Don’t Drink Water: సాధారణంగా మనం ఏదైనా తిన్న తర్వాత మంచి నీళ్ళు తాగటం అలవాటు.. ఇప్పుడు ఈ అలవాటే మన కొంప ముంచుతుందని గ్రహించండి.. కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత అస్సలు మంచి నీళ్ళు తాగకూడదట..! పొరపాటున తాగితే ఏం జరుగుతుందో చూడండి..!
అందరూ ఇష్టపడి తినే వాటిలో ఐస్ క్రీమ్ ఒకటి.. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా తాగటం వలన చిగుళ్ళు బలహీనపడి దంతాలు పాడయ్యే అవకాశం ఉంది. అందువలన ఇక నుంచి ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీళ్లు తాగకండి. వేడివేడిగా కాఫీ, టీ తాగాక కొంత మంది ఒక గ్లాసు నీటినీ తాగుతారు. ఇది మీ జీర్ణ వ్యవస్థ పనితీరు పై ప్రభావం చూపుతుంది. ఇక నుంచి వేడి పానీయాలు, చల్లటి తిన్న తర్వాత పొరపాటున కూడా మంచి నీళ్ళు తాగకండి. అలాగే వేరుశనగలు, నువ్వులు తిన్న తర్వాత కూడా తాగకూడదు. చెరుకు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. ఇది పొట్టలో ప్రతి చర్య జరిపి అసిడిటీ కి కలిగిస్తుంది.
Read More: Red Ponnaganti: పావలా ఖర్చు చేయని ఈ ఆకుకూర తింటే ఎన్ని ప్రయోజనాలో చూడండి..!!
స్వీట్స్, తీపి పదార్థాలు తిన్న వెంటనే నీళ్లు తాగకపోతే అందులో ఉండే చక్కెర దంతాలలో ఉండిపోయి క్యావిటీస్ ఏర్పడతాయి అనుకుంటారు. ఇలా స్వీట్స్ తిన్న వెంటనే నీటిని తాగితే టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. మనలో చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు భోజనం చేసేటప్పుడు, చేసిన తరువాత నీటిని తాగుతారు. ఇలా తాగటం వలన మనం తీసుకునే ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. భోజనం చేసిన అరగంట తరువాత మంచినీళ్ళు తాగండి. అలాగే పండ్లు తిన్న తర్వాత కూడా తాగకూడదు. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. ఇలా తాగటం వలన డయేరియా వస్తుంది.