ఢిల్లీ: కూటమి ప్రభుత్వంతో ఎన్నటికీ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షాలు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 23న చారిత్రాత్మక తీర్పు రాబోతోందనీ, మళ్లీ సంపూర్ణ మెజార్టీ బిజెపి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో బిజెపి మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టామని వారు అన్నారు. కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకలను బిజెపి కార్యకర్తలు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారనీ. బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు.
‘2104లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు, ప్రజల ఆశీస్సులతో పూర్తి కాలం కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు అయింది’ అన్నారు. ఈ ఐదేళ్లలో మంచి పరిపాలన అందించామనీ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత జవాబుదారీతనం పెరిగిందని వారు అన్నారు.
గాంధీపై సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఈ వ్యాఖ్యలతో తాము విభేదిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.