మహిళలు గోరింటాకు ఎర్రగా పండాలని కోరుకుంటారు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని చాలామంది నమ్మకం అయితే గోరింటాకు ఎర్రగా అందంగా పండాలి అంటే ఈ చిట్కాలను పాటించి చుడండి.గోరింటాకు ఎర్రగా పండాలంటే నూరేటప్పుడు రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. గట్టిగా రుబ్బిన తర్వాత గంటపాటు అలానే ఉంచి, ఆ పైన పెట్టుకుంటే చేతులు చక్కగా పండుతాయి.
గోరింటాకు (మెహందీని) తొలగించిన తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవద్దు.ఇలా చేయడం ద్వారా మీ గోరింటాకు రంగు లైట్ గా కనిపిస్తుంది. ఈ కారణంగామెహందీ ఎర్రగా పండదు కాబట్టి, గోరింటాకును సబ్బు నీటితో కడగకూడదు.గోరింటాకు బాగా ఎండిన తర్వాత రెండు చేతులను రుద్దుతూ గోరింటాకు తీయండి.ఇలా చేయడం వలన మెహందీ ఎర్రగా అందంగా ఎక్కువ కాలం ఉంటుంది.ఆలా తీసిన తర్వాత ఆరు గంటలు చేతులకు నీళ్లు తగలకుండా చూసుకోండి.వీలైతే, మెహందీని పెట్టుకున్న 12 గంటల తర్వాత స్నానం చేయండి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత చేతిని కదపకుండా ఉంచాలి. చేతులు కదుపుతూ ఏదైనా పని చేస్తే గోరింటాకు కదిలిపోయి పొరలుగా ఊడి వచ్చేస్తుంది. ఈకారణం గా గోరింటాకు సరిగా పండకపోవడం తో పాటు పెట్టుకున్న డిజైన్ కూడా పాడవుతుంది. చాల మంది గోరింటాకు పెట్టుకున్న తర్వాత చక్కెర మరియు నిమ్మకాయ మిశ్రమాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఆలా చేయవద్దు. దానివల్ల మంచి రంగుని పొందలేరు. ఏదైనా అవసరం అయి మీ చేతులు మరియు కాళ్లకు ఉన్న మెహందీని త్వరగా ఆరబెట్టవలిసి వచ్చినాకూడా బ్లో డ్రైయర్ ను ఉపయోగించవద్దు. గోరింటాకు పెట్టుకునే ముందు ఎక్కువ నీరు లేదా రసం త్రాగ వద్దు. గోరింటాకు తీసేసిన తర్వాత ఆవనూనె లేదా వాసెలిన్ రాసుకోవడం వల్ల గోరింటాకు రంగు ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే గోరింటాకు ఇష్టపడే ప్రతీ అమ్మాయి కీ ఈ మ్యాటర్ ఫార్వర్డ్ చేయండి