Swati Maliwal: దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఖాళీ అవ్వనున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్ధులను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నామినేట్ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ తమ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేట్ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సునీల్ కుమార్ గుప్తా, నారాయణ్ దాస్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుండగా, వీరి ఆరేళ్ల పదవీ కాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. దీంతో వీటికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సుశీల్ కుమార్ గుప్తా ఈ ఏడాది చివర్లో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించడంతో ఆ స్థానం నుండి స్వాతి మాలివాల్ ను పార్టీ ఎంపిక చేసింది.
సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా ను వరుసగా రెండో సారి నామినేట్ చేస్తున్నట్లు ఆప్ తెలిపింది. అయితే సంజయ్ సింగ్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నారు. తాను రెండో సారి రాజ్యసభకు వెళ్లేందుకు వీలుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీనామినేషన్ పత్రాలప సంతకం చేసేందుకు తనకు అనుమతి ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు గానూ ఈ నెల 2వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9వ తేదీలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి.
Breaking: భారతి సిమెంట్స్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ