Chatrapathi Sekhar: ఛత్రపతి శేఖర్ ను తెలుగు సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రాల్లో శేఖర్ ప్రధానంగా కనిపిస్తుంటాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ సమయంలో శేఖర్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి శేఖర్ ను రాజమౌళి వదిలిపెట్టలేదు. నటుడిగా సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో రాజమౌళి తన సినిమాల్లో ఇప్పటికీ శేఖర్ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.
స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో కెరీర్ ప్రారంభించిన శేఖర్.. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. అప్పటినుంచి శేఖర్ కాస్త ఛత్రపతి శేఖర్ గా ప్రసిద్ధి చెందాడు. వందలాది చిత్రాల్లో సహాయక నటుడిగా పని చేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. శేఖర్ భార్య కూడా ఇండస్ట్రీకి చెందిన వారే.
ఆమె మరెవరో కాదు నీలియా భవాని. తెలుగు, తమిళ భాషల్లో ఈమె ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తెలుగులో పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్మెన్.. లాంటి చాలా చిత్రాల్లో ఆమె నటించింది. తమిళంలోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో వర్క్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్, అడపా తడపా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.
అయితే శేఖర్ నటుడిగా ఎదగక ముందే నీలియా భవానితో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వీరి వివాహానికి నీలియా భవాని ఇంట్లో అంగీకరించలేదు. దాంతో పెద్దలను ఎదురించి మరీ హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పూజిత , మహేశ్వరన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. శేఖర్ కూడా నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. కానీ పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేకపోయారు. పిల్లలు పుట్టిన కొంత కాలకే శేఖర్, నీలియా భవాని మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఎవరి దారి వారు చూసుకున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!