మనలో చాలామంది ఎంత తిన్నా కొంచెం సమయానికి మళ్ళీ ఆకలి వేస్తోంది అని అంటుంటారు. రోజుకి 2, 3 సార్లు ఆహారం తీసుకోవడమే కాక చిరుతిళ్ళు, జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఇలా తినడం వలన బరువు పెరగడం, అతి ఆకలితో బాధపడే సమస్య వస్తుంది.
18-35 మధ్య వయసు ఉన్న మహిళలు, పురుషులపై యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిశోధనలు నిర్వహించింది. ఆహార సమస్యను ఆహారంతోనే పరిష్కరించవచ్చని చెబుతోంది. ఈ అధ్యయనం ద్వారా కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల అతి ఆకలి సమస్యను సులువుగా అధిగమించవచ్చని చెప్పారు. వారం రోజుల పాటు వాల్ నట్స్, సాల్మన్, కనోలా ఆయిల్ తో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో తినాలి అనిపించే కోరిక తగ్గుతుంది అని తమ పరిశోధనల్లో వెల్లడయింది. ఎవరైతే ఈ ఆహారం తీసుకున్నారో వారిలో సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, ఆకలి వేయడం తగ్గినట్టు గుర్తించారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవరైతే బరువు పెరుగుతారో వాళ్ళల్లో తాత్కాలికంగా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి బరువు పెరిగితే తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల ముందు నుంచే బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా ఎక్కువసార్లు కొంచెం కొంచెం గా తీసుకో తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే జంక్ ఫుడ్ కాకుండా సాంప్రదాయబద్ధమైన కార్బోహైడ్రేట్లు కలిగిన పిండి పదార్థాలు తీసుకోవాలని చెప్పారు.