Margadarsi Case: మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజీ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు రామోజీరావు, శైలజాకిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 420, 467, 120 – 8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. మార్గదర్శి లో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారనీ, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు.
2016 నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.1,59,69,600 కాగా రామోజీరావు కేవలం 39.74 వేల బ్యాంక్ చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను సంతకం పెట్టలేదనీ, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జనార్థన రెడ్డి రూ.5వేలు పెట్టుబడి పెట్టారని అందుకు గానూ మార్గదర్శిలో తన తండ్రి జనార్థనరెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని తెలిపారు.
తన తండ్రి మరణానంతరం మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్మెంట్ కోరగా చాలా కాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. 2016 సెప్టెంబర్ 29న రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమ షేర్లు వేరే వాళ్లకు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడంతో రామోజీరావు ఇచ్చిన చెక్కున నగదు గా మార్చలేదని, తమకు న్యాయం చేయాలని యూరిరెడ్డి ఏపీ సీఐడీని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.
అయితే సీఐడీ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టును విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను బుధవారం వింటామని హైకోర్టు తెలిపింది. రామోజీ, శైలజా కిరణ్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలను వినిపించనున్నారు.
T Congress: అలూలేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.. సీఎం పదవిపై సీనియర్ల ఆశలు