నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోర్ అంటూ వచ్చిన టీజర్ రికార్డ్ క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా ఈ వారంలో సెట్స్ మీదకి వెళబోతుందని సమాచారం. ద్వారక క్రియోషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ‘‘మోనార్క్” అన్న పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారట. కాగా ఈ సినిమాలో బాలయ్య కి జంటగా మలయాళ సినిమాల తో పాటు తమిళ సినిమాలలో ను నటించిన ప్రగ్యా మార్టిన్ ని తీసుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా బాలయ్య బిబి3 తర్వాత చేయబోయే సినిమా మీద రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తో సినిమా చేస్తాడన్న వార్త వచ్చింది. అలాగే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన నెక్స్ట్ సినిమాని మాస్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ తో చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు శ్రీవాస్ రామ రామ కృష్ణ కృష్ణ, లౌఖ్యం, సౌఖ్యం, డిక్టేటర్, సాక్ష్యం సినిమాలు తీశాడు. దాదాపు అన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సస్ అయినవే. అందులో బాలయ్య తో ఇప్పటికే డిక్టేటర్ తెరకెక్కించాడు కాబట్టి మరోసారి ఈ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయంటున్నారు. చూడాలి మరి అఫీషియల్ న్యూస్ ఎప్పుడు రానుందో.