ఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు టిడిపి ఎంపిలు కంభంపాటి రామ్మోహనరావు, సిఎం రమేష్, కేశినేని నాని తదితరులతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.
పోలింగ్ ముగిసిన తరువాత 35 రోజులకుచంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందంటూ నిరసన తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నిరసన తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వైసిపి నేతల ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని రీపోలింగ్కు ఆదేశించారనీ, టిడిపి నేతలు ఇచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.