మనిషి సగటు జీవన కాలం అనేది ప్రస్తుత రోజుల్లో సగానికి పడిపోయింది అనే చెప్పాలి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. ఒకప్పుడు ప్రజలు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా దాదాపు తొంబై ఏళ్ల పాటు జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలా కాదు ఎప్పుడు, ఏ వయసులో ఏ రోగం వస్తుందో అని బయపడాలిసిన పరిస్థితి వచ్చింది. నిజానికి మనం తీసుకునే ఆహారంలో పోషకాహారలోపం వలన మనకు లేని పోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
విటమిన్ టాబ్లెట్స్ ఆరోగ్యానికి మంచివేనా?
అయితే చాలా మంది ప్రజలు అనారోగ్యం అని అనిపించిన వెంటనే విటమిన్ సప్లిమెంట్లును మందుల రూపంలో తీసుకుని విటమిన్ లోపాలను తగ్గించుకోవాలని అనుకుంటారు.నిజానికి అలా విటమిన్ టాబ్లెట్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఒక్కోసారి పోషకాహారలోపం వలన అనారోగ్యసమస్యలతో పాటు అకాలమరణం కూడా సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదు.విటమిన్ లోపం అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే తప్ప వేరే ఏ ఇతర విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటేనే పోషకాహర లోపం తగ్గదు. అందుకే ప్రతిరోజు సమతుల్యాహారం తింటూ, ఎటువంటి అనారోగ్యాలు కూడా లేకుండా జీవించాలిఎప్పటికప్పుడు సమతులాహారం తీసుకుంటూ,ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబిస్తూ ఉండడం చాలా ముఖ్యం.
సమతుల్య ఆహారం తినడం :
ఇవి రెండు పాటించకుండా విటమిన్ల లోపం అని తెలియగానే మల్టీ విటమిన్లను వాడడం మంచిది కాదు. ఈ విటమిన్లు వాడడం వలన ఆరోగ్యం మాట ఎలా ఉన్నాగాని రాబోయే రోజుల్లో అనారోగ్యాలు వస్తాయి.అయితే కొందరికి వైద్యులు విటమిన్ టాబ్లెట్స్ వాడమని సలహా ఇస్తూ ఉంటారు. అలాంటి వారు పూర్తిగా విటమిన్ సప్లిమెంట్స్ పైన మాత్రమే ఆధారపడకుండా సమతుల్య ఆహారం తీసుకుంటూ టాబ్లెట్స్ మీద ఆధారపడకుండా ఉండాలి