గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ఇందులో ఉండే పోషక విలువలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.. అంతేకాకుండా మన అందాన్ని ఇనుముడింప చేస్తాయి.. ఆరోగ్యానికి మంచిదని గుమ్మడి గింజలు అదే పనిగా తినేస్తే కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో ఒకసారి చూద్దాం..
రక్తపోటు తక్కువగా ఉన్న వాళ్ళు గుమ్మడి గింజలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ విత్తనాలు తింటే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అదే బీపి తక్కువగా ఉన్న వాళ్ళు తింటే మాత్రం రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. గుమ్మడి గింజలు తినటానికి రుచిగా ఉంటాయి. అలా అని అదే పనిగా తింటే మాత్రం గొంతు దెబ్బతినే ప్రమాదం ఉంది. గొంతు నొప్పి, గొంతులో గరగర సమస్యలు వస్తాయి.. త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గుమ్మడి గింజలలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. కానీ వీటిని మితంగానే తినాలి. మోతాదుకు మించి తీసుకుంటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి కూడా వస్తుంది. గుమ్మడి గింజలను ఎక్కువగా తినడం వలన త్వరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో క్యాలరీస్, కొవ్వులు, పుష్కలంగా ఉంటాయి . రోజుకు రెండు స్పూన్ల కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం బరువు పెరగడం ఖాయం. ఈ గింజలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఫైబర్ ఎక్కువ అయితే కడుపులో సమస్యలు మొదలవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలతో పాటు మలబద్ధకం కూడా రావచ్చు. అందుకని రోజు రెండు స్పూన్స్ కంటే ఎక్కువగా గుమ్మడి గింజలని తీసుకోకండి..