CM: సీఎం కుర్చీలో నుంచి ఓ నేత మారి మరో నేత ఎక్కడం అంటేనే ఓ సంచలనం. అలాంటిది నాలుగు నెలల్లో ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కడం అంటే చిత్రమే కదా?!. ఈ చిత్రం ఉత్తరాఖండ్ లో జరిగింది. ముఖ్యమంత్రి పీఠాన్ని నాలుగు నెలల గ్యాప్లోనే మూడో నేత చేపట్టనున్నారు. ఆ రాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నాయకుడు పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. ఈ మేరకు శనివారం జరిగిన మీటింగ్లో బీజేపీ శాసనాసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
Read More: BJP: తగ్గేది లేదంటున్న బీజేపీ..ఇరు రాష్ట్రాల సీఎంలపై …
ఆయనకే చాన్స్…
అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు డెహ్రాడూన్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. సీఎం రేసులో సత్పాల్ మహారాజ్, ధన్సింగ్ రావత్ల పేర్లు వినిపించినప్పటికీ అనుభవం రీత్యా పుష్కర్ ధామి వైపే అధిష్టానం మొగ్గుచూపిందని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర పదో సీఎంగా పుష్కర్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read More: Corona: కరోనా వ్యాక్సిన్.. ఓ గుడ్ న్యూస్.. ఇంకో బ్యాడ్ న్యూస్
అందుకే సీఎం రాజీనామా….
మార్చి 10న ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్సింగ్.. శుక్రవారం రాత్రి 11 గంటలకు డెహ్రాడూన్లోని రాజ్భవన్ కు చేరుకొని గవర్నర్ బేబీ రాణిమౌర్యకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పౌరి గర్హ్వాల్ నుంచి లోక్సభకు ఎంపికైన ఆయన.. ఆరు నెలల్లోగా అంటే.. సెప్టెంబర్ 10వ వరకు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. గడువు ముగిసేవరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమమని భావించారు.