కొట్లాటలు చేసుకోకుండా ఉండే భార్యాభర్తలు ఉంటారా..? అది జరిగని పని అంటారా..? నిజమే.. ఎంత అన్యోన్య దంపతులైనా ఒక్కోసారి మాటామాటా వచ్చి కసురుకోక ఉండలేరు. అలాంటి సమయంలో భర్త భార్యను ప్రేమతో కౌగిలించుకుని తన ప్రేమను చూపిస్తుంటారు. ఇది సాధారణ మనుషులే కాకుండా సెలబ్రెటీలు కూడా చేస్తారు.
భార్యాభర్తలకు గొడవలు సర్వసాధారణం. అలాగే ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం కూడా సహజం. అయితే తప్పు చేసింది ఎవరైనా సరే భర్తే ముందుగా సారీ చెప్పడం ఆనవాయితి. వివాహ బంధం గట్టిగా ఉండాలంటే ఇది సహజమని భర్తలు చెప్తుంటారు. అయితే భర్తలు మాత్రమే కాదు.. మేముకుడా సారీ చెప్తామని ఓ అందాల తార చెప్తోంది. ఇప్పుడు అందుకు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఇక విషయానికి వస్తే..అభిషేక్ తో గొడవలు వస్తే ముందుగా తానే సారీ చెప్తానని అంటోంది ప్రపంచ సుందరి ఐశ్యర్య రాయ్ . తన భర్త అభిషేక్తో గొడవపడితే తానే ముందుగా క్షమాపణలు చెబుతానని అంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఇది పాత వీడియోనే. ఇందులో కపిల్ శర్మ, ఐశ్యర్య రాయ్, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు.
ఈ వీడియో విషయానికొస్తే కపిల్ శర్మ, ఐశ్వర్యతో మాట్లాడుతూ.. మీ భర్త అభిషేక్తో గొడవపడితే.. ముందుగా ఎవరు సారీ చెప్తారని అడుగుతాడు. అప్పుడు ఐశ్వర్య సమాధానం చెప్పక ముందే నవజోత్ మధ్యలో కల్పించుకుని.. ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. అభిషేకే ముందుగా సారీ చెప్తాడని అంటాడు.
దాంతో ఐశ్యర్య రాయ్ నవ్వుతూ.. అలా ఏం కాదు. అభిషేక్ తో గొడవపడితే ముందుగా నేనే సారీ చెప్తానని అంటుంది. అలాగే గొడవను కొనసాగించడం నాకు ఇష్టం ఉండదనీ.. అందుకే ముందుగా నేనే సారీ చెప్తానని అంటుంది. సమాధానం విన్న కపిల్ శర్మ ఒక్క క్షణం స్టన్ అవుతాడు. మీరు సారీ చెప్తారా.. అంటూ ఆశ్చర్య పోతాడు. అలాగే ఇంత అందమైన భార్య క్షమాపణలు కోరడం అంటే నిజంగా దేవుడి లీలే అని అంటాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు.
అభిషేక్,ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరికి ఇప్పుడు ఒక కూతురు ఉంది. తన పేరు ఆద్యా. ఈ మధ్య ఐశ్యర్య పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఈ సందర్భంగా అభిషేక్ తన ఇన్స్టా లో ఐశ్వర్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. వీరిద్దరు గులాబ్జామూన్ అనే చిత్రంలో యాక్ట్ చేయనున్నారు. అది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.