Video Viral: అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోతుండటంతో ఆ దేశం నుండి వెళ్లిపోవడానికి పౌరులు పెద్ద సంఖ్యలో కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అప్ఘనిస్థాన్ శరణార్ధులకు ఆశ్రయమిస్తామని అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో అయా దేశాలకు వెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. విమానాశ్రయం వద్దకు చేరుకున్న ఆప్ఘన్ పౌరులను చెదరగొట్టేందకు తాలిబన్లు కాల్పులు జరపడంతో ఎయిర్ పోర్టు వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడగా, ఏడుగురు మృతి చెందారు. అక్కడ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందినట్లు బ్రిటన్ రక్షణ శాఖ ప్రకటించింది. కాబుల్ ఎయిర్ పోరటులో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్లే పౌరులు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని బ్రిటన్ తెలిపింది.
అప్ఘనిస్థాన్ లో 2001 నుండి ఉన్న అమెరికా బలగాలు వెళ్లిపోవడంతో అప్ఘనిస్థాన్ ను తాలిబన్లు సునాయాసంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. షరియా ప్రకారం పాలన ఉంటుందని ప్రకటించారు. స్వేచ్చ కల్పిస్తామని తాలిబన్లు నమ్మబలుకుతూనే తమ నిజస్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టారు. మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీలులేదంటూ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దాడులకు కూడా పాల్పడుతున్నారు. తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక పౌరులు పెద్ద సంఖ్యలో దేశం విడిచిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. కాగా తాలిబన్ల చెర నుండి అప్ఘన్ కు విముక్తి కల్పించాలంటూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి.
RT @HevalOli1: RT @kurdistannews24: video:
Several Killed at #Kabul airport As #Taliban terrorists Open Fire on civilians who are Desperately Rush to Flee #Afghanistan.
#Germany ,#Switzerland & UK postpone the evacuation due Security Concern.#أفغانست… pic.twitter.com/MOjOVpHQ0i— LIST4AIRDROP (@LIST4AIRDROP) August 22, 2021