టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2011లో ‘నువ్విలా’ అనే మూవీతో సినీ కెరియర్ ను ప్రారంభించిన విజయ్ దేవరకొండకు.. `పెళ్లి చూపులు` సినిమాతో గుర్తింపు దక్కింది. 2017లో విడుదలైన `అర్జున్ రెడ్డి` తో ఓవర్ నైట్ స్టార్ గా మారి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
ఆ వెంటనే `గీత గోవిందం` తో ప్రేక్షకులకు మరింత చేరువైన విజయ్ దేవరకొండకు గత కొంతకాలం నుంచి బ్యాడ్ టైం బాగా నడుస్తోంది. ఈయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ `లైగర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ ఇది.
ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25 న విడుదలైన ఈ చిత్రం.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` , పూరి జగన్నాథ్ తో `జనగణమన` అనే ప్రాజెక్టులను చేస్తున్నాడు. అయితే వరస ఫ్లాపుల నేపథ్యంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నాడట.
ఇకపై తనతోపాటు తన తండ్రి గోవర్ధనరావుకు కూడా కథ నచ్చాలని, అలా నచ్చాకే ఏదైనా సినిమాకు సైన్ చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు దర్శకత్వంలో పట్టుంది. పలు టీవీ సీరియల్స్కు ఆయన దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి కథ విన్నాకే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విజయ్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
https://newsorbit.com/cinema/vijay-devarakonda-movie-with-another-star-director.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!