటాడు. రేయ్ విక్రాంత్ అలా అనకురా అన్నా పెద్దోడు కదరా బాధపడతాడు అని విశాల్ విక్రాంత్ కి చెప్తాడు. ఇంతలో వాళ్ళు నడుస్తూ ఉండగా ఎవరో తన వెనకాల వస్తున్నట్టు విశాల్ కి అనుమానం వచ్చి వెనకకు తిరిగి చూస్తాడు. ఏంటి బాబు గారు అలా నిలబడిపోయారు ఏమైంది అని నైని అంటుంది.
మన వెనకాల ఎవరో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అని విశాల్ అంటాడు. అమ్మవారి దర్శనానికి అందరూ వచ్చి వెళుతూ ఉంటారు కదా బాబు గారు కంగారు పడకండి అని నైని అంటుంది. ఇంతలో అఖండ స్వామి వల్లభకు వినిపించేలా ఒక సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ విని వల్లభ అఖండ స్వామి వచ్చాడు అనుకుంటా ఆయన్ని కలవడం ఎలా అని అటు ఇటు చూస్తాడు. ఏంటి అన్నయ్య కంగారుపడుతూ చూస్తున్నావు రా అని విశాల్ అంటాడు.ఏమీ లేదురా కొద్దిసేపు ప్రకృతిని పలకరించి వస్తాను మీరు వెళ్ళండి అని వల్లభ అంటాడు. ప్రకృతిని పలకరించే లోపు మిమ్మల్ని వేరే వాళ్ళు పలకరిస్తారు అని హాసిని అంటుంది. వదిన అన్నయ్య ఒకటికి వెళ్తానంటున్నాడు అని విక్రంత్ అంటాడు. అన్నయ్య నువ్వు వెళ్లిరా మేము ఇక్కడే ఉంటాము అని విశాల్ అంటాడు. పర్వాలేదు మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అని వల్లభ అంటాడు. అన్నయ్య భయపడవు కదా అని విశాల్ అంటాడు. మీరు రాకపోతే మేమందరము వెళ్ళిపోతాము నీకు దారి తెలియదు కదా అని హాసిని అంటుంది. మీరు వదిలేసి సిటీకి వెళ్తే నేను మాత్రం ఉంటానా ఏంటి అడుక్కుంటూ వస్తాను అని వల్లభ అంటాడు. మీరు అడుక్కుంటూ వచ్చే లోపు మేము మిమ్మల్ని ఎక్కడ ఉన్నాడని అడుక్కుంటూ వెతుక్కుంటూ రావాలి అని హాసిని అంటుంది. సరే అన్నయ్య మేము వెళ్తున్నాము త్వరగా వచ్చేయ్ అని విశాల్ అంటాడు.
కట్ చేస్తే, వల్లభ వాలకు కనిపించకుండా వెనకకు వెళ్లి అఖండ స్వామి ఎక్కడ ఉన్నారు కనిపించట్లేదు అని అంటాడు. ఇక్కడ ఉన్నాను వల్లభ అని అఖండ స్వామి అంటాడు.ఇదేంటి స్వామి మీకు కూడా తెలుసా మేము అక్కడికి వస్తున్నామని మీరు వచ్చారు ఏంటి అని వల్లభ అఖండ స్వామిని అడుగుతాడు. మీ అమ్మ చెప్పి నన్ను పంపించిందిగాయత్రీ దేవి బ్రతికున్నప్పుడు నెలకు ఒకసారైనా ఈ గుడికి వచ్చేది తను ఆఖరి సారి వచ్చినప్పుడు ఏదో తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టింది వెళ్లేటప్పుడు మాత్రం వట్టి చేతులతో పోయింది అది తీసుకెళ్దామని నైని ఇక్కడికి వచ్చింది అదేంటో నాకు కూడా తెలియదు అని అఖండ స్వామి అంటాడు. అమ్మ స్వామి ప్రసాదం కోసం వెళ్దామని మాతో చెప్పింది మరదలు మనసులో ఇంత పెద్ద కోరిక ఉందా అని వల్లభ అంటాడు. కట్ చేస్తే, అందరూ అలా ముందుకు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒకచోట అఘోర కనిపించగానే ఆగిపోతారు. ఏంటి చెల్లి ఈతను ఈలా ఉన్నాడు అని హాసిని అంటుంది.మీరు ఏమి మాట్లాడకండి అక్క అతను ఏమీ చేయడు అఘోర అని నైని అంటుంది. అఘోరా సుమన దగ్గరికి వచ్చి ఉలోచిని ముక్కుతో వాసన చూసి తన పేరేంటి అని సుమనను అడుగుతాడు. ఉలోచి అని సుమన సమాధానం చెబుతుంది.
కాలా ఉలోచి వచ్చింది అని అఘోర గట్టిగా అరుస్తాడు. ఎవరికి పిలిచి చెప్తున్నారు అని సుమన అంటుంది. ఉలొచ్చి పుట్టింటికి వచ్చింది చెప్పాల్సిన వాళ్లకు చెప్తున్నాను నువ్వు అనుకున్నది తీసుకెళ్లలేవు మామూలు కనులతో చూడకు మనోనేత్రమైన మూడో కన్నుతో చూడు అవగతం అవుతుంది అని అఘోర స్వామి నైని అంటాడు. నీ మనసులో ఏ కోరిక ఉంది చెప్పు అని విశాల్ నైనిని అడుగుతాడు. ఇంతలో వల్లభ వచ్చి ఎవరితను అని అంటాడు. నేను ఎవరైతే నీకేంటి నీకు కావాల్సింది నీకు దక్కదు అని అఘోర స్వామి వల్లభను చూస్తూ అంటాడు. నేను ఒక పెట్ట కోసం వచ్చాను బాబు గారు అని నైని అంటుంది. అదేంటి అక్క పెట్టే వెతకడం కోసం ఉలోచిని తీసుకురావాలా అని సుమన అంటుంది. వెళ్లండి వచ్చిన కార్యం సఫలమయ్యేలా చేయండి అని అఘోర అంటాడు. అందరూ నాగదేవత గుడి దగ్గరికి వెళ్తారు. నైని గుడి దగ్గర దీపం పెట్టండి అగరవత్తులు పూలు పెట్టండి అని విశాల్ అంటాడు. తమ్ముడు అమ్మవారిని చూస్తే భయం వేస్తుంది రా ఇలా ఉందేంటి అని వల్లభ అంటాడు. అయ్యబాబోయ్ ఒక్క నన్ను చూస్తేనేనా మీరు భయపడరు అందర్నీ చూస్తే భయపడతారు అని హాసిని అంటుంది. వదిన మనం తర్వాత మాట్లాడుకుందాం గుడి కాడ పూజ చేయండి అని విశాల్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది