గోధుమలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.గోధుమలతో పాటుగా గోధుమ గడ్డి కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తుంది.మన శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఈ గోధుమ గడ్డితో తయారుచేసిన జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది.శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు మాత్రమే గోధుమ గడ్డి జ్యూస్ ను త్రాగాలి.
రక్తహీనత తగ్గుతుంది :
ఈ జ్యూస్ తాగడం వలన రక్తం పడడంతో పాటు మరొక ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. అది ఏంటంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ గోధుమ గడ్డి జ్యూస్ తో కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్ మాయం :
గోధుమ గడ్డి జ్యూస్ నుక్రమం తప్పకుండా ఒక 15 రోజులు తాగితే శరీరానికి సరిపడా రక్తం అందుతుంది. అంతేకాకుండా 30% వరకు శరీరంలోని ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే ఈ జ్యూస్ ని కనుక రెండు నెలలపాటు తాగితే శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది.గోధుమ గడ్డి జ్యూస్ తాగితే శరీరంలో రక్తం పెరుగుతూనే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
షుగర్, బీపి కంట్రోల్ :
అంతేకాకుండా గోధుమ గడ్డి వలన కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా బీపీ కూడా తగ్గుతుంది. అలాగే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.ఈ గోధుమ గడ్డి అనేది మార్కెట్లో దొరుకుతుంది. కనుక ఇలాంటి గోధుమ గడ్డిని మీరు కూడా ఇంటికి తెచ్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ప్రతిరోజు 100 నుంచి 150 మిల్లీ లీటర్ల జ్యూస్ ను తాగితే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది.గోధుమ గడ్డి జ్యూస్ను తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రం అయ్యి వ్యాధులు రాకుండా ఉంటాయి.