Baby: శిశువు జన్మించిన మొదటి నెల నుంచి ఒక సంవత్సరం నిండే వరకు వారి ఆహారం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలిసి ఉంటుంది. ఇప్పటినుండి మనం వారికీ ఇచ్చే ఆహారం వారి ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఉంటుంది. తల్లి పాలను మించిన ఆహారం ,ఔషదం పోషణ మరెందులోను ఉండదు అన్నది నిజం. బిడ్డ వయసు ప్రకారం తల్లి పాలతో పాటు ఇతర ఆహరం ఇస్తే వారిలో పోషకాహార లోపాలు తలెత్తవు. అప్పుడే జన్మించిన శిశువు కు మూడు నెలలు పూర్తిగా నిండే వరకు కేవలం తల్లి పాలను మాత్రమే ఇవ్వాలి.
కనీసం మంచి నీళ్లు కూడా ఈ మూడు నెలల లోపు పట్టకూడదు. శిశువు కు కావలసిన పోషకాలు తల్లి పాల తో అందుతాయి. తల్లి పాలు కాకుండా ఇతర ద్రవాలు ఇస్తే పిల్లలకు అజీర్తి చేసి ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటివి తలెత్తుతాయి. ఇంకొంతమంది పిల్లలకు మూడు నెలలు నిండ గానే ఘనాహారం ఇవ్వడానికి ఆశక్తి చూపుతారు. అలాంటప్పుడు మీరు సెరిలాక్ వంటి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు బిడ్డకు జీర్ణించుకొనే సామర్థ్యం ఉంటేనే ఒక చెంచాడు సెరిలాక్ పెట్టడం తో మొదలుపెట్టి నెమ్మదిగా దాని పరిమాణం పెంచాలి.తల్లులు ఐదు మాసాల ముందే ఘనాహారం ఇస్తుండడం వలన పిల్లలు అస్తమానం నిద్రలోనించి మేల్కోవడం తగ్గి హాయిగా నిద్ర పోతున్నారని ఒక అధ్యయనం తెలిపింది. తల్లి పాలు పట్టడం తో పాటు ఘనాహారం ఇవ్వడం వలన పిల్లలకు కావలిసిన శక్తి, పోటాషియం తగినంత అందటం వలన పిల్లలు హాయిగా నిద్రపోవడానికి కారణమవుతుంది.
ఇక కేవలం తల్లి పాలు మాత్రమే తాగే పిల్లలకు వారి శరీరానికి అవసరమైన పోషకాలన్నీ పాల ద్వారా లభించకపోవడం పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారని అధ్యయనం లో తేలింది. కానీ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలిసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆహారంలో అరవయి శాతం తల్లి పాలు మిగతా నలబై శాతం చాలా తేలికపాటి ఆహారం ఉండేలా చూసుకోవాలి.