ఈఎస్ ఐ స్కాం లో అరెస్టయిన అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటుండగా, అక్కడే విచారణ సాగుతుండగా.. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జేడీ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్ లను రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఏసీబీ అధికారులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సమయంలో అటు అధికారులు – ఇటు అచ్చెన్న ఇచ్చే సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయని.. అచ్చెన్న వల్లే అని వారంటే, తనకేం సంబందం లేదని, అధికారులకే ఆ హక్కు ఉందని అచ్చెన్న చెబుతున్నారంట!
వివరాళ్లోకి వెళ్తే… ఒకపక్క ఈఎసై అధికారులను, మరోపక్క అచ్చెన్నను విచారిస్తున్న క్రమంలో… ఏపీ సచివాలయం హైదరాబాద్ లో ఉన్న సమయంలో మూడు, అమరావతికి వచ్చిన తర్వాత రెండు సిఫారసు లేఖలు అచ్చెన్న ఇచ్చారని.. తమపై అచ్చెన్న ఒత్తిడి తెచ్చినట్లు ఈఎసై డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ అభియోగం మోపారని, అడిగిన ప్రశ్నకు… “ఆయా లేఖలను సంబంధిత అధికారులు సలహాగా మాత్రమే తీసుకుంటారు.. పైగా లేఖలు అనేవి సర్వసాధారణం” అని స్పందించారంట అచ్చెన్న !
ఇదే విషయంపై… అచ్చెన్న లేఖలు, సిఫారసుల వల్లే తాము నామినేషన్ పద్ధతిలో టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలు, మందులు, పరికరాల కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్టు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అంగీకరించారంట! మంత్రిస్థాయిలో వ్యక్తి బలంగా సిఫారసు చేయడం వల్లే ఈ పనులు చేయాల్సి వచ్చిందని నొక్కి వక్కానించినట్లు తెలుస్తోంది.